India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలలో యాక్టివిటీలను నిర్వహించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పంచాయతీ సెక్టార్ తదితర అంశాలపై DWMA PD, ZP CEO, ఆర్డీఓలు, డీఎల్డీఓలు, MPDO, EORD తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు.

ఉపాధి హామీ పనుల్లో కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా పురోగతి తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉపాధి హామీ పథకం పనులు, హౌసింగ్ తదితర అంశాలపై డ్వామా, హౌసింగ్ పీడి, ఎంపీడీవోలు, ఏపీడీలు, ఏపీఎంలకు వీటిపై పలు సూచనలు చేశారు.

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో యూనివర్సిటీ అధికారులు సోమవారం సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ చేపట్టారు. ఇటీవల 2 కౌన్సెలింగ్లలో సీట్లు కేటాయించడంతో అలాట్మెంట్ ఆర్డర్తో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి సీట్ల అలాట్మెంట్కి హాజరయ్యారు. ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర, సిబ్బంది ధ్రువ పత్రాలను పరిశీలించారు.

యూరియా వినియోగంపై అధికారులు నిఘా ఉంచాలని కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం ఆదేశించారు. జిల్లాకు ఈ ఏడాది ఖరీఫ్లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 26,839 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, మొత్తం 29,527 మెట్రిక్ టన్నుల యూరియా లభ్యత ఉందన్నారు. 26,008 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయించగా, ఇంకా 3,519 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశముందని, అనంతపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు, రైతులు, కూలీలు టవర్లు, చెట్లు, బహిరంగ ప్రదేశాలలో ఉండవద్దన్నారు. సురక్షితమైన ప్రాంతంలో ఉండాలని సూచించారు.

PGRS అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు.
అనంతపురంలోని ఆయా శాఖల జిల్లా అధికారులు నాణ్యతగా అర్జీలను పరిష్కరించాలన్నారు. ఇందులో ఎలాంటి అలసత్వం వహించరాదన్నారు. రీఓపెన్ కాకుండా అర్జీలను సకాలంలో, గడువులోగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టి ప్రజలకు న్యాయం చేయాలన్నారు.

బైక్ ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వీరాంజనేయులు కుమారుడు కార్తీక్ (5)రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ బైక్పై రంగచేడు గ్రామం నుంచి వస్తూ ప్రమాదవశాత్తు బాలుడిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన శ్రావణి అనే గర్భిణి ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్తమామలను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అత్తారింటి వేధింపులు భరించలేక ఈ నెల 14న పుట్టింటికి వెళ్లిన శ్రావణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు కారణమైన భర్త శ్రీనివాసులు, మామ శివప్ప, భర్త కరియమ్మలను ఇన్ఛార్జి డీఎస్పీ శ్రీనివాసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. జడ్జి రిమాండ్ విధించారు.

యల్లనూరు (మం) జంగంపల్లికి చెందిన నాగ మల్లేశ్ పై పోక్సో కేసు నమోదైంది. తాడిపత్రికి చెందిన బాలికను నమ్మించి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టి బాలికను కుటుంబీకులకు అప్పగించి, యువకుడిపై కేసు నమోదు చేశామన్నారు.

అనంతపురం JNTUలో బీటెక్ స్వీడన్ బ్యాచ్ కోర్స్లో CSE-3, ECE-7 సీట్లను స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తున్నట్లు వీసీ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్ సుజాత తెలిపారు. వివరాలకు JNTUలోని డైరెక్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు ఏడాదికి రూ.1,50,000 కోర్స్ ఫీజు ఉంటుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.