India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఆదివారం తెలిపారు. మొత్తం 118 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు 20, 954 మంది, ప్రైవేటు విద్యార్థులు 294 మంది పరీక్షకు హాజరవుతున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లోనికి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

చిత్తూరు జిల్లాలోని పలు దుకాణాలలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బాయిలర్ కోడి కిలో రూ.114, లేయర్ కోడి రూ.90గా పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. కాగా బాయిలర్ కోడి మాంసం కేజీ. రూ.165, స్కిన్ లెస్ కేజీ రూ.185, లేయర్ కోడి మాంసం కేజీ రూ.153 పలుకుతోంది. మీ ప్రాంతాలలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

తిరుపతిలో ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఓ విద్యార్థిని తోటి విద్యార్థినిని రెండో అంతస్తు నుంచి క్రిందకు తోసేసింది. దీంతో 14 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థినికి గోప్యంగా చికిత్సను స్కూల్ యాజమాన్యం అందిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పేదల అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, అభివృద్ధికి అడ్డుపడితే సహించనని పలువురు TDP నేతలపై ఎమ్మెల్యే థామస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పెనుమూరులో పర్యటించిన ఆయన.. కేవలం పార్టీలోని కొందరు నేతలు YCP నేతలతో తిరుగుతూ ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారన్నారు. తాను దేశాలు తిరిగిన నేతనని, అగ్రకులాల వారికి సలాం చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదన్నారు. తనను రెచ్చిగొడితే అంతు చూస్తానన్నారు.

రెండు రోజుల క్రితం SP నుంచి ఉత్తమ పని తీరు కనబరిచిన CI.. 24 గంటలు గడవక ముందే సస్పెండ్ కావడం చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. పుంగనూరులో శనివారం రామకృష్ణ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో DIG ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన SP మణికంఠ.. పుంగనూరు CI శ్రీనివాసులు నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగినట్లు నిర్ధారించారు. దీంతో CIతోపాటూ హెడ్ కానిస్టేబుల్ను స్సస్పెండ్ చేశారు.

చిత్తూరు జిల్లాకు చెందిన పలువురికి వైసీపీ రాష్ట్ర అనుబంధ విభాగాలలో చోటు కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మైనార్టీ విభాగం స్టేట్ జోనల్ అధ్యక్షునిగా షఫీ అహ్మద్ ఖాద్రి, కార్యదర్శులుగా అబ్బాస్, మహీన్, జాయింట్ సెక్రటరీలుగా సర్దార్, నూర్, ఐటీ వింగ్ జనరల్ సెక్రటరీగా భాస్కర్ రెడ్డి, సెక్రటరీగా యుగంధర్ రెడ్డి నియమితులయ్యారు.

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే బడులు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న 118 పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు పనిచేయాలని ఉత్తర్వుల్లో సూచించారు.

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ నేటి(శనివారం) నుంచి ఈ నెల 19వరకు సెలవులోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇన్ఛార్జ్ కలెక్టర్గా జాయింట్ కలెక్టర్ విద్యాధరి వ్యవహరించనున్నారు.

APSSDC ఆధ్వర్యంలో చిత్తూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి జి.పద్మజ తెలిపారు. 3 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. స్థానిక పరిసర ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. # SHARE IT.

APSSDC ఆధ్వర్యంలో చిత్తూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి జి.పద్మజ తెలిపారు. 3 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. స్థానిక పరిసర ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. # SHARE IT.
Sorry, no posts matched your criteria.