India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రపంచ మార్కెట్లు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తారన్న వదంతులు వచ్చాయి. వాటిని ట్రంప్ కొట్టిపారేశారు. ‘మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు. కానీ చర్చలకు రావాలనుకునే ఏ దేశంతోనైనా సరే మాట్లాడేందుకు మేం సుముఖంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని ఆయనతో భేటీ అయ్యారు. ఇటు భారత్ కూడా ఆ విషయంలో అమెరికాతో చర్చల్లో ఉంది.
AP: తన కాన్వాయ్ వల్ల విశాఖ పెందుర్తిలో విద్యార్థులు పరీక్షకు ఆలస్యమయ్యారన్న వార్తలపై Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను ఎంత సేపు నిలిపారో, విద్యార్థులు వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఎలా ఉందోనన్న విషయాలపై విచారణ చేయాలని వైజాగ్ పోలీసుల్ని ఆదేశించారు. కాగా.. పవన్ కాన్వాయ్ వెళ్లిన సమయంలోనూ ట్రాఫిక్ను ఎక్కడా ఆపలేదని వైజాగ్ పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
TG: సీఎం రేవంత్ ఈరోజు గుజరాత్కు వెళ్లనున్నారు. అహ్మదాబాద్లో 2 రోజుల పాటు జరిగే ఏఐసీసీ ప్రత్యేక సమావేశాలకు ఆయన హాజరవనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి నిన్నే అక్కడికి చేరుకోగా మంత్రులతో కలిసి సీఎం నేడు పయనమవుతారు. బీసీ కులగణన, రిజర్వేషన్ల పెంపు తీర్మానంపై సీఎం ప్రసంగిస్తారని తెలుస్తోంది. రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో రేవంత్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారతీయులపై ప్రశంసలు కురిపించారు. ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఇండియన్స్ గురించి మాట్లాడారు. ‘భారతీయులు గొప్ప ప్రతిభావంతులు. సమస్యల్ని సులభంగా పరిష్కరించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. డిజిటల్ రంగంలోనూ ఇండియా శరవేగంగా దూసుకెళ్తోంది. భారత్లోని పేదలు కూడా చాలా తెలివైన వారు కానీ అవకాశాల్లేక వెనుకబడుతున్నారు’ అని పేర్కొన్నారు.
మయన్మార్ భూకంప విలయంలో మృతుల సంఖ్య 3600 దాటింది. భవనాల శిథిలాల్ని తొలగించే పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భారీ వర్షాలు, ఈదురుగాలులు వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అక్కడి అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతానికి 5017మంది గాయాలతో ఉండగా 160మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు.
నందమూరి బాలకృష్ణ వరుసగా యువ దర్శకులకు అవకాశాలిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హరీశ్ శంకర్తోనూ సినిమా చేయనున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ సిద్ధమైందని సమాచారం. మరోవైపు హరీశ్ రామ్ పోతినేనితోనూ ఓ సినిమా చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను హరీశ్ కంప్లీట్ చేయాల్సి ఉంది.
బాలీవుడ్ నటి మలైకా అరోరాపై ముంబైలోని ఓ కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2012లో నటుడు సైఫ్ అలీఖాన్, మలైకా, కరీనా తదితర స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్కి వెళ్లారు. అక్కడ మరో కస్టమర్తో గొడవ కాగా అతడిపై ఆయన దాడి చేశారు. అప్పటి నుంచీ ఆ కేసు విచారణలో ఉంది. సాక్షిగా ఉన్న మలైకా కోర్టుకు రాకపోవడంతో ఇప్పటికే ఓసారి వారెంట్ జారీ చేసిన కోర్టు, తాజాగా మరోసారి వారెంట్ ఇష్యూ చేసింది.
మరో 50శాతం టారిఫ్ విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న బెదిరింపులకు తాము లొంగే ప్రసక్తి లేదని చైనా తేల్చిచెప్పింది. ‘ఒత్తిడి పెట్టడమనేది మాతో మాట్లాడే విధానం కాదు. ఈ విషయం ఇదివరకే చెప్పాం. సరైన పద్ధతిలో చర్చలు జరపాలి. మా హక్కులు, ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ చర్య నుంచైనా మమ్మల్ని మేం కాపాడుకుంటాం’ అని చైనా రాయబారి లియూ పెంగ్యూ స్పష్టం చేశారు.
తనపై నమోదైన కేసులన్నీ కొట్టేయాలని కోరుతూ కమెడియన్ కునాల్ కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ‘శివసేన శిండే వర్గం నాపై పెట్టిన కేసులన్నీ నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవే. స్వేచ్ఛగా భావాన్ని వ్యక్తీకరించే హక్కు రాజ్యాంగం నాకు కల్పించింది. దయచేసి ఆ కేసుల్ని కొట్టేయండి’ అని అందులో కోరారు. కమ్రా పిటిషన్ను కోర్టు నేడు విచారించనుంది.
గుండెపోటు వచ్చే ప్రమాదం పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువని అమెరికా పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. ‘మగవారితో పోలిస్తే స్త్రీల ఓవరాల్ హెల్త్ బాగున్నా గుండెపోటు విషయంలో ప్రమాదం వారికే ఎక్కువగా ఉంటోంది. మధుమేహం, బీపీ వంటివి వస్తే పురుషులు తట్టుకున్నంతగా మహిళల దేహాలు తట్టుకోలేకపోతున్నాయి. ప్రెగ్నెన్సీ, మెనోపాజ్ వంటివి దీని వెనుక కారణం కావొచ్చు’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.