News March 10, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓ ఇసుక అక్రమ రవాణా.. చర్యలు తీసుకుంటాం: మణుగూరు MRO ✓ రేపు భద్రాద్రి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ✓ రేపు పినపాక, కరకగూడెంలో పర్యటించనున్న ఎమ్మెల్యే పాయం ✓ పొదెం వీరయ్య, నాగ సీతారాములకు దక్కని ఎమ్మెల్సీ ✓ భద్రాద్రి: మాదిగలను మంత్రివర్గంలో తీసుకోవాలి: ఎమ్మార్పీఎస్ ✓ కొత్తగూడెం: మొక్కల ప్రేమికుడు విశ్వామిత్రను అభినందించిన హైకోర్టు జడ్జి ✓ పినపాకలో తల్లికి తలకొరివి పెట్టిన కూతుళ్లు.

Similar News

News March 10, 2025

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

image

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును బీజేపీ ప్రకటించింది. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోము వీర్రాజు గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ తరఫున గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, జనసేన నుంచి నాగబాబు పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి.

News March 10, 2025

భారత సంతతి విద్యార్థిని మిస్సింగ్

image

అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్ టూర్‌కు వెళ్లి ప్యూంటా కానా బీచ్ వద్ద అదృశ్యమయ్యారు. దీంతో ఆమె కోసం పోలీసులు హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో తీవ్రంగా గాలిస్తున్నారు. వర్జీనియాలో ఉంటున్న సుదీక్ష పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో చదువుతోందని ఆమె తండ్రి సుబ్బరాయుడు తెలిపారు.

News March 10, 2025

గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు: పెమ్మసాని

image

గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం ప్రకటించారు. PPP మోడల్‌లో ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అందులో భాగంగా గుంటూరు బస్టాండ్‌ను పరిశీలించి, స్థల సేకరణ, ఎలక్ట్రికల్ వాహనాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించటం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!