Chittoor

News August 15, 2025

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక కార్యక్రమ వివరాలు

image

చిత్తూరు జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించనున్న 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుక కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఉ. 8.30 గంటలకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పెరేడ్ గ్రౌండ్ కు చేరుకొంటారు. ఉ. 8.35 గం.లకు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ భారత జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. ఉ. 8.55 గంటలకు ముఖ్య అతిథి సందేశం, ఉ.10.20 గం.లక ప్రశంసా పత్రాల ప్రదానం, ఉ. 11 గంటలకు జాతీయ గీతాలపన.

News August 14, 2025

20న పేటమిట్టలో జాబ్ మేళా

image

పూతలపట్టు మండలం పేటమిట్టలోని అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో ఈనెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళా పోస్టర్లను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ గురువారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలో తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇందులో సుమారుగా 25 కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News August 13, 2025

6నెలల్లో 221 మంది మృతి: చిత్తూరు కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల మధ్య సమన్వయం అవసరమని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ప్రమాదాల నివారణపై కలెక్టరేట్‌లో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జనవరి నుంచి జులై వరకు 451 ప్రమాదాలు జరిగాయని చెప్పారు. ఈ ఘటనల్లో 221 మంది మృతిచెందారన్నారు. హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

News August 13, 2025

డ్రగ్స్ రహిత చిత్తూరుగా మారుస్తాం: కలెక్టర్

image

చిత్తూరు జిల్లాను డ్రక్స్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. నషా భారత్ కార్యక్రమంలో భాగంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువత చెడు మార్గాన వెళ్లకుండా తల్లిదండ్రులు చూడాలన్నారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, సరఫరా చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

News August 13, 2025

వీకోట: అదుపుతప్పి చెరువులో పడి బాలుడి మృతి

image

చెరువులో పడి ఆరో తరగతి విద్యార్ధి మృతిచెందిన సంఘటన వి.కోట మండలంలో జరిగింది. యాలకల్లు గ్రామానికి చెందిన నాగరాజు, కల్పన దంపతుల కుమారుడు భార్గవ్ (11) వికోట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన అనంతరం గ్రామ సమీపంలోని చెరువు వద్దకి వెళ్లి అదుపుతప్పి పడిపోయాడు. స్థానికులు గుర్తించి బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడు.

News August 12, 2025

CTR: మూడుకు చేరిన మృతుల సంఖ్య

image

పళ్లిపట్టు వద్ద మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. GDనెల్లూరు(M) గోవిందరెడ్డిపల్లికి చెందిన YCP నాయకుడు సురేంద్ర రెడ్డి కుటుంబంతో కలిసి కావడి మొక్కులు చెల్లించేందుకు తిరుత్తణికి కారులో బయల్దేరారు. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో వాహనం బోల్తా కొట్టింది. ఆయన తమ్ముడు చిన్నబ్బరెడ్డి, పద్మ అక్కడికక్కడే మృతిచెందారు. నెలలైనా నిండని మనవడు సైతం చనిపోవడంతో మృతుల సంఖ్యకు మూడుకు చేరింది.

News August 12, 2025

ద్రావిడ వర్సిటీ: ద.రాష్ట్రాల విద్యార్థుల కోసం దరఖాస్తులు

image

ద్రావిడ వర్సిటీలో 2025-26 సంవత్సరానికి సంబంధించి దక్షిణ రాష్ట్రాల విద్యార్థుల కోసం UG&PG కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కిరణ్ కుమార్ తెలిపారు. వారికి 10 శాతం రిజర్వేషన్ కలదన్నారు. ఆసక్తి, అర్హులైన విద్యార్థులు వర్సిటీలో ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News August 12, 2025

గుడికి వెళుతూ.. ఇద్దరు స్పాట్ డెడ్

image

GD నెల్లూరు(M) పళ్లిపట్టు సమీపంలో కాసేపటి క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. YCP నాయకుడు సురేంద్ర రెడ్డి కుటుంబం తిరుత్తణిలోని సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కుబడుల కోసం కారులో బయలుదేరారు. వారి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొని బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఆయన తమ్ముడు చిన్నబ్బరెడ్డి, పద్మ అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 12, 2025

బంగారుపాళ్యం: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

బంగారుపాళ్యం మండలం తగ్గువారి పల్లి గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ కామరాజు గుండె నొప్పితో చనిపోయారు. ఆయన హెడ్ కానిస్టేబుల్‌గా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News August 12, 2025

సీపీఐ చిత్తూరు జిల్లా కార్యదర్శిగా నాగరాజు

image

సీపీఐ చిత్తూరు జిల్లా కార్యదర్శిగా ఎస్.నాగరాజు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 9, 10వ తేదీల్లో నగరిలో సీపీఐ 24వ మహాసభ జరిగింది. నారాయణ, హరినాథ్ రెడ్డి, రామానాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శిగా నాగరాజును ఎన్నుకున్నారు. జిల్లా సహాయ కార్యదర్శులుగా డాక్టర్ జనార్దన్, శివారెడ్డికి అవకాశం దక్కింది.