News February 1, 2025
Stock Markets: బడ్జెట్కు ముందు మార్కెట్లు అప్
దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 25,555 (+50), సెన్సెక్స్ 77,695 (+210) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఐటీసీ హోటల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, బీఈఎల్, అల్ట్రాటెక్ సెమ్ టాప్ గెయినర్స్. హీరోమోటో, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, గ్రాసిమ్, ట్రెండ్ టాప్ లూజర్స్.
Similar News
News February 1, 2025
BUDGET 2025-26: ముఖ్యాంశాలు
*గిగ్ వర్కర్లకు ఐడీ కార్డులు.. ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు
*అన్ని ప్రభుత్వ పాఠశాలలకు బ్రాడ్బ్యాండ్ సౌకర్యం
*MSMEలకు రూ.10వేల కోట్లతో ఫండ్
*నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది రూ.10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు
*నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ బోర్డు
*సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు
*ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రులు
News February 1, 2025
BUDGET: మెడిసిన్ ఆశావహులకు స్వీట్ న్యూస్
మెడిసిన్ చదవాలనుకుంటున్న వారికి నిర్మలా సీతారామన్ ఒక స్వీట్ న్యూస్ చెప్పారు. రాబోయే ఐదేళ్లలో మెడికల్ సీట్లను మరో 75000 పెంచుతామని తెలిపారు. 2025-26లో 200 క్యాన్సర్ సెంటర్లను నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఇక యువత కోసం దేశవ్యాప్తంగా 5 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఆరంభిస్తామన్నారు. రూ.500 కోట్లతో విద్యలో AI ఎక్సలెన్సీ సెంటర్ పెడతామన్నారు.
News February 1, 2025
BUDGET 2025: రైతులకు మరో గుడ్న్యూస్
రైతులకు నిర్మలా సీతారామన్ మరో గుడ్న్యూస్ చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డుల (KCC) రుణ పరిమితిని రూ.3లక్షల నుంచి రూ.5Lకు పెంచుతున్నామని ప్రకటించారు. ఈ కార్డులతో లభించే స్వల్పకాల రుణాలతో 7.7 కోట్ల మంది రైతులు, జాలరులు, పాడి రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఇది వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతుందని పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలపై మాట్లాడారు.