News August 11, 2025

సంచలనం: 5 బంతుల్లోనే టార్గెట్ ఛేదించారు

image

అండర్-19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫయర్ 2025లో సంచలనం నమోదైంది. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో కెనడా 5 బంతుల్లో టార్గెట్‌ను ఛేజ్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అర్జెంటీనా 19 ఓవర్లు ఆడి 23 పరుగులే చేసింది. ఏడుగురు డకౌటయ్యారు. కెనడా బౌలర్ జగ్‌మన్‌దీప్ 6 వికెట్లు తీసి 7 రన్స్ ఇచ్చారు. అనంతరం 24 పరుగుల టార్గెట్‌ను కెనడా 0.5 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ యువరాజ్ ఒక్కడే 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాదారు.

Similar News

News August 12, 2025

ALERT: రాష్ట్రంలో 3 రోజులు భారీ వర్షాలు

image

AP: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News August 12, 2025

మాజీ ఎమ్మెల్యేలు కన్నుమూత

image

AP: అన్నమయ్య(D) రాజంపేట మాజీ MLA కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి(78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1989లో రాజంపేట నుంచి INC MLAగా గెలిచారు. 1985, 1994, 2009లో పోటీ చేసి ఓడిపోయారు. అటు తిరుపతి(D) శ్రీకాళహస్తి మాజీ MLA తాటిపర్తి చెంచురెడ్డి కూడా తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1988 ఉపఎన్నికలో INC తరఫున MLAగా గెలిచారు.

News August 12, 2025

ట్రంప్ అండతో పాక్ అధ్యక్షుడిగా ఆసిమ్ మునీర్?

image

భారత్‌కు దూరమవుతున్న ట్రంప్ పాక్‌ను అక్కున చేర్చుకుంటున్నారు. ఈక్రమంలోనే ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ఆ దేశ అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. 2 నెలల్లో మునీర్ 2 సార్లు US వెళ్లారు. పాక్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధ్యక్ష పదవి దక్కించుకునేలా ట్రంప్‌తో కలిసి ప్లాన్ వేస్తున్నట్లు భారత విదేశాంగ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఇప్పటికే US గడ్డపై నుంచి మునీర్ భారత్‌పై విషం కక్కుతున్నారు.