Anantapur

News July 18, 2024

భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వాతావరణ శాఖ హెచ్చరిక దృష్ట్యా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లాలోని బత్తలపల్లి, ఎన్పీ కుంట, నల్లమాడ, కదిరి, ఓడీసీ, నల్లచెరువు, హిందూపురం ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుకున్నారు.

News July 18, 2024

సుపరిపాలనకు అనంత కలెక్టర్ మరో ముందడుగు

image

అనంత జిల్లాలో సుపరిపాలనకు మరో అడుగు ముందుకు వేయడమే లక్ష్యంగా కలెక్టర్ వినోద్ కుమార్ మంచి ఆలోచనకు బీజం వేశారు. అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో మంచి ఫలితాలు సాధించడమే లక్ష్యంగా జిల్లాలో ఉన్న దాదాపు 103 శాఖల రోజువారి నివేదికలు అందించే విధంగా చర్యలు చేపట్టారు. ఆయా శాఖల పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, ఇతర కార్యక్రమాలు, అంశాలపై రోజు మానిటరింగ్‌పై దృష్టి పెట్టారు.

News July 18, 2024

అనంత: చదువు ఇష్టం లేక యువతి సూసైడ్

image

రాయదుర్గం మండలంలోని డీ.కొండాపురంలో జెస్సికా (16) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదువుకోవడం ఇష్టం లేకే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.

News July 18, 2024

సరిహద్దులో గట్టి నిఘా చర్యలు చేపట్టాలి: కలెక్టర్ టీఎస్ చేతన్

image

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఎక్సైజ్, సెబ్ పోలీస్ అధికారులతో కలెక్టర్ టీఎస్ చేతన్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా సరిహద్దు ప్రాంతాలలో గట్టి నిఘా చర్యలు చేపట్టి నాటుసారా, మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల పూర్తి నిర్మూలనకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News July 18, 2024

అనంత JNTU ఇన్‌ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ సుదర్శన రావు

image

అనంతపురం JNTU ఇన్‌ఛార్జ్ వీసీగా సీనియర్ ప్రొఫెసర్ హెచ్.సుదర్శన రావు నియమితులయ్యారు. ఈయన ఇదే జేఎన్టీయూలోనే బీటెక్ (1979-83) పూర్వ విద్యార్థి కావడం విశేషం. గతంలో ఈయన తన మెరిట్ ప్రతిపాదన క్రింద జేఎన్టీయూ రెక్టార్‌గా, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 2007లో ఏపీ ప్రభుత్వం నుంచి బెస్ట్ ప్రొఫెసర్ అవార్డును సైతం అందుకున్నారు.

News July 18, 2024

శ్రీ సత్యసాయి: రైలు నుంచి కిందపడి వ్యక్తి మృతి

image

ధర్మవరం-చిగిచెర్ల రైల్వే స్టేషన్ల మధ్య గురువారం గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి కిందపడి మృతిచెందినట్లు రైల్వే ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. చిగిచెర్ల సమీపంలో స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు. ఎవరైనా గుర్తిస్తే ధర్మవరం రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

News July 18, 2024

కర్నూలులో తాడిపత్రి వ్యక్తి దారుణ హత్య

image

కర్నూలులో బుధవారం <<13648791>>హత్య<<>> జరిగింది. తాడిపత్రికి చెందిన శ్రీరాములు యాచకుడిగా జీవిస్తున్నారు. అదే వృత్తిలో ఉన్న ఫాతిమాతో పరిచయం ఏర్పడింది. ఆమెకు ఐదుగురు పిల్లలు ఉండగా ఒక కూతురు శ్రీరాములు ద్వారా జన్మించినట్లు తెలిస్తోంది. ఆ కూతురితో పరశురాం అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. గొడవ జరగ్గా శ్రీరాములిని బండరాయితో కొట్టి పరశురాం హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

News July 18, 2024

పెనుకొండ మండలంలో హత్య.. కారణం ఏంటంటే

image

పెనుకొండ మండలంలో హత్య జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. నిందుతుడు గంగాధర్‌కు మతిస్థిమితం లేదు. తనను చంపేందుకు తండ్రి మనుషులను పంపుతున్నాడని గతంలో పోలీసు‌లకు ఫిర్యాదు చేశాడు. హిందూపురానికి చెందిన చిరువ్యాపారి చిన్నఅంజినప్ప గుట్టూరులోని కొల్హాపురి ఆలయంలో నిద్రపోయాడు. అర్ధరాత్రి గంగాధర్ ఆలయానికి వచ్చి తన తండ్రి తనను చంపేందుకే అంజినప్పను పంపాడని గొడవపడి తువాలుతో గొంతు బిగించి హత్య చేశాడు.

News July 18, 2024

ప్రజల్లో పోలీసు శాఖపై విశ్వాసం పెంచేందుకు కృషి: ఎస్పీ

image

ప్రజలకు జవాబుదారీతనంతో చట్టానికి లోబడి పోలీసు యంత్రాంగం విధులు నిర్వర్తించాలని ఎస్పీ వెలిసెల రత్న పేర్కొన్నారు. బుధవారం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి, ఇసుక అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసం పెంచుతూ సమన్వయంతో ముందుకెళ్తానన్నారు. సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.

News July 18, 2024

అనంత జిల్లాకు తుంగభద్రమ్మ రాక

image

తుంగభద్ర ప్రాజెక్టు నుంచి హెచ్చెల్సీకి ఈనెల 21 నీరు విడుదల చేయాలంటూ హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్ తుంగభద్ర మండలి ఎస్‌ఈకి బుధవారం ఇండెంట్ లేఖ పంపారు. 25వతేదీ వరకు 500 క్యూసెక్కులు, 26 నుంచి 31వరకు 750 క్యూసెక్కులకు పెంచాలని కోరారు. నీరు విడుదలచేస్తే 22కి జిల్లా సరిహద్దుకు చేరే అవకాశం ఉంది. ప్రధాన కాలువల ద్వారా కణేకల్లు చెరువుల్లోకి చేరి అక్కడ నుంచి ఏపీబీఆర్ జలాశయం, జీబీసీ కాలువకు ప్రవాహాలు కొనసాగుతాయి