India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం: ఆర్డీటీ స్పోర్ట్స్ విలేజ్లో నిర్వహించే దులీప్ ట్రోఫీ కోసం పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అనంతపురం వద్దనున్న ఆర్డీటీ స్పోర్ట్స్ విలేజ్లో నిర్వహించే దులీప్ ట్రోఫీపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఆర్డీటీ, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
శ్రీసత్యసాయి జిల్లా నూతన వైసీపీ అధ్యక్షురాలిగా మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ను నియమించిన విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొలిసారి మహిళకు పార్టీ అధ్యక్ష పదవి అవకాశం దక్కింది. కురుబ సామాజికవర్గానికి చెందిన ఈమె గతంలో 2019-24 వరకు కళ్యాణదుర్గం ఎమ్యెల్యేగా పనిచేశారు. 2021-24 వరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగానూ పని చేశారు.
పుట్టపర్తిలోని 2వ వార్డులో దేవ అనే బాలుడు జ్వరంతో మరణించినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. బాలుడుకి ఆదివారం నుంచి జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా అక్కడ నయం కాకపోవడంతో సత్యసాయి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అనంతపురం సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. వారు అనంతపురం తీసుకెళ్లాగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా ఎంపిక చేసినట్లు ఆమె పార్టీ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఆమె ప్రస్తుతం పెనుకొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ఠపర్చాలని ఈనెల 6న అనంతపురం కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పిలుపునిచ్చారు. అనంతపురంలోని పాతఊరులో మంగళవారం కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలో విఫలమైందన్నారు. ప్రజలు భారీగా వచ్చి ధర్నాను విజయవంతం చెయ్యాలని కోరారు.
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఉద్యాన పంటలను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ధర్మవరం మండలంలోని నాగులూరు సమీపంలో ఉన్న చీని పంటను పరిశీలించి వ్యవసాయ అధికారులను ఉద్యాన పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు కారణంగా రైతులు తగు సూచనలు పాటించి, జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు.
★ భారత-సీ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (C), సుదర్శన్, పాటిదార్, పోరెల్, ఇంద్రజిత్, హృతిక్, సుథార్, గౌరవ్ యాదవ్, విజయ్ కుమార్, అన్సుల్, హిమాంషు చౌహాన్, మార్కండే, ఆర్యన్ జూయల్, వారియర్
★ భారత-డీ జట్టు: శ్రేయస్ అయ్యర్ (C), అతర్వ టైడే, యాష్ దూబే, పడిక్కల్, ఇషాన్ కిషన్, రికీబుయ్, శరాన్ష్ జైన్, అక్షర్ పటేల్, అర్షదీప్, ఆదిత్య, హర్షిత్ రాణా, దేశ్పాండే, ఆకాశ్ సెంగుప్తా, భరత్, సౌరభ్ కుమార్
రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా జాబ్ మేళా జరుగుతుందని సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. అందుకు సంబంధించి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జాబ్ మేళా క్యాలెండర్ ఆవిష్కరించారు. మంగళవారం ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, పెనుకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలయం అయింది. ఆహారం, విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సాయం చేసేందుకు అనంతపురం విద్యుత్ శాఖ సిబ్బంది విజయవాడకు వెళ్లారు. విద్యుత్ శాఖ ఎస్ఈ సంపత్ కుమార్ మాట్లాడుతూ.. విజయవాడలో విద్యుత్ మరమ్మతులు చేసేందుకు అనంతపురం నుంచి బృందం తరలి వెళ్లిందని చెప్పారు. వెళ్లిన వారిలో విద్యుత్ శాఖ ఈఈ రమేశ్, డీఈలు, ఏఈలు ఉన్నారని తెలిపారు.
పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జిల్లా ఎస్పీ వీ.రత్నతో పాటు పలువురు అధికారులు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఎస్పీ కార్యాలయానికి 63 వినతులు వచ్చాయి. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా సమస్యల పరిష్కారానికి అధికారులకు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్య పరిష్కరిస్తే పదేపదే కార్యాలయం చుట్టూ రారని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.