News April 11, 2025

‘పవర్ ప్లే’లో పవర్ చూపించలేకపోతున్న CSK

image

చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేలో(తొలి 6 ఓవర్లు) బ్యాటింగ్ పవర్ చూపించలేకపోతోంది. ఈ సీజన్‌లో పవర్ ప్లేలో అత్యల్ప రన్ రేట్ (7.04) కలిగిన జట్టుగా కొనసాగుతోంది. ఇవాళ KKRతో మ్యాచులో పవర్ ప్లేలో 31/2 చేసిన CSK అంతకముందు మ్యాచుల్లో 62/1 vs MI, 30/3 vs RCB, 42/1 vs RR, 46/3 vs DC, 59/0 vs PBKS చేసింది. దీంతో ఓపెనింగ్ జోడీని మార్చాల్సిన అవసరం ఉందని పలువురు క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.

News April 11, 2025

రేపు ఉ.11 గంటలకు..

image

AP: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రేపు ఉ.11 గం.కు విడుదల కాబోతున్నాయి. రిజల్ట్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు మీకెంతో ఇష్టమైన Way2News యాప్ ద్వారా వేగంగా తెలుసుకోవచ్చు. కేవలం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో డీటెయిల్డ్ మార్క్స్ లిస్ట్ మీ ముందుంటుంది. ఎలాంటి యాడ్స్ ఉండవు. మీ ఫలితాలను ఒక్క క్లిక్కుతో షేర్ చేసుకోవచ్చు.
*విద్యార్థులకు Way2News తరఫున BEST OF LUCK

News April 11, 2025

అమెరికాలో క్రిస్‌మస్‌ సంబరాలపై ట్రేడ్‌ వార్ ఎఫెక్ట్..?

image

US, చైనా ట్రేడ్‌ వార్ ఎఫెక్ట్ అమెరికాలో క్రిస్‌మస్‌ సంబరాలపై పడేలా కనిపిస్తోంది. ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌కు వినియోగించే డెకరేషన్ వస్తువులు 87శాతం వరకూ చైనా నుంచే దిగుమతి చేసుకుంటారు. కాగా ఇప్పుడు పెరిగిన సుంకాలతో వాటి ధరలు రెట్టింపవుతాయి. కనుక ఈ వస్తువులను కొనడం అమెరికన్లకు చాలా భారంగా మారుతుంది. ఏప్రిల్‌లోనే ఆర్డర్స్ రావాల్సి ఉన్నా ఈ సుంకాల పెంపుతో ఇప్పటివరకూ రాలేదని చైనా కంపెనీలు అంటున్నాయి.

News April 11, 2025

రేపు ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపు 61 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. కృష్ణా జిల్లా గన్నవరం, కంకిపాడు, పెదపారుపూడి, ఉంగుటూరు, ఉయ్యూరు మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంది. ఇవాళ అత్యధికంగా వైఎస్సార్(D) అట్లూరులో 41.4°C, ప్రకాశం(D) గుంటుపల్లిలో 41.2°C ఉష్ణోగ్రత నమోదయిందని తెలిపింది. వడగాలులు వీచే మండలాల లిస్ట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 11, 2025

అసలేంటీ కోనోకార్పస్ చెట్లు? ఎందుకింత చర్చ?

image

కోనోకార్పస్.. అమెరికా ఖండాల్లోని తీరప్రాంతానికి చెందిన మాంగ్రూవ్ జాతి మొక్క. వేగంగా పెరిగే ఈ మొక్కను ప్లాంటేషన్ నిపుణులు INDకు తెచ్చారు. చూడటానికి గుబురుగా, అందంగా కనిపిస్తాయి. కానీ ఈ చెట్లు <<16065381>>పర్యావరణ<<>>, ఆరోగ్య సమస్యలకు కారకాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి వేర్లు లోతుగా వెళ్లి తాగునీరు వ్యవస్థలు, భవనాలను సైతం దెబ్బతీస్తాయంటున్నారు. ఈ చెట్లు అందం కోసం తప్పితే మరెందుకూ పనికిరావనేది వారి వాదన.

News April 11, 2025

ఇంటర్ రిజల్ట్స్ భయం.. విద్యార్థి ఆత్మహత్య

image

AP: నంద్యాల జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయ్యవారి కోడూరుకి చెందిన బిజ్జం సుధీశ్వర్ రెడ్డి(18) ఇటీవల ఫస్టియర్ ఎగ్జామ్స్ రాశాడు. రేపు ఫలితాలు రానుండగా, ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఉరివేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
☛ పరీక్షల్లో ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు కాదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. మళ్లీ కష్టపడి చదివి పాసయ్యేందుకు ప్రయత్నించాలి.

News April 11, 2025

IRCTC సర్వర్ ప్రాబ్లమ్.. ప్రయాణికుల ఇబ్బందులు

image

రైలు టికెట్లు బుక్ చేసుకునే IRCTC సైట్ ఈ మధ్యాహ్నం నుంచి మొరాయిస్తోందని పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. సర్వర్ ప్రాబ్లమ్ వల్ల టికెట్ బుక్ చేసుకోలేకపోతున్నామని, చాలా ఇబ్బంది అవుతోందని చెబుతున్నారు. దీనిపై IRCTC ఇంకా స్పందించలేదు. మరి మీకు ఈ సమస్య ఎదురవుతోందా? కామెంట్ చేయండి.

News April 11, 2025

RECORD: అజిత్ కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్స్

image

అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నిన్న తొలి రోజు తమిళనాడులో రూ.30.9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆయన కెరీర్‌లో ఫస్ట్ డే కలెక్షన్స్‌లో ఇదే అత్యధికం అని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే రూ.50 కోట్ల వరకు రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో త్రిష, అర్జున్ దాస్, సిమ్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

News April 11, 2025

సన్నబియ్యం పంపిణీకి స్పందన అద్భుతం: మంత్రి ఉత్తమ్

image

TG: సన్నబియ్యం పంపిణీకి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో 2.8కోట్ల జనాభాకు దొడ్డు బియ్యం ఇచ్చేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేశారని, తాము 3.10కోట్ల మందికి సన్నబియ్యం ఇవ్వడానికి రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో పండని పంట కాంగ్రెస్ హయాంలో పడిందని, తమది రైతు పక్షపాత ప్రభుత్వమనే దానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.

News April 11, 2025

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు

image

ఆండ్రాయిడ్, IOS యూజర్లకు వాట్సాప్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇక నుంచి గ్రూపు సభ్యుల్లో ఎంత మంది ఆన్‌లైన్‌లో ఉన్నారో నంబర్ రూపంలో (EX: 5) కనిపిస్తుంది. అలాగే గ్రూపులో ప్రతీ మెసేజ్‌కు కాకుండా మనల్ని ఎవరైనా మెన్షన్ చేస్తే లేదా మన మెసేజ్‌కు రిప్లై ఇస్తే మాత్రమే నోటిఫికేషన్ వచ్చేలా మరో ఫీచర్‌ను తీసుకొచ్చింది. అటు ఐఫోన్లలో డాక్యుమెంట్లను స్కాన్ చేసి పంపించే ఆప్షన్‌నూ యాడ్ చేసింది.