Anantapur

News March 2, 2025

కూడేరు రోడ్డు ప్రమాదం.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

image

కూడేరు మండలం కమ్మూరు వద్ద ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. సరస్వతి(32) అక్కడిక్కడే మృతిచెందగా.. ఆమె కూతురు 3 నెలల చిన్నారి విద్యశ్రీ, నీలమ్మ(42), యోగేశ్వరి(40) అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. జ్ఞానాన్షిక, అచ్చిత్ కుమార్ స్వామి, ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. పెన్నహోబిలం నుంచి అనంతపురం PVKK కళాశాల విద్యార్థులు కారులో వస్తూ ఆటోను ఢీకొట్టారు.

News March 2, 2025

అనంత: వడిబియ్యం పోసుకొని వస్తూ తల్లి, కూతురు దుర్మరణం

image

అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. కూడేరు సమీపంలో ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఉరవకొండ మండలం రాయంపల్లికి చెందిన సరస్వతి(32), ఆమె కూతురు 3 నెలల చిన్నారి విద్యశ్రీ మృతిచెందారు. మృతురాలు గార్లదిన్నె మండలం మర్తాడులో వడిబియ్యం పోసుకొని బంధువులతో కలిసి మెట్టినింటికి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇదే ప్రమాదంలో గాయపడిన నీలమ్మ(50) చికిత్స పొందుతూ మృతిచెందారు.

News March 2, 2025

అనంత: విషాదం.. తల్లితో పాటు 3 నెలల కుమార్తె మృతి

image

కూడేరు మండలం కమ్మూరు గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమార్తె మృతిచెందారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో ఆటోలో ఉన్న సరస్వతి, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కుమార్తె 3 నెలల చిన్నారి మృతిచెందారు. ఆటోలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఉన్న ఇద్దరు స్వల్పంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు.

News March 2, 2025

అనంత: రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

image

కూడేరు మండలం కమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొన్న ఘటనలో సరస్వతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ రాజు, ఆయన సిబ్బంది ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

News March 2, 2025

ఉరవకొండ : కేజీ చికెన్ ఎంతంటే..?

image

బర్డ్ ఫ్లూ కారణంగా దాదాపు నెల రోజుల పాటు చికెన్‌కు దూరంగా ఉన్నారు. అటు మటన్ తినాలని ఉన్నా మధ్య తరగతి ప్రజలు రేట్లు చూసి తినలేక పోయారు. ప్రస్తుతం కేసులు లేకపోవడంతో చికెన్ మార్కెట్లు వద్ద ప్రజలు భారీగా కొనుగోళ్ల చేస్తున్నారు. ప్రస్తుతం ఉరవకొండలో కేజీ చికెన్ ధర రూ..170- 180 వరకు ఉంది. మటన్ కేజీ రూ.700, చేపలు రూ.120 ఉంది. మరి మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ చేయండి.

News March 2, 2025

గోరంట్లలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

గోరంట్ల మండలం బూచేపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ షాక్ తగిలి రైతు శివప్ప (33) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. వ్యవసాయ పొలంలో విద్యుత్ తీగలు నేలపై ఉండడంతో వాటిని ఎత్తులో కట్టేందుకు కట్టెలు నాటుతుండగా చేతికి విద్యుత్ తీగల తగిలి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు సీఐ శేఖర్ తెలిపారు.

News March 2, 2025

కనేకల్ : రెండు నాటు తుపాకుల కలకలం

image

కనేకల్లు మండల పరిధిలోని సొల్లాపురం గ్రామ శివారులో శనివారం రెండు నాటు తుపాకుల కలకలం రేపాయి. అటుగా వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. నాటు తుపాకులు ఎవరివి అనే విషయంపై ఆరా తీస్తున్నారు. నాటు తుపాకులు దొరకడంతో సొల్లాపురం గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.

News March 2, 2025

లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తే చర్యలు: కలెక్టర్

image

గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధిత చట్టం పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో డిస్టిక్ మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో అన్ని స్కాన్ సెంటర్లను పకడ్బందీగా తనిఖీ చేయాలన్నారు. అలాగే ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News March 2, 2025

ఈనెల 3న రాప్తాడులో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”

image

ఈనెల 03వ తేదీన రాప్తాడులో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వినోద్ శనివారం తెలిపారు. రాప్తాడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈనెల 03వ తేదీన సోమవారం ఉదయం 9 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారన్నారు.

News March 2, 2025

అనంత: చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

తాడపత్రి మండలం ఎర్రగుంట్లలో వ్యక్తిగత ఇంకుడు గుంతకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ, తడి, పొడి చెత్త విభజన వర్మి కంపోస్టు తయారీ విధానం గురించి వివరించారు. చెత్త నుంచి తయారైన ఎరువుల ప్యాకెట్ల రేట్లు తదితర వివరాలను కలెక్టర్ అడిగారు.