Anantapur

News July 14, 2024

తెల్లవారితే నూతన గృహప్రవేశం.. ఇంతలోనే విషాదం

image

అనంతపురం జిల్లా <<13625175>>విషాద<<>> ఘటనలో మరో అంశం వెలుగులోకి వచ్చింది. విడపనకల్లు మండలం హవళిగి గ్రామంలో ఇంటి పై కప్పు కూలిపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న దంపతులిద్దరూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వారు ఇవాళ కొత్త ఇంటి గృహ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారట. ఇందుకోసం ముహూర్తం సైతం పెట్టుకున్నారు. ఇంతలోనే విధి వక్రీకరించడంతో రాత్రి కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు కూలి నిద్రలోనే తుది శ్వాస విడిచారు.

News July 14, 2024

మిద్దె కూలి అనంతపురం జిల్లాలో దంపతుల మృతి

image

అనంతపురం జిల్లాలో ఘోర విషాదం జరిగింది. విడపనకల్ మండలం హవళిగి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ మిద్దె కూలి మారెప్ప (49), లక్ష్మి (45) అనే దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి కూతురు మానస, మృతురాలి తమ్ముడు రాము తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

News July 14, 2024

నేడు హిందూపురానికి బాలయ్య రాక

image

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం హిందూపురానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టణ సమీపంలోని టిడ్కో ఇళ్ల పరిశీలన, సోమగట్టలో వాటర్ ప్లాంట్‌ ప్రారంభోత్సవం, టిడ్కో ఇళ్ల వద్ద నూతన విద్యుత్ స్టేషన్‌ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. అలాగే పరిగి బస్టాండు వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేస్తారని స్థానిక నేతలు తెలిపారు.

News July 14, 2024

బొమ్మనహాల్: టీబీ డ్యాంలో 30 టీఎంసీలకు చేరిన నీరు

image

బొమ్మనహాల్ మండలంలోని టీబీ డ్యాంలోకి శనివారం నాటికి 30టీఎంసీలు నీరు చేరినట్లు టీబీ డ్యాం అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంలోకి వరద నీరు పరవళ్లు తొక్కుతుంది. రెండు, మూడు రోజుల్లో 40 టీఎంసీలకు చేరే అవకాశం ఉందని టీబీ డ్యాం అధికారులు వెల్లడించారు. డ్యాం వద్దకు ఎవ్వరూ వెళ్లవద్దని అధికారులు ప్రకటించారు.

News July 13, 2024

గోరంట్లలో అనుమానాస్పద మృతి

image

గోరంట్లలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం పట్టణానికి చెందిన షేక్ రఫీ గోరంట్లలో పనిచేస్తూ జీవించేవాడు. శుక్రవారం రాత్రి అతడితో పాటు పనిచేసేవారితో ఇంటి పైకి మద్యం తాగడానికి వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఉదయం ఎంతసేపటికి రాకపోవడంతో పైకి వెళ్లి చూడగా మృతిచెందినట్లు గుర్తించారు. భార్య తస్లీమా ఫిర్యాదు మేరకు సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేశారు.

News July 13, 2024

అనంతపురం: భూమి కేటాయిస్తే ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు

image

అనంతపురంలో 1200 ఎకరాల భూమి చూపిస్తే ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు అధ్యయనం చేస్తామని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం అమరావతిలో వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రామ్మోహన్ నాయుడును కోరారు. స్పందించిన ఆయన భూమి కేటాయిస్తే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

News July 13, 2024

రెండేళ్లలో రాయదుర్గం-తుంకూర్ రైలు మార్గం: కేంద్ర రైల్వేశాఖ సహయమంత్రి

image

రాబోయే రెండేళ్లలో రాయదుర్గం-తుంకూర్ రైలు మార్గం పనులు 2026నాటికి పూర్తిచేస్తామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న హామీ ఇచ్చారు. మడకశిరలోని రాయదుర్గం-తుంకూర్ రైల్వే లైన్ అర్ధాంతరంగా ఆగిన పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన పనులు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టిందన్నారు. ఆయనను ఎంపీ
బీకే పార్థసారథి, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మంత్రిని కలిశారు.

News July 13, 2024

అనంతపురం జిల్లా మహిళకు సీఎం చంద్రబాబు అభినందన

image

అంతర్జాతీయ గుల్బెంకియన్ అవార్డు అందుకున్న అనంతపుం జిల్లా మహిళా రైతుకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. బత్తలపల్లి మహిళా రైతు నాగేంద్రమ్మ ప్రకృతి వ్యవసాయం అభివృద్ధికి చేసిన కృషికి గానూ ఈ అవార్డు లభించింది. పోర్చుగల్‌లోని లిన్‌బిన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్‌తో కలిసి ఆమె అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

News July 13, 2024

అనంతపురం జిల్లా మహిళా రైతుకు అంతర్జాతీయ అవార్డు

image

అనంతపురం జిల్లా బత్తలపల్లి మహిళా రైతు నాగేంద్రమ్మకు అంతర్జాతీయ అవార్డు వరించింది. ప్రకృతి వ్యవసాయం అభివృద్ధికి ఆమె చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. పోర్చుగల్‌లోని లిన్‌బిన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్‌తో కలిసి ఆమె అవార్డు అందుకున్నారు.

News July 13, 2024

అనంత: గర్భం దాల్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు

image

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని ఓ బాలిక తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో పిన్నమ్మతో కలిసి ఉంటోంది. అదే గ్రామానికి చెందిన భాస్కర్ బాలికకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. గర్భం దాల్చిన విషయం తెలిసి ముఖం చాటేశాడు. ఎస్సై నరేశ్ ఇద్దరినీ గుంతకల్లు డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ విచారణ చేపట్టి యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.