India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని మంత్రి సవిత మర్యాదపూర్వకంగా కలిశారు. వెలగపూడి కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పెనుకొండ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రితో చర్చించినట్లు తెలిపారు.
భారత్ బాస్కెట్ బాల్ టీంలో అనంతపురం నగరానికి చెందిన కే.ద్వారకనాథ్ రెడ్డికి చోటు దక్కడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ద్వారకనాథ్ రెడ్డి మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా అతడిని వినోద్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మంగళవారం గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చిన రోగికి క్షణం ఆలస్యం చేయకుండా ఇంజక్షన్ ఇచ్చి బతికించారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజుల గ్రామానికి చెందిన చిన్న ఓబులేసు అనంతపురం వెళ్తుండగా గుత్తి సమీపంలో ఛాతీ నొప్పికి గురయ్యారు. వెంటనే గుత్తి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్లప్ప గుండెపోటును నివారించే ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించారు.
అనంతపురం జిల్లా టీడీపీ నేత జేసీ పవన్కు కీలక నామినేటెడ్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్వతహాగా క్రీడలపట్ల మక్కువ చూపే పవన్ గతంలో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈసారి ఏకంగా ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ క్రీడాకారులతో పవన్కు పరిచయాలు ఉండటంతో కూటమి సర్కారు ఈ అవకాశం కల్పించనున్నట్లు ప్రచారం సాగుతోంది.
రాష్ట్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డితో బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత మంగళవారం వెలగపూడి సచివాలయంలో భేటీ అయ్యారు. పెనుకొండ నియోజకవర్గంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. చాలా గ్రామాలకు అంతర్గత రోడ్లు లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. సీసీ రోడ్లు గ్రామాల నుంచి గ్రామాలకు కనెక్టివిటీగా బీటీ రోడ్లు వేయాలని కోరారు.
హిందూపురానికి చెందిన రాజేశ్, శ్రీలక్ష్మీల కుమారుడు రవికుమార్ 12ఏళ్లకే భగవద్గీతలోని 700 శ్లోకాలను చూడకుండా వినిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఏ శ్లోకం అడిగినా సులువుగా చెప్పగలగడంలో దిట్ట. భగవద్గీతపై ఆసక్తితో మైసూరులోని దత్తపీఠం నుంచి 7నెలల ఆన్లైన్లో శిక్షణ పొందాడు. పీఠంలో నిర్వహించిన భగవద్గీత శ్లోకాల పోటీల్లో ప్రతిభచాటి గణపతి సచ్చిదానంద చేతులమీదుగా బంగారు పతకం అందుకున్నాడు.
గుంతకల్లు పట్టణంలోని పాత శివాలయం ఏరియాలో సోమవారం రాత్రి దారుణ ఘటన జరిగింది. సాయి తేజ అనే మహిళను ఆమె భర్త పులికొండ కత్తితో గొంతు కోసి అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పులికొండ పరారయ్యాడు. ఈ ఘటనపై గుంతకల్లు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
హిందూపురం పట్టణంలో ఇళ్లులేని నిరుపేదలను గుర్తించి కొటిపి సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అయితే 2019లో టీడీపీ ఓడిపోవడంతో ఆ తరువాత వచ్చిన వైసీపీ టిడ్కో ఇళ్లను పూర్తిచేయకుండా అసంపూర్తిగా నిలిపివేసింది. దీంతో గత ఐదేళ్లుగా పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. కాగా కొటిపి వద్ద సుమారు 200కు పైగా గృహాల్లో సుమారు రూ.కోటి విలువచేసే వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు.
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పై నమోదైన కేసును సోమవారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. 2019 డిసెంబరు 19న అనంతపురం నగరంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై రెండో పట్టణ ఏఎస్ఐ త్రిలోక్ నాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కుందిర్పి మండలం ఎనుములదొడ్డి పంచాయతీకి చెందిన రుద్రంపల్లిలో పీర్ల స్వామి అగ్నిగుండంలో వింత ఘటన చోటుచేసుకుంది. కట్టెలు కాలిన తర్వాత నిప్పుపై మట్టిని వేస్తే ఆరిపోతుంది. గతేడాది మట్టితో కప్పి వేసిన పీర్ల స్వామి అగ్ని గుండాన్ని సోమవారం తవ్వారు. అయితే ఇప్పటికీ అగ్గి వెలుగుతూ ప్రజలను ఆశ్చర్యపరిచింది. దేవుడి మహిమ అంటూ ప్రజలు ప్రార్థనలు నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.