India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వివిధ పనుల పురోగతిపై చిత్తూరు జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై అధికారుల వద్ద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతగా చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో ప్రస్తుతం 90 ఏనుగులున్నట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. వీటిలో 18ఏనుగుల గుంపు పులిచెర్ల మండలంలో, 13 ఏనుగుల గుంపు పలమనేరు, బంగారుపాళ్యంలో సంచరిస్తున్నట్లు గుర్తించారు. పలమనేరులో ఒంటరి ఏనుగు, కల్లూరులో రెండు మదపుటేనుగులు సంచరిస్తున్నాయి.
చిత్తూరు జిల్లాలో అర్హులైన విద్యార్థులు పీఎం రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుకు దరఖాస్తులను చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ఆదర్శమైన పనులు, జాతీయ స్థాయిలో క్రీడలు, సంఘసేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, ఆర్ట్స్, లలిత కళలు, వినూత్నమైన సేవలతో ప్రతిభ చాటిన 18 ఏళ్లలోపు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఈనెల 15వ తేదీలోపు www.awards.gov.inలో దరఖాస్తు చేయాలన్నారు.
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడికి సంతృప్తికర దర్శనం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ సూచించారు. వినాయక చవితి రోజున తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించారు. తిరుమల తరహాలో కాణిపాకం బ్రహ్మోత్సవాల వాహన సేవలను రోజూ రాత్రి 7 గంటలకు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
కోవిడ్ తో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ వాత్సల్య కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం బాధితులు, వారి సంరక్షకులతో సమావేశం నిర్వహించారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులు కోల్పోయిన 21 మంది చిన్నారులకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందజేశామన్నారు.
జిల్లాలో స్కూల్ గేమ్స్ సెక్రటరీ పోస్టుకు అర్హత గల పీడీ, పీటీలు దరఖాస్తులు చేసుకోవాలని చిత్తూరు డీఈవో కోరారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ 58 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పీడీ, పీఈటీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తులను డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు.
ఈ ఘటన తిరుపతి సమీపంలో జరిగింది. దామినేడు ఇందిరమ్మ ఇళ్లలో నివాసం ఉంటున్న యువతికి 7నెలల కిందట వివాహమైంది. తమిళనాడుకు చెందిన మణి ఆమె పక్క ప్లాట్లోనే ఉంటున్నాడు. నిన్న మధ్యాహ్నం యువతి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి వెళ్లాడు. అరిస్తే చంపేస్తానని కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. రాత్రి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు యువతి అసలు విషయం చెప్పింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉ.చిత్తూరు జిల్లా రైతులు ఎక్కువగా వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. కొన్ని మండలాల్లో వర్షాల కారణంగా సాగు ప్రారంభించారు. గతేడాదితో పోల్చితే వేరుశనగ, వరి సాగు 50 శాతం మాత్రమే ఉందని సమాచారం. వరిని రైతులు 11వేల హెక్టార్లకు 4వేల హెక్టార్లలో సాగు ప్రారంభించారు. వేరుశనగ 36 వేల హెక్టార్లకుగాను సుమారు 1,000 పైగా హెక్టార్లలో సాగు ప్రారంభమైంది. త్వరలో వర్షం లేకపోతే సాగు కష్టమే అంటున్నారు రైతులు.
వచ్చే ఎన్నికల్లో YCP విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని MLA పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఎర్రాతివారిపల్లెలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జీవితంలో మామిడిని రూ.2కే కొనడం ఎప్పుడూ చూడలేదన్నారు. కర్ణాటక కిలో మామిడిని రూ.16 మద్దతు ధరతో భారీగా అమ్ముతుంటే మన పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. త్వరలో TDP ఉనికి గల్లంతవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
కుప్పం ఎయిర్పోర్ట్ కోసం 2018లో భూములు ఇచ్చిన రైతులకు వడ్డీతో కలిపి ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసింది. పలువురు రైతులకు కడ పీడీ వికాస్ మర్మత్, MLC శ్రీకాంత్, RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం, RDO శ్రీనివాసరాజు గురువారం రూ.25.90 కోట్ల చెక్కులను అందజేశారు. మండలాల వారీగా రైతులకు నష్టపరిహారం అందివ్వడం జరుగుతుందని MLC తెలిపారు. భూ సేకరణకు రైతులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.