India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోర్టు కేసుల పరిష్కారంలో ఆయా శాఖల అధికారులకు జవాబుదారీతనం ఉండాలని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. కోర్టు కేసులపై ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కోర్టు కేసులకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో నోడల్ అధికారులను నియమించామన్నారు.
అనంతపురంలోని నీలం సంజీవ రెడ్డి మైదానంలో జరుగుతున్న పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు 7వ రోజూ (మంగళవారం) కొనసాగాయి. ఉదయమే ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలను ఎస్పీ పీ.జగదీశ్ దగ్గరుండి పరిశీలించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పారదర్శకంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
అనంతపురం జిల్లాలో బాలయ్య ఫ్యాన్స్ సందడి మొదలైంది. ‘డాకు మహారాజ్’ ఈ నెల 12న రిలీజ్ కానుండటంతో ఆయా మండల కేంద్రాల్లో ‘డాకు’ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. థియేటర్ల వద్ద నందమూరి ఫ్యాన్స్ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. కదిరిలోని సంగం థియేటర్ వద్ద బాలయ్య నిలువెత్తు కౌటౌట్ ఏర్పాటు చేయగా ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ మూవీ ప్రీ రిలీజ్ <<15084871>>ఈవెంట్<<>> అనంతపురంలో జరుగుతుండటంతో జిల్లాలో ‘డాకు’ ఫీవర్ కనిపిస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి నీలకంఠాపురం చంద్రబావి గేట్ నుంచి బెంగళూరుకు కర్ణాటక ఆర్టీసీ బస్సులో వెళ్లారు. సామాన్య ప్రయాణికుడిలా తన లగేజీని తానే లగేజీ క్యారియర్పై పెట్టి బెంగళూరుకు టికెట్ తీసుకోని ప్రయాణించారు. అయనను చూసి బస్సులోని ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రఘువీరా సింప్లిసిటీకి ఫిదా అయ్యారు.
అనంతపురంలో ఈ నెల 9న ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న విషయం తెలిసిందే. సినీ తారలు సీమకు తరలిరానున్నారు. హీరో బాలకృష్ణ, కథానాయికలు ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, గ్లామర్ రోల్లో కనిపించిన ఊర్వశి రౌతేలా, దర్శకుడు బాబీ అనంతలో సందడి చేయనున్నారు. ముఖ్యఅతిథిగా మంత్రి నారా లోకేశ్ రానున్నారు. బాలయ్య ఫ్యాన్స్ ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ARTS కళాశాల మైదానంలో ఈవెంట్ జరగనుంది.
అనంతపురం JNTU పరిధిలో గత సంవత్సరం నవంబర్, డిసెంబర్లో నిర్వహించిన MBA 3, 4 సెమిస్టర్లు, MCA 3, 4, 5 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.
చైనాలో గుర్తించిన హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కి సంబంధించిన కేసులు జిల్లాలో ఎక్కడా నమోదు కాలేదని సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఈ బి దేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైరస్ పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. న్యూమో వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
కూడేరు మండలంలో ఓ దున్నపోతు రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపింది. అమ్మవారికి విడిచిన దున్నపోతు తమదంటే తమదని కడదరకుండ, ముద్దలాపురం గ్రామ ప్రజలు వాదనలకు దిగారు. అయితే ఈ సమస్య చిలికి చిలికి గాలివానగా మారి సోమవారం అనంతపురం ఎస్పీ కార్యాలయానికి చేరింది. దీంతో ఇరు గ్రామాల వారు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
అనంతపురంలో టమాటా ధరలు బాగా పడిపోయాయి. నిన్న కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.10 పలికిందని రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ వెల్లడించారు. మరోవైపు కనిష్ఠ ధర రూ.6గా నమోదైందన్నారు. మొత్తంగా నిన్న ఒక్కరోజు మార్కెట్కు 1050 టన్నులు రాగా సరాసరిగా కిలో టమాటా రూ.8 పలికింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆదివారం పలు విషాద ఘటనలు జరిగాయి. ఒక్కరోజే ఏడుగురు చనిపోయారు. రొద్దం, పెద్దపప్పూరు, తాడిపత్రిలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పెనుకొండలో ఆవు అడ్డు రావడంతో<<15074331>> మహిళ<<>> , అనంతపురంలో డివైడర్ ఢీకొని ఇంటర్ <<15073707>>యువకుడు<<>> చనిపోయారు. అలాగే గుత్తి ఆర్టీసీ కండక్టర్ గుండెపోటుతో కన్నుమూశారు.అలాగే శనివారం అర్ధరాత్రి దాటాక పెద్దవడుగూరు హైవేపై ఐచర్ వాహనం ఢీకొని మరొకరు చనిపోయారు.
Sorry, no posts matched your criteria.