News March 10, 2025
Rs 49000 కోట్లు: APతో టాటాపవర్ MOU

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టాటా పవర్ సబ్సిడరీ కంపెనీ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో 7000 MW సామర్థ్యంతో సోలార్, విండ్, హైబ్రీడ్ సహా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేయనుంది. పరిస్థితులను బట్టి స్టోరేజ్ సొల్యూషన్స్ నిర్మిస్తుందని తెలిసింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.49000 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందని అంచనా. ఎక్కడ నిర్మిస్తారో తెలియాల్సి ఉంది.
Similar News
News March 10, 2025
మరో అమ్మాయితో చాహల్.. ధనశ్రీ సంచలన పోస్ట్

టీమ్ ఇండియా క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘మహిళను బ్లేమ్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. దీంతో SMలో తనపై వచ్చిన కామెంట్స్పై ధనశ్రీ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. అటు నిన్న CT ఫైనల్ మ్యాచ్కు <<15704215>>చాహల్<<>> మరో అమ్మాయితో కలిసి వెళ్లిన వీడియోలు వైరల్ అయ్యాయి.
News March 10, 2025
ALERT.. నోటిఫికేషన్ విడుదల

AP: ECET-2025 నోటిఫికేషన్ను JNTU అనంతపురం విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 7వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా డిప్లొమా చదువుతున్న వారు ఇంజినీరింగ్, ఫార్మసీ సెకండియర్ సహా మరికొన్ని కోర్సుల్లో చేరవచ్చు. మే 6వ తేదీన ఉ.9-12 వరకు, మ.2-5 వరకు పరీక్ష జరుగుతుంది.
News March 10, 2025
ఇళ్లు కట్టుకునే వారికి GOOD NEWS

AP: ఇళ్లు కట్టుకునే SC, ST, BC లబ్ధిదారులకు అదనపు సాయం చేయడంపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50,000, STలకు రూ.75వేలు, గిరిజనులకు రూ.1లక్ష సాయం అందనుంది. PMAY(అర్బన్, గ్రామీణ్) బీఎల్సీ-1.0 కింద ఇప్పటికే మంజూరైన ఇళ్లకు సాయం లభించనుంది. దీనికి తోడు SHG సభ్యులకు జీరో వడ్డీపై రూ.35వేల రుణం, ఉచిత ఇసుక, ఇసుక రవాణాపై రూ.15వేలు అందిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు.