Chittoor

News October 6, 2025

నకిలీ మద్యం ఎక్కడ విక్రయించారు..

image

మొలకలచెరువులో నకిలీ మద్యంను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంత కాలంగా నకిలీ తయారు చేసి ఎక్కడ ఎక్కడ విక్రయించారనేది విచారణ చేస్తున్నారు. నకిలీ మద్యం అమ్మకాలు చేసిన ఓ డైరీ పోలీసులకు లభించిందని ప్రచారం జరుగుతోంది. త్వరలో దీనిపై మారిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు నుంచి సమాచారం.

News October 6, 2025

జయచంద్ర రెడ్డి చుట్టూ అన్నీ వివాదాలే..?

image

MLA అభ్యర్థిగా జయచంద్రా రెడ్డి ఎన్నికైన నాటి నుంచి అనేక వివాదాలు చుట్టుముట్టాయి. జయచంద్ర రెడ్డి TDP బీ ఫార్మ్ తీసుకోవడంతో శంకర్ యాదవ్ వర్గీయులు తీవ్ర ఆందోళనలు దిగారు. ఎన్నికల టైంలో పోలింగ్ బూతుల్లో ఏజంట్లను నియమించుకోలేక పోయారని వాదన ఉంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబానికి సహకారం అందిస్తున్నట్లు గతంలో తెలుగు తమ్ముళ్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

News October 6, 2025

బంగారుపాళ్యం: ఐచర్ ఢీకొని వృద్ధురాలు మృతి

image

బెంగళూరు- చెన్నై జాతీయ రహదారి కేజీ సత్రం సమీపంలో ఐచర్ వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. సోమవారం ఉదయం కమ్మరపల్లి గ్రామానికి చెందిన మునస్వామి భార్య రాజమ్మ రోడ్డు దాటుతున్న సమయంలో బెంగళూరు వైపు నుంచి చిత్తూరు వైపు వస్తున్న ఐచర్ వాహనం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అంబులెన్స్‌లో ప్రభుత్వాస్పతికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఆమె మృతి చెందింది.

News October 6, 2025

చిత్తూరు: 18 మండలాలలో వర్షం

image

జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18 మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శాంతిపురం మండలంలో అత్యధికంగా 86.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వి.కోటలో 38, రామకుప్పంలో 24.8, సదుంలో 20.6, రొంపిచెర్లలో 17.8, కుప్పంలో 12, గుడుపల్లెలో 10.4, విజయ పురంలో 10.2, చిత్తూరు అర్బన్లో 4.2, కార్వేటినగరంలో 3.4, పెనుమూరు, పుంగనూరు, నిండ్రలో 3.2, బంగారుపాళ్యంలో 3, నగరిలో 2.2మీ. మీ. వర్షపాతం నమోదయింది.

News October 5, 2025

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

వెదురుకుప్పం మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక వివరాల మేరకు.. పచ్చికాపల్లం-తిరుపతి హైవేపై రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, మరొకరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 5, 2025

చిత్తూరు కలెక్టరేట్‌లో రేపు PGRS

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉ.9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

News October 5, 2025

ప్రమాదంలో కృష్ణాపురం రిజర్వాయర్..?

image

జీడీనెల్లూరు నియోజకవర్గంలోని కృష్ణాపురం రిజర్వాయర్ ప్రమాదకరంగా మారింది. ప్రధాన గేట్లు మూడు చోట్ల లీకేజీలు ఉండడంతో నీరు వృథాగా పోతోంది. ప్రధాన గేటుకు అవసరమైన జనరేటర్ కూడా పాడైంది. ఐదేళ్లుగా గేట్లు మరమ్మతులకు నోచుకోలేదు. ఐదేళ్ల క్రితం నిర్మించిన రాక్ కాంక్రీట్ దెబ్బతింది. రిజర్వాయర్‌కు మరమ్మతులు చేసి నీటి వృథాను అరికట్టాలని రైతులు కోరుకుంటున్నారు.

News October 5, 2025

చిత్తూరు జిల్లాలో కొత్త మోసం.. జాగ్రత్త

image

మీ వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారంటూ కొంతమంది సైబర్ నేరగాళ్లు ఫేక్ ఈ ఛలాన్లను ఫోన్లకు పంపిస్తున్నారు. వీటిని క్లిక్ చేస్తే అకౌంట్లో డబ్బులు మాయమవుతాయని.. ఇటువంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వర్ కోరారు. ఛలాన్లు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే చెల్లించాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు పంపే లింకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయరాదని కోరారు.

News October 5, 2025

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఇలా..!

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.141నుంచి రూ.153, మాంసం రూ.204 నుంచి 230 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.233 నుంచి రూ.255 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.195 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News October 5, 2025

CTR: 166 మంది భాషా పండితులకు ప్రమోషన్

image

చిత్తూరు డీఈవో ఫూల్‌లో ఉన్న 166 మంది భాషా పండితులకు ప్రమోషన్లు ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం, విద్యా శాఖ అధికారులకు ఎస్‌ఎల్‌టీఏ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉమా మహేష్, కిరణ్ కుమార్ అభినందనలు తెలిపారు. రేషలైజేషన్ పేరుతో పలువురు భాషా పండితులు డీఈవో పూల్‌కు వెళ్లిపోయారని చెప్పారు. హైకోర్టు తీర్పు మేరకు ప్రమోషన్లు ఇచ్చారన్నారు.