Chittoor

News August 24, 2024

చిత్తూరు: 1407 పనులకు ఆమోదం

image

జిల్లావ్యాప్తంగా శుక్రవారం 700 గ్రామ సభలు నిర్వహించినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. వీటిలో రూ. 91.30 కోట్లతో 1407 పనులకు ఆమోదం తెలిపినట్టు ఆయన వెల్లడించారు. దీనితోపాటు ఉపాధి హామీ పనులకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ఉపాధి పనుల పట్ల గ్రామీణులకు అవగాహన కల్పించామన్నారు. సభలలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారని తెలియజేశారు.

News August 23, 2024

మదనపల్లె: రైతుపై ప్రత్యర్థి కొడవలితో దాడి

image

రైతుపై ప్రత్యర్థి కొడవలితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శుక్రవారం సాయంత్రం మదనపల్లె మండలం, పొన్నెటి పాలెం గ్రామంలో జరిగింది. బాదితుడి వివరాల ప్రకారం.. పనసమాకులపల్లెకు చెందిన రైతు శంకర(48) తన వ్యవసాయ బోరు వద్ద పొలంలో దుక్కి దున్నుతున్నాడు. పక్కనే ఉన్న వ్యవసాయ భూమికి చెందిన ప్రత్యర్థి మల్లికార్జున నాయుడు భాగం పంచి దుక్కి దున్నాలని శంకర్‌పై కొడవలితో దాడి చేశాడు.

News August 23, 2024

చిత్తూరు: అపరిచిత వ్యక్తులను నమ్మవద్దు : ఎస్.పి

image

ఆరోగ్య సమస్యలను పూజలతో నయం చేస్తామని ఎవరైనా మీ ఇంటికి అపరిచిత వ్యక్తులు వస్తే వారిని నమ్మకండి అని అటువంటి వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్.పి మణికంఠ చందోలు అన్నారు. ఎస్.పి మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తుల పట్ల సందేహం ఉంటే 100/112 కు లేదా చిత్తూరు జిల్లా పోలీస్ వాట్స్ యాప్ నెంబర్ 9440900005 కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News August 23, 2024

పుంగనూరు: నక్షత్ర తాబేలు, నాటు తుపాకీ స్వాధీనం

image

పుంగనూరు మండల పరిధిలో నక్షత్ర తాబేలు, నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నట్టు ఎఫ్ఆర్ఓ శ్రీరాములు తెలిపారు. షికారిపాలెంకు చెందిన అంకయ్య ఇంటిలో సోదాలు నిర్వహించగా అవి లభ్యమయ్యాయని చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. సిబ్బంది రాకేశ్, కిరణ్ కిషోర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

News August 23, 2024

శ్రీవారిమెట్లు నడకదారిలో పురుగులమందు తాగిన ప్రేమజంట

image

శ్రీవారిమెట్లు నడకదారిలో ఓ ప్రేమ జంట పురుగులమందు తాగింది. పెళ్లై ముగ్గురు పిల్లలున్న ఓ మహిళ ఓ యువకుడి ప్రేమలో పడింది. 3 రోజుల క్రితం ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. చంద్రగిరిలోని శ్రీవారిమెట్టు నడకమార్గం 450వ మెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ప్రేమజంటది చిత్తూరుటౌన్, బంగారురెడ్డి పల్లెకు చెందిన సతీశ్, రాధికలుగా పోలీసులు గుర్తించారు.

News August 23, 2024

శ్రీవారి భక్తులకు శుభవార్త

image

శ్రీవారికి అంగప్రదక్షిణ చేసే భక్తులకు TTD శుభవార్త చెప్పింది. ఆగస్టు 24వ తేదీకి అదనంగా మరో 250 అంగప్రదక్షిణ టికెట్లను విడుదల చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 23వ తేదీ 12 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్ల బుకింగ్‌కు అనుమతిస్తారు. శ్రీవారికి అంగప్రదక్షిణ చేస్తే సకల పాపాలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

News August 23, 2024

రేణిగుంటకు చేరుకున్న పవన్ కళ్యాణ్

image

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ జేసీ శుభం భన్సల్ స్వాగతం పలికారు. అలాగే తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, ఆర్డీవో రవి శంకర్ రెడ్డి తదితరులు పుష్ఫగుచ్చాలు అందజేశారు. జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పవన్ రైల్వేకోడూరు నియోజకవర్గానికి బయల్దేరారు.

News August 23, 2024

TTD నూతన జేఈవోగా రవికిరణ్..?

image

త్వరలో టీటీడీ జేఈవోగా జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ MR రవికిరణ్ వస్తారని సమాచారం. ప్రస్తుతం జేఈవోలుగా గౌతమి, వీరబ్రహ్మం ఉన్నారు. వీరబ్రహ్మం స్థానంలో రవికిరణ్‌ను నియమించడానికి ఫైల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు.. ఆ జైలు ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గానూ రవికిరణ్ వ్యవహరించారు. జేఈవోగా ఆయన నియామకంపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.

News August 23, 2024

వైసీపీ ప్రధాన కార్యదర్శిగా చెవిరెడ్డి

image

చంద్రగిరి మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కీలక పదవి లభించింది. జగన్ సూచనల మేరకు ఆయనను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గతంలోనూ ఆయన వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షుడిగానూ పని చేశారు. గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

News August 22, 2024

వైసీపీ ప్రధాన కార్యదర్శిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

image

వైసీపీ ప్రధాన కార్యదర్శులుగా పలువురిని ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శి(అనుబంధ విభాగాలు)గా నియమిస్తున్నట్లు ఆ పార్టీ అధికారిక Xలో పోస్ట్ చేసింది. ఇదే క్రమంలో పార్టీలోని పలు పదవులను జగన్ భర్తీ చేశారు.