India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
SC వర్గీకరణ తీర్పు కు వ్యతిరేకంగా ఈ నెల 21న జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని రామసముద్రం మండలం మాలమహానాడు అధ్యక్షుడు టి. కృష్ణప్ప తెలిపారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు “యమాల సుదర్శన్, అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్ శివయ్య ఆదేశాల మేరకు బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ బంద్కు ప్రతి ఒక్క మాల జాతి, అనుబంధ సంఘాలు పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని కోరారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12 వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3న సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు.. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి. 4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంతో ప్రారంభం కానున్నాయి.
తిరుమలలో నకిలీ రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లతో వెళ్తున్న వారిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైకుంఠంలో స్కానింగ్ చేసే దగ్గర కలర్ జిరాక్స్ టికెట్లను విజిలెన్స్ అధికారులు గమనించి పట్టుకున్నారు. అమృత్ యాదవ్ అనే ఓ నేరస్థుడు చెన్నైకి చెందిన మోహన్రాజును మోసం చేసి 4 టికెట్లకు రూ.11వేలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లా యాదమరి వద్ద లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. పెరియంబాడికి చెందిన సంపత్(34) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై బస్ స్టాప్నకు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. కిందపడిపోవడంతో సంపత్ తలకు తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అతడి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. శ్రీ సిటీలో ఆయన పలు కంపెనీలకు భూమి పూజ, పలు కంపెనీల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు మినహా ఇతరులకు ప్రవేశం కల్పించలేదు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శ్రీ సిటీలో స్వాగతం పలికారు.
పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మంగళవారం ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. డిక్సన్ కంపెనీ ప్రతినిధుల హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ, 18-30 సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు https://rb.gy/6son88 గూగుల్ ఫాం లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి సూచించారు.
మాజీ మంత్రి ఆర్కే రోజా రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రపంచంలోని నా బెస్ట్ బ్రదర్స్కి, రక్షా బంధన్ శుభాకాంక్షలు. నా కోసం ఎల్లప్పుడూ ఉన్నందుకు ధన్యవాదాలు’ అంటూ మాజీ సీఎం జగన్తోపాటు ఆమె అన్నలతో ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఇద్దరు విద్యార్థులకు డెంగ్యూ జ్వరం సోకి పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని రాంపల్లెకు చెందిన బార్గవ్(13) 10వ తరగతి చదువుతున్నారు. జ్వరం రావడంతో ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ అని నిర్ధారణ అయింది. అలాగే, పలమనేరు మండిపేటకోటూరుకు చెందిన మూడో తరగతి విద్యార్థిని మోక్షిత(9) కూడా డెంగ్యూ జ్వరంతో పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
శ్రీసిటీలో 15 పరిశ్రమలను సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు. శ్రీసిటీలో రూ.1570 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమల ద్వారా సుమారు 8480 మందికి ఉపాధి లభిస్తుంది. మరో ఆరు పరిశ్రమల ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. మరో ఐదు పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. వీటి ద్వారా 4060 మందికి ఉపాధి లభిస్తుంది.
సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలు దేరి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీసిటీకి వెళ్లతారు. శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్లో పలు పరిశ్రమలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడ కార్యక్రమాలు ముగిసిన తర్వాత నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును సందర్శిస్తారు. అక్కడ నుంచి సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారని ప్రభుత్వం తెలిపింది.
Sorry, no posts matched your criteria.