India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన భార్యాభర్తలు గ్రూప్-2లో ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు. పట్టణానికి చెందిన వినీత సబ్ రిజిస్ట్రార్గా, భర్త హేమచంద్ర ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో పనిచేస్తున్న సమయంలో నోటిఫికేషన్ రావడంతో ఉద్యోగాలకు రిజైన్ చేసి ప్రిపేర్ అయ్యామని Way2newsకు వారు తెలిపారు.

చెళ్లకెర వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ పంటకు రికార్డు స్థాయి ధర లభించింది. శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన రైతులు నాగభూషణ గౌడ, మంజన్న, పెన్నప్ప పండించిన వేరుశనగ క్వింటా ధర రూ.12,810 పలికింది. నాణ్యమైన దిగుబడి సాధించినందుకు మార్కెట్ యార్డ్ యజమానులు రంగస్వామి, ఈరన్న రైతులను సన్మానించారు. ఈ ధర ఇతర రైతుల్లో ఆనందాన్ని నింపింది.

అనంతపురం JNTUలో ఐదుగురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ బుధవారం వైస్ ఛాన్స్లర్ హెచ్.సుదర్శన రావు, రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్న బి.వెంకటేష్, పి.రాధ, ఎన్.చందురాణి సీనియర్ అసిస్టెంట్లుగా, సూపరింటెండెంట్గా ఉన్న ఎస్.మహేశ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా, సీనియర్ అసిస్టెంట్గా ఉన్న ఎస్.నాగప్ప సూపరింటెండెంట్గా పదోన్నతులు పొందారు.

జనవరి 31న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విష్ణు చరణ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 1న సెలవు దినం కావడంతో ఒక్కరోజు ముందుగానే జిల్లాలో పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతపురం జిల్లాలో 2,77,685 పెన్షనర్లకు రూ.123.88 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

పామిడి మం. ఎద్దులపల్లికి చెందిన శివ ప్రసాద్ గ్రూప్-2 ఫలితాల్లో ప్రతిభ చాటి డిప్యూటీ తహశీల్దార్ పోస్టుకు ఎంపికయ్యారు. ఎస్కేయూలో ఎం.కామ్ పూర్తి చేసిన ఆయన, గతంలో పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహించారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తుండగా పట్టుదలతో చదివి కొలువు సాధించారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆయన పేరు ఉండటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ శివ ప్రసాద్ను అభినందించారు.

ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ పి.జగదీశ్ స్పష్టం చేశారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి చెందిన రౌడీషీటర్ మంజుల నవీన్పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇతనిపై 2014 నుంచి 12 కేసులు ఉండగా, గతంలో పీడీ యాక్టు కూడా నమోదైంది. నిబంధనలు అతిక్రమించినందుకు గాను బైండోవర్ ష్యూరిటీగా ఉన్న రూ. 50 వేల నగదును తహశీల్దార్ ద్వారా జరిమానాగా కట్టించారు.

ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ పి.జగదీశ్ స్పష్టం చేశారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి చెందిన రౌడీషీటర్ మంజుల నవీన్పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇతనిపై 2014 నుంచి 12 కేసులు ఉండగా, గతంలో పీడీ యాక్టు కూడా నమోదైంది. నిబంధనలు అతిక్రమించినందుకు గాను బైండోవర్ ష్యూరిటీగా ఉన్న రూ. 50 వేల నగదును తహశీల్దార్ ద్వారా జరిమానాగా కట్టించారు.

ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ పి.జగదీశ్ స్పష్టం చేశారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి చెందిన రౌడీషీటర్ మంజుల నవీన్పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇతనిపై 2014 నుంచి 12 కేసులు ఉండగా, గతంలో పీడీ యాక్టు కూడా నమోదైంది. నిబంధనలు అతిక్రమించినందుకు గాను బైండోవర్ ష్యూరిటీగా ఉన్న రూ. 50 వేల నగదును తహశీల్దార్ ద్వారా జరిమానాగా కట్టించారు.

ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ పి.జగదీశ్ స్పష్టం చేశారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి చెందిన రౌడీషీటర్ మంజుల నవీన్పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇతనిపై 2014 నుంచి 12 కేసులు ఉండగా, గతంలో పీడీ యాక్టు కూడా నమోదైంది. నిబంధనలు అతిక్రమించినందుకు గాను బైండోవర్ ష్యూరిటీగా ఉన్న రూ. 50 వేల నగదును తహశీల్దార్ ద్వారా జరిమానాగా కట్టించారు.

ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ పి.జగదీశ్ స్పష్టం చేశారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి చెందిన రౌడీషీటర్ మంజుల నవీన్పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇతనిపై 2014 నుంచి 12 కేసులు ఉండగా, గతంలో పీడీ యాక్టు కూడా నమోదైంది. నిబంధనలు అతిక్రమించినందుకు గాను బైండోవర్ ష్యూరిటీగా ఉన్న రూ. 50 వేల నగదును తహశీల్దార్ ద్వారా జరిమానాగా కట్టించారు.
Sorry, no posts matched your criteria.