India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుమల వయోవృద్ధుల దర్శనాలపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం అవుతోంది. వాస్తవానికి సీనియర్ సిటీజన్ల దర్శనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నవారికి మాత్రమే రోజూ మధ్యాహ్నం 3గంటలకు ఉంటుంది. నేరుగా వస్తే అనుమతించరు. రోజు 1000 మందికి మాత్రమే ఈ కోటాలో దర్శనాలు కేటాయిస్తున్నారు. కానీ 65 ఏళ్లు దాటినవారు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు మధ్య ఫొటో ఐడీ, వయసు ధ్రువీకరణ పత్రం చూపిస్తే దర్శనం అయిపోతుందని ప్రచారం జరుగుతోంది.
టీటీడీ ధర్మకర్తల మండలి నవంబర్ 18న జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 3న (మొదటి మంగళవారం) స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ నందు ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నారు.
విద్యుత్ తీగ తగిలి ఏనుగులు మృత్యువాత పడకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. వీడియో కన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. వి.కోట, బంగారుపాళ్యం, పలమనేరు, కుప్పం, పులిచెర్ల తదితర ప్రాంతాలలో 491 నియంత్రికలు ఉన్నాయన్నారు. వీటి బారిన పడి ఏనుగులు మృత్యువాత పడుతున్నాయన్నారు. వెంటనే ఈ ట్రాన్స్ఫార్మర్లను నిర్మానుష్య ప్రదేశానికి బదిలీ చేయాలన్నారు.
గిరిజనుల ఆధార్ నమోదులో రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి తెలిపారు. ఆధార్ కార్డు లేని 931 మందిని గుర్తించి 424 మందికి ఆధార్ కార్డు మంజూరు చేశామన్నారు. మిగిలిన 50 శాతం మందికి త్వరలో మంజూరు చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఆధార్ నమోదులో ముందంజలో ఉన్నామన్నారు. ఎవరైనా గిరిజనులు ఆధార్ లేకుంటే సచివాలయాన్ని సంప్రదించాలన్నారు.
నేటి నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు ఎంఎస్ఎమ్ఈల సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఎస్ఎమ్ఈల ఫార్మలైజేషన్లో భాగంగా పరిశ్రమల శాఖ ద్వారా ఈ సర్వే చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా వ్యాపారుల వివరాలను డిజిటల్ ప్లాట్ ఫామ్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కొడుకు కొట్టడంతో తల్లి మృతి చెందిన ఘటన చిత్తూరులో జరిగింది. సీఐ నెట్టికంటయ్య వివరాల ప్రకారం.. చిత్తూరు నగరంలోని రోసీనగర్లో ఉంటున్న వసంతమ్మ(63)కు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు శంకర్ చిత్తూరు పోలీసుశాఖలో కానిస్టేబుల్గా పని చేస్తూ సస్పెండ్ అయ్యాడు, మరో కొడుకు జ్యోతికుమార్ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని శంకర్ తల్లిని కొట్టడంతో చనిపోయింది.
అవును నిజమే.. ఓ యువకుడిని తన గర్ల్ ఫ్రెండే కిడ్నాప్ చేసింది. తిరుపతిలో ఓ లాడ్జి నిర్వహిస్తున్న నానికి అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన భాను పరిచయమైంది. వారి మధ్య ప్రేమ మొదలై సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల భానును నాని పట్టించుకోలేదు. కోపం పెంచుకున్న భాను.. కారులో వచ్చి తిరుపతిలో ఉన్న నానిని కిడ్నాప్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వాయల్పాడు వద్ద కారు ఆపి నానిని కాపాడారు.
శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో M.A ఎకనామిక్స్ రెండవ సెమిస్టర్, LLM 4వ సెమిస్టర్, ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ టెక్నాలజీ 7వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలైనట్లు మహిళా యూనివర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
తిరుపతి జిల్లాకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 45 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు. కాగా మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లరాదని ఇప్పటికే అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మాజీ మంత్రి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. కోలారులో జరిగిన పెద్దిరెడ్డి సోదరి కుమారుడు వివాహ వేడుకల్లో వారు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
Sorry, no posts matched your criteria.