Chittoor

News March 27, 2026

చిత్తూరు: చెస్ ఆడుతారా..?

image

ఆల్ చిత్తూరు చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29న జిల్లాస్థాయి చెస్ పోటీలు జరగనున్నాయి. చిత్తూరులో పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు www.apchess.org వెబ్‌సైట్ ద్వారా ఈనెల 29వ తేదీ లోపు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందులో ప్రతిభ చూపిన ఇద్దరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.

News March 26, 2026

గంగవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

గంగవరం మండలం, మేలుమాయి క్రాస్ వద్ద బుధవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి మృతి చెందాడు. మేలుమాయి క్రాస్‌కు చెందిన దొరస్వామి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఇద్దరు విద్యార్థులు మరో బైక్‌పై వస్తూ ఢీకొట్టారు. స్థానికులు హుటాహుటిన పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News March 26, 2026

చిత్తూరు: విస్తృత భద్రత ఏర్పాట్లు

image

శ్రీరామనవమి పురస్కరించుకొని దేవాలయాలు, ముఖ్య ప్రదేశాలు, శోభాయాత్రలు నిర్వహించే ప్రాంతాలలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తుషార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పండుగను భక్తిశ్రద్ధలతో, పరస్పర గౌరవంతో నిర్వహించుకోవాలని సూచించారు. సున్నిత ప్రాంతాలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని.. ఏ సమస్య వచ్చిన పోలీసులను సంప్రదించాలని కోరారు.

News March 26, 2026

చిత్తూరు: సరదా మాటున ప్రమాదం.. జాగ్రత్త.!

image

వేసవి, ఒంటిపూట బడులు కావడంతో పలువురు చిన్నారులు, యువకులు చెరువులు, బావుల్లో ఈత కొట్టేందుకు సరదా చూపుతున్నారు. వీరిని చూసి ఈతరాని వారు కూడా నీళ్లల్లోకి దిగుతుండడంతో మృత్యువాత పడే అవకాశం ఉంది. పెద్దల పర్యవేక్షణలో పిల్లలు ఈత నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు ఎక్కడికి వెళుతున్నారో తల్లితండ్రుల పర్యవేక్షణ తప్పక ఉండాలన్నారు. ఈత రానివారు నీరు ఉన్న చోట్లకు వెళ్లకుండా అప్రమత్తత వహించాలన్నారు.

News March 26, 2026

చిత్తూరు: ఆ ఇద్దరు MLAలకు కొత్త టెన్షన్.?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన రెండు రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో గుబులు రేపుతోంది. సత్యవేడు, పూతలపట్టు, GDనెల్లూరు నియోజకవర్గాలు SC రిజర్వేషన్‌లో ఉన్నాయి. వీటిలో పూతలపట్టు, సత్యవేడు జనరల్‌కు కేటాయించే అవకాశం ఉందని కొన్నాళ్లుగా ప్రచారం నడుస్తోంది. అందుకు తగ్గట్టే సత్యవేడులో TDP ప్రోగ్రామ్ కోఆర్డినేటర్‌ శంకర్ రెడ్డి చురుగ్గా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.

News March 26, 2026

జనగణనను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

జనగణన కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో మూడు రోజుల జనగణన శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. కుప్పం, పలమనేరు, నగరి డివిజన్లకు సంబంధించిన ఫీల్డ్ ట్రైనర్లు పాల్గొన్నారు. ముగింపు సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న 15 సంవత్సరాల వరకు ఈ జనగణన ప్రభావం చూపుతుందన్నారు.

News March 26, 2026

చిత్తూరు DMHO బదిలీలో మూడవ జీవో

image

చిత్తూరు డీఎంహెచ్వో సుధారాణి బదిలీకి సంబంధించి ప్రభుత్వం మూడో జీవో జారీ చేసింది. ఆమెను విజయవాడలోని పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ వద్ద రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆమె స్థానంలో నాగ శశిభూషణ్ రెడ్డిని డీఎంహెచ్వోగా నియమించారు. చిత్తూరులోనే విధులు కొనసాగేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదని పలువురు పేర్కొంటున్నారు.

News March 26, 2026

ఇవాళ స్కూళ్లకు సెలవు లేదు: చిత్తూరు DEO

image

జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలు గురువారం పని చేస్తాయని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీన పాఠశాలలకు సెలవు ఉంటుందని డీఈవో పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలన్నారు. ఇది వరకు 26(నేడు) శ్రీరామనవమి సందర్భంగా సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

News March 26, 2026

గంగవరం: బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి

image

రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన గంగవరం మండలంలో జరిగింది. ఓ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు జుబేర్, శ్రీధర్ బైక్‌పై పలమనేరుకు బయలుదేరారు. మేలుమయి గ్రామానికి చెందిన దొరస్వామి (55) పలమనేరు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మేలు మయి క్రాస్ వద్ద వీరి వాహనాలు ఢీకొన్నాయి. సీఎంసీకి తరలిస్తుండగా దొరసామి మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 26, 2026

నియంత్రణకు చర్యలు చేపట్టాలి: చిత్తూరు కలెక్టర్

image

జిల్లాలోని అన్ని విద్యాసంస్థల వద్ద డ్రగ్స్, పొగాకు ఇతర నిషేధిత వస్తువులు నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. చిత్తూరు కలెక్టరేట్లో బుధవారం ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంపై ఎస్పీ తుషార్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. విద్యా సంస్థల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు.