Chittoor

News August 22, 2024

SVU: PG ఫలితాలు విడుదల

image

శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మార్చి నెలలో (PG) M.A, M.COM, M.SC మొదటి సెమిస్టర్, జనవరి నెలలో M.SC కంప్యూటర్ సైన్స్ 3వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు గురువారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News August 22, 2024

తిరుపతిలో రూ.50 లక్షల విలువైన గంజాయి సీజ్

image

రూ.50 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు రూరల్ సీఐ సాదిక్ అలీ తెలిపారు. ఎంఆర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిలో వాహనాల తనిఖీ చేస్తుండగా.. కేరళ రిజిస్ట్రేషన్ కలిగిన వాహనంలో లిక్విడ్ రూపంలో ప్యాకింగ్ చేసిన గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పోలీసులను చూసి అందులోని ముగ్గురు వ్యక్తులు పారిపోయారని వెల్లడించారు.

News August 22, 2024

చిత్తూరు: రోడ్డుప్రమాదం.. కారుపై ‘POLICE’ స్టిక్కర్

image

కారు ఢీకొని చేనేత కార్మికుడికి తీవ్ర గాయాలైనట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కురబలకోట మండలం వనమరెడ్డిగారిపల్లి పంచాయతీ పెద్దపల్లెకు చెందిన రాఘవరెడ్డి(60) సొంత పని మీద బైకుపై మదనపల్లె మండలంలోని సీటీఎం పాతూరుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా రైల్వే గేటు వద్ద ‘POLICE’ స్టిక్కర్ వేసి ఉన్న ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో రాఘవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 22, 2024

తిరుమలలో వివిధ ప్రత్యేక దర్శనాలు రద్దు

image

తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వివిధ ప్రత్యేక దర్శనాలు కూడా అక్టోబరు 3నుంచి 12వ తేదీ వరకు రద్దయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు భక్తులు అధికంగా వచ్చేస్తారు. వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రేక్‌ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 

News August 22, 2024

తిరుపతి MLA ఇంట్లో కేక్ కట్ చేసిన మెగాస్టార్

image

తిరుమతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాసంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. తన నివాసానికి విచ్చేసిన చిరంజీవి దంపతులకు ఎమ్మెల్యే శ్రీనివాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చిరంజీవి కేక్‌ కట్‌ చేసి తన భార్య సురేఖతో పాటు ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులకు తినిపించారు. తేనీరు సేవించాక చిరంజీవి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

News August 22, 2024

తిరుపతిలో ఫైర్ యాక్సిడెంట్

image

తిరుపతి బైరాగిపట్టెడలోని ఓ స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించింది. స్కూల్‌‌లోని స్టోర్ రూమ్‌లో గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు పెద్ద ఎత్తున సంభవించడంతో స్కూల్ యాజమాన్యం విద్యార్థులను క్షేమంగా సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఫైర్ ఇంజిన్‌కి సమాచారం అందించగా.. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకొని మంటలను అదుపు చేశారు.

News August 22, 2024

నేడు శ్రీవారి పుష్పయాగం టికెట్ల విడుదల…

image

నవంబర్ 9వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నేడు పుష్పయాగం టికెట్లను 10 గంటలకు టిటిడి వారు విడుదల చేయనున్నారు. పుష్పయాగంలో పాల్గొనదలచిన భక్తులు టికెట్లను కొనుక్కొని పాల్గొనవచ్చు. పుష్పయాగంలో పాల్గొనడంతో పాటు శ్రీవారి దర్శన భాగ్యం కూడా లభిస్తుంది. బ్రహ్మోత్సవాలకు ముందుగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

News August 22, 2024

చిత్తూరు: తల్లితో సహజీవం.. కూతురితో అసభ్య ప్రవర్తన

image

చిత్తూరులో ఓ బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. టూటౌన్ CI.నెట్టికంఠయ్య కథనం..తేనబండ పక్కనున్న బోడిగుట్టకు చెందిన నవీన్ అనేవ్యక్తి ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె కుమార్తె(14)తో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. మహిళ పనికి వెళ్లి వచ్చేసరికి, బాలిక ఏడుస్తోంది. అడిగితే తనపై నవీన్ లైంగికదాడికి ప్రయత్నించాడని బాలిక తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News August 22, 2024

చిత్తూరు: డ్రిప్ ఇరిగేషన్ సాగుకు ప్రోత్సాహం: కలెక్టర్

image

డ్రిప్ ఇరిగేషన్ సాగుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఈ క్రాపింగ్ తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 21 వేల హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ సాగుకు లక్ష్యంగా నిర్ణయించారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు పదివేల హెక్టార్లలో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు.

News August 21, 2024

తిరుపతి : ఉద్యోగాల పోస్టర్స్ ఆవిష్కరణ

image

APSSSDC ఆధ్వర్యంలో జెన్ పాక్ట్ కంపెనీ నందు కంటెంట్ మోడరేషన్, కస్టమర్ సర్వీస్ వాయిస్ సపోర్ట్ ఉద్యోగాల పోస్టర్ ను బుధవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం మాట్లాడుతూ.. 2022/23/24 మధ్య బీటెక్ ఏదైనా డిగ్రీ, పీజీ పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. https://bit.ly/46Wzqz6 వెబ్ సైట్ లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. చివరి తేదీ ఆగస్టు 28.