India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో కానిస్టేబుళ్లను భారీగా బదిలీ చేశారు. ఏకంగా 32 మందిని బదిలీ చేస్తూ చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఇద్దరినీ వీఆర్కు బదిలీ చేశారు. బదిలీ అయిన సిబ్బందిని వెంటనే రిలీవ్ చేయాలని.. కొత్త పోస్టింగ్ ప్రదేశాల్లో రిపోర్ట్ చేయాలని ఎస్పీ ఆదేశించారు.

చిత్తూరు: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చిత్తూరులోని రాజకీయ పార్టీ నాయకులతో డీఆర్వో మోహన్ సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 20వేల మంది మరణించిన వారి పేర్లు ఓటర్ లిస్ట్లో ఉన్నాయని చెప్పారు. వాటిని తొలగించమని పదే పదే చెప్పినా.. తీసేయకపోవడం సరికాదన్నారు. ఒకే వ్యక్తి పలు నియోజకవర్గాల్లో ఓటరుగా ఉన్నారని చెప్పారు.

సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కలిశారు. తిరుపతి- హుబ్లీ ఇంటర్ సిటీ రైలు రెడ్డిపల్లిలో ఆగేలా చూడాలని కోరారు. తిరుపతి నుంచి కడపకు ఉదయం 5:10 గంటలకు బయలుదేరే తిరుమల ఎక్స్ప్రెస్ ఇకపై 6.10 గంటలకు బయలుదేరేలా చూడాలన్నారు. చెన్నై ఎగ్మోర్-ముంబై ట్రైన్కు కోడూరు, రాజంపేటలో, హరిప్రియ, సంపర్క్ క్రాంతికి రాజంపేటలో స్టాపింగ్ ఇవ్వాలని విన్నవించారు.

చిత్తూరు: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చిత్తూరులోని రాజకీయ పార్టీ నాయకులతో డీఆర్వో మోహన్ సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 20వేల మంది మరణించిన వారి పేర్లు ఓటర్ లిస్ట్లో ఉన్నాయని చెప్పారు. వాటిని తొలగించమని పదే పదే చెప్పినా.. తీసేయకపోవడం సరికాదన్నారు. ఒకే వ్యక్తి పలు నియోజకవర్గాల్లో ఓటరుగా ఉన్నారని చెప్పారు.

చిత్తూరు జిల్లా పరిధిలోని పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. పోలీస్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 219 మంది సిబ్బందిని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయగా.. మరికొందరిని వీఆర్కు పంపించారు. పుంగనూరులో టీడీపీ నాయకుడి హత్య నేపథ్యంలోనే భారీ స్థాయిలో పోలీసులను బదిలీ చేసినట్లు సమాచారం.

పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో పని వేళలను మార్పు చేస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్నం 1 నుంచి 5 వరకు పాఠశాలలు నడపాలని గతంలో ఇచ్చిన ఉత్తర్లను మార్పు చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి 5 వరకు పని వేళలను మార్పు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ పని వేళల్లో పాఠశాలలు నిర్వహించాలని సూచించారు.

వెదురుకుప్పం మండలంలోని కొమరగుంట గ్రామానికి చెందిన మహేశ్ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. తాను నివసిస్తున్న గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు. మహేశ్ మృత దేహాన్ని అప్పగించాలంటూ వెదురుకుప్పం -పచ్చికాపల్లం రహదారి మార్గంలో కొమరగుంట క్రాస్ రోడ్డులో మంగళవారం బంధువుల ఆందోళన చేపట్టారు. మహేశ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

చిత్తూరు జిల్లాలో ఏడు మంది MROలను బదిలీ చేస్తూ ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఉత్తర్వులు జారీ చేశారు.
☞ వెదురుకుప్పం MROగా బాబు
☞ గంగవరం MROగా మాధవరాజు
☞ రామకుప్పం MROగా కౌలేష్
☞ పూతలపట్టు MROగా రమేశ్
☞ బైరెడ్డిపల్లి MROగా శ్యాం ప్రసాద్ రెడ్డి
☞ శాంతిపురానికి MROగా ప్రసన్నకుమార్ను
☞ గుర్రప్పను చిత్తూరు కలెక్టరేట్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

GDనెల్లూరులో 30 ఏళ్లకు విక్టరీ కొట్టిన TDPకి తలనొప్పులు మొదలయ్యాయి. కొందరు టీడీపీ నేతలే MLA థామస్కు వ్యతిరేంకగా పని చేస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది. GDN పర్యటనకు వచ్చిన CM సైతం దీనిపై ఘాటుగానే స్పందించారు. థామస్ ఎక్కువగా నియోజకవర్గం బయటే ఉండటంతో నేతలు, కార్యకర్తలు సైతం అసంతృప్తితో ఉన్నారంట. ఇలాంటివి తానంటే గిట్టని వారు చేస్తోన్న అసత్య ప్రచారాలని, వారిని వదలనని థామస్ గట్టిగానే హెచ్చరించారు.

జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఆదివారం తెలిపారు. మొత్తం 118 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు 20, 954 మంది, ప్రైవేటు విద్యార్థులు 294 మంది పరీక్షకు హాజరవుతున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లోనికి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.