India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జగదీశ్ పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం PGRC కార్యక్రమంలో 63 పిటీషన్లు వచ్చినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఎస్పీ స్వయంగా వారి సమస్యను విని, సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించి, వారి సమస్యను పరిష్కరించాలని పోలీసులకు ఆయన సూచించారు.
అనంతపురం రూరల్ పరిధిలోని రాచానపల్లి వద్ద ఉన్న చెక్డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. సోమవారం 10వ తరగతి పరీక్ష రాసి స్నేహితులతో కలిసి చెక్ డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ మృతి చెందాడు. అతడికి ఫీట్స్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అనంతపురం రూరల్ పరిధిలోని మొబ్బు కొట్టాలలో వారి కుటుంబం నివసిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఎల్లనూరు మండల వ్యాప్తంగా అకాల వర్షం కారణంగా 971 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు హార్టికల్చర్ అధికారులు అంచనా వేశారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి హార్టికల్చర్ అధికారులు, వ్యవసాయ సిబ్బందితో కలిసి పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 215 మంది రైతులు సాగు చేసిన 971 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు.
ఎల్లనూరు మండల వ్యాప్తంగా అకాల వర్షం కారణంగా 971 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు హార్టికల్చర్ అధికారులు అంచనా వేశారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి హార్టికల్చర్ అధికారులు, వ్యవసాయ సిబ్బందితో కలిసి పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 215 మంది రైతులు సాగు చేసిన 971 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు.
కాపు రామచంద్రారెడ్డి తిరిగి సొంతగూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం రాయదుర్గం YCP ఇన్ఛార్జిగా ఉన్న గోవిందరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడంలేదు. పార్టీ క్యాడర్ నిరాశలో ఉంది. ఇదే సమయంలో తనకు BJPలో తగిన గుర్తింపు లభించకపోవడంతో రామచంద్రారెడ్డి తిరిగి YCPలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. జగన్ జిల్లాల టూర్లో వైసీపీలో కండువా కప్పుకునే అవకాశముంది.
కాపు రామచంద్రారెడ్డి తిరిగి సొంతగూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం రాయదుర్గం YCP ఇన్ఛార్జిగా ఉన్న గోవిందరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడంలేదు. పార్టీ క్యాడర్ నిరాశలో ఉంది. ఇదే సమయంలో తనకు BJPలో తగిన గుర్తింపు లభించకపోవడంతో రామచంద్రారెడ్డి తిరిగి YCPలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. జగన్ జిల్లాల టూర్లో వైసీపీలో కండువా కప్పుకునే అవకాశముంది.
యల్లనూరు మం. నీర్జాంపల్లికి చెందిన లక్ష్మీనారాయణ, చిన్నవేంగప్ప ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. శనివారం రాత్రి గాలివానలకు 20ఎకరాలలో అరటి తోట నేలకొరిగింది. అధికారులకు ఫోన్ చేస్తే ఆదివారం సెలవని, తాము రాలేమని సమాధానం చెప్పడంతో మనస్తాపం చెందిన రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. వారికి అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా కొనకొండ్ల రాజేశ్ ఎంపికయ్యారు. ఆదివారం అనంతపురం నగరం షిరిడి నగర్ లేడీస్ హాస్టల్లో కురుబ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమంలో కొనకొండ్ల రాజేశ్ను ఘనంగా సన్మానించారు. బీజేపీలో ఒక సాధారణ కార్యకర్తగా పనిచేసి, అంచలంచలుగా ఎదిగి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో కురుబ కులస్థులందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
గుంతకల్లు ఈద్గా మైదానంలో ఉపవాస దీక్షాపరులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ముందుగా మసీదులో సామూహిక ప్రార్థనలో నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షాపరులకు ఫలహారాలు ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఉపవాస దీక్షపరుల కోసం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందును ఎమ్మెల్యే, ఎంపీ ప్రారంభించారు.
కదిరికి చెందిన మనోహర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడని, నిజాంవళి కాలనీకి చెందిన షేక్ సోనీ అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.18 లక్షల రుణాలను తన పేరుతో వివిధ బ్యాంకుల్లో పొందాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని తిరిగి చెల్లించకుండా, తనను బెదిరిస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.