India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బైరెడ్డిపల్లి మండలం దొంతిరాళ్లపల్లి సమీపంలోని భాస్కర్ రెడ్డి అనే రైతు మామిడి తోటకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టారు. ఈ కాలిపోయిన మామిడి తోటతో సుమారు రూ.7 లక్షల వరకు నష్టం వాటిలిందని రైతు వాపోయాడు. ఈ ఘటనపై బైరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బైరెడ్డిపల్లి మండలం దొంతిరాళ్లపల్లి సమీపంలోని భాస్కర్ రెడ్డి అనే రైతు మామిడి తోటకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టారు. ఈ కాలిపోయిన మామిడి తోటతో సుమారు రూ.7 లక్షల వరకు నష్టం వాటిలిందని రైతు వాపోయాడు. ఈ ఘటనపై బైరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈనెల 14వ తేదీ తమిళ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఆరోజు ఉదయం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేయనున్నట్లు చెప్పారు. ఆరోజు ఆలయంలో నిర్వహించే అన్ని అర్జిత సేవలు రద్దు చేయబడ్డాయని, భక్తులు సహకరించాలని కోరారు.

చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. కార్వేటినగరం మండలంలో 200 లీటర్ల సారా ఊట ధ్వంసం చేశారు. చిత్తూరు పట్టణ పరిధిలో కారు, మూడు బైకులను సీజ్ చేశారు. నేరాలను ముందస్తుగా అరికట్టి, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడమే ఈ తనిఖీల లక్ష్యమని అధికారులు తెలిపారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని జడ్పీ, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఎస్జీటీ, సమానమైన కేటగిరి టీచర్లకు ప్రమోషన్ సీనియారిటీ జాబితా సిద్ధమైంది. విద్యాశాఖ వెబ్సైట్లో సబ్జెక్టుల వారీగా పొందుపరిచామని డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వీటిపై అభ్యంతరాలను సరైన ఆధారాలతో ఎంఈవో ద్వారా ఈనెల 16వ తేదీలోపు డీఈవో కార్యాలయానికి చేర్చాలని ఆయన సూచించారు.

జిల్లాలోని మసీదులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి చిన్నారెడ్డి తెలిపారు. మసీదుల నిర్వహణ కమిటీలు, గౌరవ వేతనం పొందుతున్న ఇమామ్, మౌజన్లు తమ మసీదుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉమీద్ పోర్టల్లో మసీదుల వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఈనెల 25 లోపు వీటిని పూర్తి చేయాలన్నారు.

కుప్పంలో NPSPL స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.2,550 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 400మందికి ఉద్యోగాలు ఇచ్చే ఈ కంపెనీకి 105 ఎకరాలు ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శాంతిపురం(M) చీమనపల్లెలో రూ.989కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది. రెండు దశల్లో 450మందికి ఉద్యోగాలు ఇస్తారు. వీటితో పాటు కుప్పం, శాంతిపురంలో పారిశ్రామిక పార్కులకు సైతం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పెనుమూరు మండలంలోని ప్రముఖ పర్యటన కేంద్రమైన పులిగుండు అభివృద్ధికి 79 ఎకరాలు ఏపీ టూరిజానికి కేటాయిస్తూ నేడు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక్కడ అనేక సినిమా షూటింగ్లు, 1000 అడుగుల ఎత్తయిన రెండు రాతి కొండలు చూడ ముచ్చటగా ఉంటాయి. గత ఏడాది ఇక్కడ యోగ డేను జిల్లా అధికారులు నిర్వహించారు. ఆ ఫోటోలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన Xలో పోస్ట్ కూడా చేసుకున్నారు.

పుంగనూరు మండలంలో కొన్ని రోజుల క్రితం ఓ బాలిక చౌక ధరల దుకాణానికి వెళుతుండగా ఓ వ్యక్తి ఆటోలో ఎక్కించుకొని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ రాంబాబును అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు సీఐ సుబ్బారాయుడు తెలిపారు.

చిత్తూరులోని రెవెన్యూ భవనంలో జాతీయ సర్వే దినోత్సవం నిర్వహించారు. గ్రామ సచివాలయ సర్వేయర్లు రక్తదానం చేశారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త నిల్వల కొరత ఉందని గుర్తించి ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా సర్వే శాఖ డీడీ జయరాజ్, ఏడీ పుల్లయ్య, సర్వే ఉద్యోగుల సంఘం నేతలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.