India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కార్వేటినగరం మండలంలో అత్యాచారం కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రాజకుమార్ తెలిపారు. మండలంలోని ఓ గ్రామంలో అమ్మాయిని బలవంతం చేసిన ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు గోపిశెట్టిపల్లి పెద్దహరిజనవాడకు చెందిన నాగరాజు, దినేశ్, పవన్ కుమార్, జయరాంను నగిరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని ఎస్ఐ తెలిపారు.
ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో మంగళవారం ఎంపీ ల్యాడ్స్తో చేపట్టిన పనుల పురోగతిపై ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 48 పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.
కాంగ్రెస్తోనే SC, STలకు మేలు జరుగుతుందని మాజీ ఎంపీ చింతా మోహన్ ఉద్ఘాటించారు. జీడీ నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ పేరుతో మోసం చేస్తున్నాయని చప్పారు. కాంగ్రెస్ పెట్టిన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ను సైతం వైసీపీ ప్రభుత్వం మూసేసిందన్నారు. ఈ ప్రభుత్వం కూడా అదే బాటలోనే నడుస్తోందని మండిపడ్డారు. వైసీపీ, కూటమి ప్రభుత్వంలోనూ చిత్తూరు జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు.
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 167 ఫిర్యాదులు అందినట్టు అధికారులు సోమవారం తెలిపారు. రెవెన్యూ 112, పంచాయతీ రాజ్ ఒకటి, పోలీస్ శాఖ 11, పంచాయతీరాజ్కు మూడు ఫిర్యాదులు వచ్చినట్టు వారు వెల్లడించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించినట్లు పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా వైద్య అధికారిని డాక్టర్ సుధారాణి జిల్లాలో ఉన్న మెడికల్ ఆఫీసర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ NCD 3.0 స్కానింగ్ క్వాలిటీగా చేయాలని అన్నారు గర్భిణీ స్త్రీలకు రక్తహీనత పరీక్షలు ఎప్పటికప్పుడు చేసి తగిన వైద్యం చెయ్యాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సూచించారు.
చిత్తూరు నగరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మణికంఠ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 41 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోపు సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.
చిత్తూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను అర్జీలు సమర్పించి, జిల్లా అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక శ్రీకాళహస్తిలో జరగనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఈ విషయాన్ని త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్తో పాటు స్టార్ నటులందరినీ ఈ వేడుకకు తీసుకొచ్చేందుకు విష్ణు ప్రయత్నిస్తున్నారట. ఈ చిత్రంలో కన్నప్పగా మంచు విష్ణు నటిస్తుండగా.. నందీశ్వరుడిగా ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే.
మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురిపై చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో ముగ్గురు మహిళల చేత వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఆదివారం రాత్రి పోలీసులు లాడ్జిపై దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నగరి నియోజకవర్గం పుత్తూరు పట్టణ పరిధిలోని చినరాజుకుప్పం గ్రామానికి చెందిన మణికంఠ (29) అనే యువకుడు ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.