Anantapur

News January 6, 2025

అనంతపురంలో పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని స్థానిక నీలం సంజీవరెడ్డి మైదానంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు APSLPRB అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8, 9 & 10 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను.. 17, 18 & 20 వ తేదీలకు మార్పు చేస్తూ వాయిదా వేశారు. వైకుంఠ ఏకాదశి పండుగ , ఇతర శాంతి భద్రతల కారణాలతో 3 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.

News January 6, 2025

అనంతపురానికి రానున్న నారా లోకేశ్

image

అనంతపురంలోని ARTS కళాశాల మైదానంలో జనవరి 9న నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాయలసీమలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News January 5, 2025

రొద్దం: వాట్సాప్ స్టేటస్ పెట్టి యువకుడి ఆత్మహత్య

image

శ్రీసత్యసాయి జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రొద్దం మండలం రాచూరుకు చెందిన సోమిరెడ్డి(28) యువకుడి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. చెల్లికి పెళ్లి కాగా అతను తన తల్లితో కలిసి ఉంటున్నాడు. అప్పుడప్పుడు కారు డ్రైవింగ్‌కు వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ‘నా చావుకు నేనే కారణం’ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. కాసేపటికే రొద్దం-పెనుగొండ మార్గంలోని LGB నగర్ వద్ద చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు.

News January 5, 2025

గొడిసెలపల్లికి 16 ఏళ్ల తర్వాత ఆర్టీసీ బస్సు

image

డీ.హీరేహాళ్ మండలం గొడిసెలపల్లికి శనివారం RTC బస్సు వచ్చింది. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా.. ఉంది. 16 ఏళ్లుగా ఆ ఊరికి RTC బస్సు సర్వీసు లేదు. కలెక్షన్స్ తగ్గాయని అప్పట్లో బస్సును రద్దు చేశారు. అప్పటి నుంచి ఆటోలు, బైకులపై గ్రామస్థులు ప్రయాణాలు సాగిస్తున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు పలుమార్లు వేడుకున్నారు. చివరికి రాయదుర్గం MLA శ్రీనివాసులు చొరవతో ఆర్టీసీ బస్సును ప్రారంభించారు.

News January 5, 2025

లింగ నిర్ధారణ నిషేధిత చట్టంపై కలెక్టర్ సమావేశం

image

అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం అధికారులతో కలెక్టర్ వినోద్ కుమార్ సమావేశమయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలు పరిచే గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం అమలుపై జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. లింగ నిర్ధారణ నిషేధిత చట్టం పక్కాగా అమలు కావాలన్నారు.

News January 4, 2025

ఈనెల 6 నుంచి దివ్యాంగుల పింఛన్ల సామాజిక తనిఖీ

image

అనంతపురం జిల్లాలో ఈ నెల 6 నుంచి ఎన్టీఆర్ దివ్యాంగుల పింఛన్లు సామాజిక తనిఖీలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఒక కార్యక్రమంలో తెలిపారు. అన్ని మండలాలు, మున్సిపాలిటీలలో తనిఖీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈనెల 6 నుంచి 10 వరకు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. తనిఖీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు.

News January 4, 2025

సత్యసాయి విమానాశ్రయంలో మెరుగైన భద్రత కల్పిద్దాం: కలెక్టర్

image

సత్యసాయి విమానాశ్రయంలో మెరుగైన భద్రత కల్పిద్దామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. శనివారం విమానాశ్రయంలో ఎయిర్‌పోర్టు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ ఛైర్మన్ హోదాలో భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. విమానాశ్రయంలో భద్రతాపరమైన సమస్యలు తలెత్తినప్పుడు ఏయే శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు.

News January 4, 2025

అనంతపురంలో ‘డాకు మహారాజ్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్!

image

అనంతపురంలోని ARTS కళాశాల మైదానంలో జనవరి 9న హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ మేరకు మేకర్స్ నిర్ణయించినట్లు బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇక సీమ గడ్డపై డాకు మహారాజ్ సందడి చేయనుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News January 4, 2025

కబళించిన మృత్యువు!

image

ఊర్లో దేవర. కొత్త దుస్తుల కోసం ఆ దంపతులు అనంతపురం జిల్లా యాడికి వెళ్లారు. సంతోషంగా తిరుగుపయణం అవగా వారి బైక్‌ను బొలెరో ఢీకొంది. ఈ విషాద ఘటనలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన రాజశేఖర్ (38), సుమలత (35) మరణించారు. కొత్త దుస్తుల కోసం పాఠశాల నుంచి హుషారుగా ఇంటికి వచ్చిన పిల్లలు పూజిత, మిథిల్ తల్లిదండ్రుల శవాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటనతో ఇద్దరు చిన్నారులూ అనాథలయ్యారు.

News January 4, 2025

తోపుదుర్తి చందశేఖర్ రెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు

image

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందశేఖర్ రెడ్డిపై టీడీపీ నేతలు పరశురామ్, విజయకుమార్ జిల్లా ఎస్పీ జగదీశ్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో చంద్రబాబు, నారా లోకేశ్‌‌ను దూషిస్తూ వ్యక్తిగతంగా దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆ రోజే అనుకొని ఉండుంటే మొద్దు శ్రీనుతో లోకేశ్‌ని చంపించేవాడని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలిపారు.