Chittoor

News September 6, 2024

తిరుపతి: విద్యార్థులకు గమనిక

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(NMMS) పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించారని తిరుపతి డీఈవో వి.శేఖర్ వెల్లడించారు. 8వ తరగతి చదివే విద్యార్థులు ఈనెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇతర వివరాలకరు www.bse.ap.gov.inలో లేదా డీఈవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.  ఈ ఏడాది డిసెంబర్ 8న పరీక్ష జరుగుతుందన్నారు. 

News September 6, 2024

చిత్తూరు: ‘అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు’

image

అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు. బస్తాపై ఉన్న ధరకే ఎరువులు విక్రయించాలన్నారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని, నాసిరకం ఎరువులు అమ్మితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు విధిగా బిల్లులు జారీ చేయాలని, దుకాణాల ఎదుట ధరలు, నిల్వ వివరాలు పొందుపరచాలని చెప్పారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని తెలిపారు.

News September 6, 2024

BREAKING: తిరుపతిలో హత్య

image

తిరుపతి నగరంలో శుక్రవారం ఉదయం హత్య జరిగింది. మంగళంలో రమేశ్, రూప దంపతులు గత 15 ఏళ్లుగా జీవనం కొనసాగిస్తున్నారు. కొన్ని వివాదాల కారణంగా ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. ఈక్రమంలో భార్యను భర్త హత్య చేశాడని స్థానికులు చెప్పారు. ప్రస్తుతం భర్త పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది.

News September 6, 2024

నా భర్త మంచివాడు: ఆదిమూలం భార్య

image

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై భార్య గోవిందమ్మ స్పందించారు. ‘ఆదిమూలం మంచివారు. రాజకీయ కుట్రలో భాగంగా ఆయనను ఇరికించారు. నేను బీమునిచెరువు గ్రామ సర్పంచ్‌గా ఉన్నా. ఇక్కడికి వచ్చి ఎవరిని అడిగినా ఆదిమూలం మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని చెబుతారు. ఆరోపణలు చేసిన మహిళకు కాంట్రాక్ట్ పనులు ఇవ్వకపోవడంతోనే ఇలా చేసింది’ అని గోవిందమ్మ ఆరోపించారు.

News September 5, 2024

అన్నమయ్య: రక్తంతో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటం

image

అన్నమయ్య జిల్లా రామాపురం మండల పరిధిలోని డాక్టర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఆర్ట్ మాస్టర్ డి ఆనంద్ రాజు, తన రక్తంతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వి.వి వరప్రసాద్ సిబ్బంది కలసి ఆర్ట్ మాస్టర్ ఆనంద్ రాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News September 5, 2024

చిత్తూరు: వైసీపీ రాష్ట్ర విభాగంలో ముగ్గురికి చోటు

image

వైసీపీ కార్యాలయం అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో ముగ్గురు జిల్లా వాసులకు చోటు లభించింది. పాల ఏకిరి అధ్యక్షులుగా కుమార రాజా, వన్నెకుల క్షత్రియ విభాగ అధ్యక్షునిగా శీను రాజేంద్రప్రసాద్, విశ్వబ్రాహ్మణ అధ్యక్షురాలిగా పవిత్ర మురళీకృష్ణను నియమించారు.

News September 5, 2024

ఇది పెద్దిరెడ్డి కుట్ర: ఆదిమూలం స్వగ్రామ మహిళలు

image

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు రాగా.. ఆయన స్వగ్రామం నారాయణవనం మండలం భీమునిచెరువు మహిళలు ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచారు. ‘ఆదిమూలం సుమారు 45 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నారు. ఆయనపై చిన్న మచ్చ కూడా లేదు. ఆదిమూలంపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయడంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుట్ర ఉంది’ అంటూ గ్రామంలో ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

News September 5, 2024

ఆదిమూలం బాధితులు చాలా మంది ఉన్నారు: వరలక్ష్మి

image

సత్యవేడు MLA కోనేటి ఆదిమూలం తనకు పదే పదే వీడియో కాల్స్ చేసేవారని బాధిత మహిళ వరలక్ష్మి ఆరోపించింది. ‘ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే నా నంబర్ తీసుకున్నాడు. తిరుపతిలోని ఓ హోటల్లో నాపై 3 సార్లు అత్యాచారం చేశాడు. నాలాగే సత్యవేడులో చాలా మంది ఆయన బాధితులు ఉన్నారు. వాళ్ల తరఫున నేను పోరాటం చేస్తా. అందుకే పెన్ కెమెరాలో రికార్డ్ చేశా. నన్ను చంపేస్తానని బెదిరించడంతోనే మీడియా ముందుకు వచ్చా ’ అని వరలక్ష్మి చెప్పారు.

News September 5, 2024

తిరుపతిలో ఘనంగా గురుపూజోత్సవం

image

తిరుపతి నగరంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, గాలి భానుప్రకాశ్, పులివర్తి నాని, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. సమాజ మార్గనిర్దేశకులు గురువులేనని తెలిపారు.

News September 5, 2024

CTR: వినాయక మండపాలకు కరెంట్ ఛార్జీలు ఇవే..! 

image

వినాయకస్వామి మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా తాత్కాలిక విద్యుత్తు సర్వీసు పొందాలని ఆ శాఖ చిత్తూరు జిల్లా SE సురేంద్ర నాయుడు సూచించారు. 500 వాట్స్ విద్యుత్తు వాడకానికి రూ.1100 చెల్లించాల్సి ఉంటుందన్నారు. 500-1000వాట్స్‌కు రూ.2350, 1000-1500 వాట్స్‌కు రూ.3,100, 1500-2000 వాట్స్ వరకు రూ.3,850 చెల్లించి మీ సేవా కేంద్రాల్లో తాత్కాలిక సర్వీసు తీసుకోవాలని చెప్పారు.