India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఎర్రావారిపాలెంలో చిన్నారి పరువు తీసింది పోలీసులే. మా తిరుపతి ఎస్పీ చాలా కష్టపడి నాపై పోక్సో కేసు పెట్టారు. నేను న్యాయశాస్త్రం చదివా. నాకు చట్టాలు తెలుసు. నాపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను వదలను. ముందుగా వాళ్లపై పరువునష్టం దావా వేస్తా. తర్వాత ప్రైవేట్ కేసు నమోదు చేస్తా’ అని చెవిరెడ్డి ప్రకటించారు.
చిత్తూరు పట్టణం దుర్గానగర్ కాలనీలోని రోసి నగర్కు చెందిన శంకర్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ సస్పెండ్ అయ్యాడు. తాగుడుకు బానిసై తన తల్లి వసంతమ్మును తాగడానికి డబ్బులు అడిగాడు. లేవు అనడంతో కాలితో బలంగా తన్నాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో స్విమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసినట్టు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు.
రైతు సహకార పరిపతి సంఘంతో రైతులకు లాభాలు అధికమని గుంటూరుకు చెందిన ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ అండల్ అన్నారు. పీటీఎం మండలం మద్దయ్యగారిపల్లెలో నిర్మించిన రైతు సహకార పరిపతి సంఘం కార్యాలయాన్ని ఆయన జిల్లా ఉద్యానవన శాఖాధికారి రవీంద్రబాబుతో కలిసి పరిశీలించారు. రైతుల భాగస్వామ్యంపై నడుస్తున్న ఈ సంఘంతో రైతులు అనేక లాభాలు పొందవచ్చని వారు స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. నారావారిపల్లెలో ఆయన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియల్లో పాల్గొనడానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ ఈవో శ్యామల రావు ఆయనకు స్వాగతం పలికారు. బొకేలు అందజేసి శాలువాతో సత్కరించారు.
ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు పోలీసు వారి సూచనలను పాటించాలని SP సుబ్బరాయుడు తెలిపారు. సురక్షితంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం డయల్ 112/80999 99977నంబర్కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. పోలీసులు తక్షణ సహాయక చర్యలు అందిస్తారని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.
<<14718200>>ప్రేమ జంటకు<<>> గ్రామస్థులు పెళ్లి చేసిన ఘటన బుధవారం రొంపిచర్లలో జరిగింది. భాకరాపేటకు చెందిన ప్రసన్న, గానుగచింతకు చెందిన రెడ్డప్ప డిగ్రీ చదువుకుంటూ ప్రేమించుకున్నారు. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇష్టంలేని పెళ్లి చేసుకున్నందుకు పెళ్లి కుమార్తె తల్లి ఆమె మెడలోని తాళి తెంచేసింది. అయితే ప్రియుడే కావాలని ఆమె అతని దగ్గరకు వెళ్లడంతో గ్రామస్థులు ఆలయంలో ప్రేమజంటకు మళ్లీ తాళి కట్టించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు కీలక సూచన చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లోని సమచారాన్ని RDO కార్యాలయాల్లోని కంట్రోల్ రూంకు లేదా కలెక్టరేట్కు తెలియజేయాలన్నారు. కంట్రోల్ రూం నంబర్లు తిరుపతి కలెక్టరేట్ 0877-2236007 గూడూరు RDO ఆఫీసు 08624-252807, సూళ్లూరుపేట RDO ఆఫీసు 08623-295345 శ్రీకాళహస్తి RDO ఆఫీసు 8555003504ను సంప్రదించాలన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం నేరుగా లైన్ వెళ్తుంది. అన్ని కంపార్టుమెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఉదయం 7:30 నుంచి 8 గంటల తరువాత నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారిని మంగళవారం 64,525 మంది దర్శించుకున్నారు. 19,880 మంది తలనీలాలు సమర్పించారు. సోమవారం హుండీ ద్వారా సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించగా రూ.3.53 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు బుధవారం ప్రకటించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు డ్రీమ్ ఫౌండేషన్ 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. న్యూ బాలాజీ కాలనీలోని రాస్ (RASS) కార్యాలయంలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. 18-35 సంవత్సరాల్లోపు 10వ తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన విభిన్న ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తిరుపతి జిల్లాలో ఈనెల 26 నుంచి 28 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలోని మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని సూచించారు. జిల్లాలో ఏ సమస్య వచ్చినా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సైక్లోన్ కంట్రోల్ రూమ్ 0877-2236007కు సమాచారం అందించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.