Chittoor

News January 1, 2026

రూ. 210 కోట్లతో SC, ST కాలనీల అభివృద్ధి : కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో SC, ST కాలనీల అభివృద్ధికి రూ.210 కోట్లతో ప్రణాళికలు అమలు చేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం 31/12/2025 నాటికి రూ. 120 కోట్లతో SC,ST కాలనీలను అభివృద్ధి చేసేందుకు నిధులు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. జిల్లాలో 20 లక్షల జనాభా ఉండగా SC లు 4 లక్షలు, ST లు 65 వేలు ఉన్నారని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రూ.210 కోట్లతో ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు.

News December 31, 2025

చిత్తూరు: పెన్షనర్లకు గమనిక

image

చిత్తూరు జిల్లాలోని పెన్షనర్లు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని ట్రెజరీశాఖ DD రామచంద్ర సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ పెన్షన్‌దారులు వార్షిక జీవన ప్రమాణ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్నారు. జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 28వ తేదీ లోపు లైఫ్ సర్టిఫికెట్లను ఇవ్వాలని.. గడువులోపు సమర్పించకపోతే మార్చి నెల పింఛన్ నిలిపివేస్తామని స్పష్టం చేశారు.

News December 31, 2025

చిత్తూరు ఎంపీ పనితీరు ఇలా..!

image

చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద రావు పార్లమెంట్ సమావేశాల్లో 94శాతం అటెండెన్స్ నమోదు చేశారు. ఇటీవల జరిగిన శీతాకాల సమావేశంలో ఏ రోజూ ఆయన పార్లమెంట్‌కు గైర్హాజరు కాలేదు. హెల్త్ సెక్యూరిటీ సెస్ బిల్లు, బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడారు. 7 చర్చల్లో పాల్గొన్న ఆయన ఇప్పటి వరకు 122 ప్రశ్నలను పార్లమెంట్‌లో సంధించారు. ఇప్పటి వరకు ఆయన ఎలాంటి ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టలేదు.

News December 31, 2025

చిత్తూరు: CC కెమెరాలతో 152 కేసుల పరిష్కారం

image

చిత్తూరు జిల్లా పోలీసులు 2025లో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా 152 కేసులను పరిష్కరించారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 755 లొకేషన్లలో 2406 CC కెమెరాలను ఏర్పాటు చేశారు. దొంగతనాలతో పాటు ఇతర నేరాలకు సంబంధించి CC కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం CC కెమెరాల ఏర్పాటుపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

News December 31, 2025

చిత్తూరు జిల్లాలో 1021 సెల్ ఫోన్ల రికవరీ

image

చిత్తూరు జిల్లాలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని భారీగా సెల్‌ఫోన్లు రికవరీ చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.2.42 కోట్ల విలువైన 1021 ఫోన్లను చాట్ బాట్ ద్వారా పోలీసులు రికవరీ చేశారు. మూడు దశల్లో సెల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు వాటిని బాధితులకు అప్పగించారు. చోరీ అయిన వెంటనే బాధితులు తమ ఫోన్ల కోసం పోలీసులను ఆశ్రయిస్తుండటంతో రికవరీ శాతం పెరిగింది.

News December 31, 2025

చిత్తూరు జిల్లాలో 128 మందిపై డ్రగ్స్ కేసులు

image

చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది 128 మంది మీద మాదక ద్రవ్యాల చట్టానికి సంబంధించి 42 కేసులను నమోదు చేశారు. 98 కేజీల గంజాయి, 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 35 ఎక్సైజ్ కేసులు నమోదు కాగా.. 327 మందిని అరెస్ట్ చేశారు. 4400 లీటర్ల సారా, 2124 లీటర్ల అక్రమ మద్యం పట్టుబడింది. 21 వాహనాలను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. 2024తో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది.

News December 31, 2025

చిత్తూరులో సెల్‌ఫోన్ దొంగల అరెస్ట్

image

చిత్తూరులో సెల్ ఫోన్లు చోరీచేసే ముగ్గురిని అరెస్టు చేసినట్లు రెండో పట్టణ సీఐ నెట్టికంటయ్య వెల్లడించారు. స్థానిక పీవీకేఎన్ కళాశాల వద్ద అనుమానంగా తిరుగుతున్న రాజేష్, లోకేశ్, రాకేశ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగతనం చేసినట్లు నిర్ధారణ కావడంతో వారి నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి చిత్తూరు జైలుకు తరలించారు.

News December 31, 2025

చిత్తూరు జిల్లాలో 74,447 ట్రాఫిక్ చలాన్లు

image

చిత్తూరు జిల్లాలో ఈసారి ట్రాఫిక్ చలాన్ల సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది 54,454 చలాన్ల ద్వారా రూ.1.28 కోట్లు వసూలు చేయగా ఈసారి రూ.2.31 కోట్లు జరిమానా విధించారు. 2024లో 2519 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా ఈసారి 2772 ఫైలయ్యాయి. మొత్తంగా జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈసారి ట్రాఫిక్ చలాన్ల ద్వారా రూ.కోటికి పైగా అదనంగా ఫైన్ వేశారు.

News December 31, 2025

చిత్తూరు: పింఛన్ల పంపిణీకి రూ.115 కోట్లు

image

చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ బుధవారం ఉదయం నుంచి మొదలైంది. జిల్లాలో 2,67,481 మందికి 27 రకాల పింఛన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు రూ.115.17 కోట్లు విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తారని పీడీ శ్రీదేవి తెలిపారు.

News December 30, 2025

పుంగనూరు: బైకును ఢీకొన్న RTC బస్సు.. ఒకరు స్పాట్ డెడ్

image

పుంగనూరు మండలం నూతన బైపాస్ మలుపు వద్ద పలమనేరు నుంచి పుంగనూరుకు వస్తున్న RTC బస్సు బైకును ఢీకొనడంతో గుడిసి బండకు చెందిన సోమశేఖర్(27) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి ఏఎస్ఐ అశ్వత్ నారాయణ, పోలీసు సిబ్బంది చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.