Anantapur

News July 17, 2024

లోకేశ్ అన్నకి థాంక్స్: పరిటాల శ్రీరామ్

image

మంత్రి నారా లోకేశ్‌ను ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కలిశారు. ఉండవల్లిలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు శ్రీరామ్ తెలిపారు. ‘ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రితో చర్చించా. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై ఇరువురం మాట్లాడుకున్నాం. ప్రతి అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన లోకేశ్ అన్నకి ధన్యవాదాలు’ అని శ్రీరామ్ ట్వీట్ చేశారు.

News July 17, 2024

Way2News కథనం.. స్పందించిన MLA బండారు శ్రావణి

image

శింగనమల నియోజకవర్గం పుట్లూరులో 15 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంపై ఇటీవల Way2News స్పెషల్ స్టోరీ <<13523159>>పబ్లిష్<<>> చేసింది. ఈ వార్తకు స్పందించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి బుధవారం స్వయంగా కళాశాల భవనాన్ని పరిశీలించారు. ఆ భవనాన్ని ఎస్సీ వసతి గృహానికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని సౌకర్యాలపై నివేదిక అందించాలని అధికారులకు సూచించారు.

News July 17, 2024

అనంత: ఎస్కేయూ వసతి గృహంలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

అనంతపురం పట్టణంలోని ఎస్కే యూనివర్సిటీ వసతి గృహంలో మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. యువతి ఉంటున్న గదిలో ఫ్యాన్‌కి వేలాడుతుండగా అక్కడే ఉన్న గమనించిన తోటి విద్యార్థులు వెంటనే వెళ్లి కిందకు దించారు. విద్యార్థినిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మౌనిక ఎస్కే యూనివర్సిటీలో ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతోంది. మౌనిక స్వగ్రామం పులివెందులని తోటి స్నేహితులు తెలిపారు.

News July 17, 2024

పెనుకొండ మండలంలో హిందూపురం వాసి హత్య

image

పెనుకొండ మండలంలోని గుట్టూరు సమీపంలోని ఓ ఆలయం వద్ద హిందూపురానికి చిన్న అంజప్ప (55)బుధవారం హత్యకు గురయ్యారు. పూజ సామాగ్రి అమ్ముకునే చిన్న అంజప్ప ఆలయం వద్ద నిద్రిస్తుండగా గంగాధర్ మధ్య వాగ్వాదం జరిగింది. టవల్‌తో గొంతు బిగించి హత్య చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ రంగుడు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 17, 2024

అనంత: మొహర్రం వేడుకల్లో అపశ్రుతి

image

ఉరవకొండ మండలం చిన్న కౌకుంట్లలో ప్రమాదవశాత్తు పీర్ల అగ్నిగుండంలో పడి ఆదినారాయణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మొహర్రం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున పీర్లను ఎత్తుకుని అగ్నిగుండం ప్రవేశం చేశారు. వారి వెనుకే ఉన్న ఆది కాలు జారి అగ్నిగుండంలో పడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని బయటికి తీశారు. అప్పటికే 90 శాతం కాలిపోయాడు. వెంటనే అతణ్ని 108లో అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

News July 17, 2024

గుంతకల్లులో భార్య గొంతుకోసి హత్య.. వివరాలు

image

గుంతకల్లులో గొంతుకోసి భార్యను హతమార్చిన సంగతి తెలిసిందే. చిన్నపులికొండ రంగస్వామితో సాయితేజకు రేండేళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. వీరికి 9నెలల పాప ఉంది. సోమవారం రాత్రి భార్యను అదనపుకట్నం తీసుకురావాలని కోరగా.. ఆమె ఒప్పుకోకపోవడంతో గొడవ జరిగింది. దీంతో సెల్‌ఫోన్ ఛార్జర్ వైరుతో భార్య గొంతు బిగించి కత్తితో గొంతుకోసి పాపతో పరారయ్యాడు. మెుహర్రం వేడుకల్లో ఉన్న యువకులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

News July 17, 2024

అనంతపురం: ప్రసవం వరకు గర్భాన్ని దాచిన యువతి

image

డి.హీరేహాళ్ మండలంలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి బెంగళూరుకు వెళ్లింది. అక్కడ అదే ఊరికి చెందిన యువకుడితో ప్రేమ మొదలై గర్భం దాల్చింది. దీంతో ఇంటికి వచ్చి ఈ విషయం ఎవరికీ చెప్పకుండా గర్భం కనపడకుండా దాచుకుంటూ వచ్చింది. నిన్న నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అవాక్కైన తండ్రి ఆ యువకుడితోనే పెళ్లి చేస్తామన్నారు.

News July 17, 2024

స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి

image

అనంతపురం జిల్లాలో దివ్యాంగులైన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల జిల్లా ఏడీ అబ్దుల్ రసూల్ తెలిపారు. 9,10వ తరగతులు, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఆపై చదువుతున్న దివ్యాంగులు www.scholarships.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 9,10 విద్యార్థులు ఆగస్టు 31, ఇంటర్ ఆపై విద్యార్థులు అక్టోబరు 31లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 17, 2024

ఉత్తమ టీచర్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

జాతీయ స్థాయి ఉత్తమ టీచర్ అవార్డులు-2024కు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 21వ తేదీ వరకూ అవకాశం ఉందని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్య ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో పనిచేసే టీచర్లు, హెచ్ ఎంలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలన్నారు. దరఖాస్తు చేసిన తర్వాత వాటిని ధ్రువీకరణ అధికారితో ధ్రువీకరించి డీఈఓ ఆఫీస్లో అందజేయాలన్నారు.

News July 17, 2024

పామిడి: విద్యుత్ శాఖ లైన్‌మెన్‌లపై దాడి.. కేసు

image

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు లైన్‌మెన్లపై ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేసిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల వివరాలు.. కరెంటు బిల్లుల వసూళ్లలో భాగంగా పామిడి మండలం దిబ్బసానిపల్లికి సీనియర్ లైన్‌మెన్ కృష్ణానాయక్, జూనియర్ లైన్‌మెన్ స్టీఫెన్ వెళ్లారు. ఆ సమయంలో రంగేశ్ వారిపై దుర్భాషలాడుతూ చెప్పులతో దాడికి తెగబడ్డినట్లు ఏఈ మధుసూదన్ రావుతో కలిసి పామిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.