India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. బుధవారం చిత్తూరు నగరపాలక పరిధిలో 35వ వార్డు కయనికట్టు వీధిలో కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి వృద్ధులకు పింఛన్ సొమ్ములను అందించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టు వెల్లడించారు.

చిత్తూరు జిల్లా నూతన వైద్యారోగ్య శాఖ అధికారి(DMHO)గా డా.నాగ శశి భూషణ్ రెడ్డి నియమితులయ్యారు. ఇందులో భాగంగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా ఉన్న ఆయనకు DMHOగా ప్రమోషన్ వచ్చింది. 2 నెలలకు ముందే చిత్తూరులో నియమించగా ఇవాళ ఆయన వచ్చారు. ప్రస్తుత DMHO సుధారాణి విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ శాఖకు బదిలీపై వెళ్లనున్నారు.

చిత్తూరు జిల్లా నూతన వైద్యారోగ్య శాఖ అధికారి(DMHO)గా డా.నాగ శశి భూషణ్ రెడ్డి నియమితులయ్యారు. ఇందులో భాగంగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా ఉన్న ఆయనకు DMHOగా ప్రమోషన్ వచ్చింది. 2 నెలలకు ముందే చిత్తూరులో నియమించగా ఇవాళ ఆయన వచ్చారు. ప్రస్తుత DMHO సుధారాణి విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ శాఖకు బదిలీపై వెళ్లనున్నారు.

చిత్తూరు జిల్లా ట్రాన్స్కో ఎస్ఈగా అమర్ బాబు నియమితులయ్యారు. కార్పొరేట్ కార్యాలయంలో పీఅండ్ఎం విభాగం ఈఈగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. గత ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ మంగళవారం రిటైరయ్యారు. ఆయన స్థానంలో అమర్ బాబును నియమిస్తూ సీఎండీ శివ శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు.

చిత్తూరు జిల్లా ట్రాన్స్కో ఎస్ఈగా అమర్ బాబు నియమితులయ్యారు. కార్పొరేట్ కార్యాలయంలో పీఅండ్ఎం విభాగం ఈఈగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. గత ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ మంగళవారం రిటైరయ్యారు. ఆయన స్థానంలో అమర్ బాబును నియమిస్తూ సీఎండీ శివ శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు.

చిత్తూరు జిల్లా ట్రాన్స్కో ఎస్ఈగా అమర్ బాబు నియమితులయ్యారు. కార్పొరేట్ కార్యాలయంలో పీఅండ్ఎం విభాగం ఈఈగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. గత ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ మంగళవారం రిటైరయ్యారు. ఆయన స్థానంలో అమర్ బాబును నియమిస్తూ సీఎండీ శివ శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు.

చిత్తూరు జిల్లాలో అదృశ్యమైన మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. పెద్దపంజాణి మండలం ముద్దేపల్లికి చెందిన చంద్రమ్మ వడ్డీ వ్యాపారం చేసేది. ఈక్రమంలో రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారించగా సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బైక్పై తీసుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు అతడిని విచారించగా హత్య చేసి జగమర్ల అడవిలో పారవేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లాలో అదృశ్యమైన మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. పెద్దపంజాణి మండలం ముద్దేపల్లికి చెందిన చంద్రమ్మ వడ్డీ వ్యాపారం చేసేది. ఈక్రమంలో రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారించగా సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బైక్పై తీసుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు అతడిని విచారించగా హత్య చేసి జగమర్ల అడవిలో పారవేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లాలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి కలెక్టర్ సుమిత్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రేడ్-3 ఏఎన్ఎం-20, ఆఫీస్ సబార్డినేట్-2, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్-1 మొత్తంగా 23 పోస్టులను భర్తీ చేస్తారు. 18 ఏళ్లు నిండి 52 ఏళ్ల లోపు ఉన్న దివ్యాంగులు మాత్రమే అర్హులు. ఏప్రిల్ 4వ తేదీ లోపు దరఖాస్తులను చిత్తూరు కలెక్టరేట్కు పంపించాలి. వివరాలకు ఇక్కడ <

సామాజిక పెన్షన్లను నేడు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. ఏప్రిల్ నెలకు సంబంధించి 2,33,645 మంది లబ్ధిదారులకు రూ.100.83 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఉదయం 6.30 నుంచి స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డు కార్యాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఇవాళ పెన్షన్ పొందలేని వారికి గురువారం అందిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.