Chittoor

News October 2, 2025

చిత్తూరు జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలు

image

చిత్తూరులో జిల్లాలో కొత్తగా రెండు కేంద్రీయ విద్యాలయాలు రానున్నాయి. ఏపీలో మొత్తం 4 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్‌ ఆమోదం తెలిపింది. చిత్తూరు సమీపంలోని మంగసముద్రం, కుప్పం మండలం బైరుగానిపల్లెలో వీటిని నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రధాని, కేంద్ర విద్యా శాఖ మంత్రికి సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాల తెలిపారు.

News October 1, 2025

చిత్తూరు జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలు

image

చిత్తూరులో జిల్లాలో కొత్తగా రెండు కేంద్రీయ విద్యాలయాలు రానున్నాయి. ఏపీలో మొత్తం 4 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్‌ ఆమోదం తెలిపింది. చిత్తూరు సమీపంలోని మంగసముద్రం, కుప్పం మండలం బైరుగానిపల్లెలో వీటిని నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రధాని, కేంద్ర విద్యా శాఖ మంత్రికి సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాల తెలిపారు.

News October 1, 2025

పెన్షన్ల పంపిణీలో చిత్తూరు జిల్లాకు నాలుగో స్థానం

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో చిత్తూరు జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. చిత్తూరు జిల్లా పరిధిలో 2,68,307 పెన్షన్లకు గాను మొదటి రోజు 2,53,480 మంది లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో 95.3%తో అనంతపురం అగ్రస్థానంలో ఉండగా 94.47%తో చిత్తూరు జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో అన్నమయ్య, తిరుపతి జిల్లాలు ఉన్నాయి.

News October 1, 2025

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన చిత్తూరు ఎస్పీ

image

ప్రపంచ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా CMC ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదానం మరొకరి ప్రాణాలు నిలబెట్టే మహోన్నత సేవ అని తెలిపారు. రక్తం దానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని వివరించారు. రక్తదానాన్ని విస్తృతంగా ప్రచారం కల్పించాలని, యువత ఇందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

News October 1, 2025

CM చంద్రబాబుపై బాంబు దాడి.. నేటికి 22 ఏళ్లు.!

image

అది అక్టోబర్ 1వ తేదీ 2003. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు చంద్రబాబు CM హోదాలో తిరుమలకు వస్తున్నారు. సరిగ్గా అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు రాగానే ఒక్కసారిగా బాంబు శబ్దం. అందరూ తేరుకునేలోపే CM ఉన్న కారు గాల్లోకి ఎగిరి పడగా చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు నేటితో 22 ఏళ్లు. శ్రీవారి దయతోనే తాను ప్రాణాలతో బయటపడినట్లు పలు సందర్భాల్లో CM వ్యాఖ్యానించారు.

News September 30, 2025

NCD ఏర్పాటుకు చర్యలు: చిత్తూరు కలెక్టక్

image

పీహెచ్సీల్లో ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజన్) సెల్ ఏర్పాటు చేస్తామని, దీనికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ టీం సహకరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. కలెక్టరేట్‌లో ఎన్సీడీపై జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఢిల్లీ) బృందం కలెక్టర్‌తో సమావేశమైంది. ప్రజా ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

News September 30, 2025

సెలవుపై వెళ్లిన చిత్తూరు DRO

image

జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మోహన్ కుమార్ వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెట్టారు. అక్టోబర్ 2 వరకు ఆయన సెలవుపై ఉండటంతో ఇన్‌ఛార్జ్ బాధ్యతలను డిప్యూటీ కలెక్టర్ కేడర్ అధికారికి అప్పగించారు. కలెక్టరేట్‌లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారికి ఇన్‌ఛార్జ్ డీఆర్వోగా బాధ్యతలప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 29, 2025

MP మిథున్ రెడ్డి బెయిల్‌పై నేడు తీర్పు

image

లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన MP పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ACB కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. దీంతో MPకి బెయిల్ వస్తుందా లేదా అన్న ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.

News September 29, 2025

ఘోరం.. ఇసుకలో బిడ్డ లభ్యం

image

వరదయ్యపాలెంలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున బస్టాండ్ సమీపంలోని ఓ దుకాణం వద్ద ఇసుకలో పూడ్చిన శిశువును పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి ఓ గుర్తు తెలియని యువతి ఆడ శిశువుకు జన్మనిచ్చి అక్కడే ఉన్న ఇసుకలో పూడ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ శిశువుకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News September 29, 2025

అక్రమ కేసులు పెడుతున్న వారికి తిప్పలు తప్పవు: రోజా

image

YCP శ్రేణులపై దాడులు, అక్రమ కేసులు నమోదు చేస్తున్న వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని మాజీ మంత్రి రోజా హెచ్చరించారు. ఆదివారం ఆమె డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. అనతరం మాట్లాడుతూ.. YCP శ్రేణులపై దాడులే లక్ష్యంగా నిరంకుశ పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు తమ వివరాలను డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని, అధికారంలోకి వచ్చాక చట్ట ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.