India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతి సంస్కృత వర్సిటీలో పలువురు విద్యార్థులు గంజాయి వినియోగిస్తున్నారంటూ వస్తున్న కథనాలపై వర్సిటీ రిజిస్ట్రార్ రమాశ్రీ స్పందించారు. మీడియాలో వస్తున్న కథనాల్లో ఏ మాత్రం నిజాలు లేవన్నారు. పలువురు విద్యార్థులు తరగతులకు హాజరుకాకపోవడంతో హాస్టల్ గదులను తనిఖీ చేశామన్నారు. అనుమానంతో పలువురుని టెస్టింగ్ కోసం రుయాకు తరలించినట్లు తెలిపారు. యాంటీ డ్రగ్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పాఠశాలలో విద్యార్థులకు అసెస్మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మండల స్థాయిలో ఎంఈఓలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా సచివాలయం నుంచి డిఈఓ వరలక్ష్మి సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి అసెస్మెంట్ కార్డులను అందించాలన్నారు.
పాఠశాలలో విద్యార్థులకు అసెస్మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మండల స్థాయిలో ఎంఈఓలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా సచివాలయం నుంచి డిఈఓ వరలక్ష్మి సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి అసెస్మెంట్ కార్డులను అందించాలన్నారు.
విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మృతి చెందిన ఘటన చిన్నగొట్టిగల్లు మండలం దేవపట్లవారిపల్లిలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల పులిచర్ల అటవీ ప్రాంతం నుంచి చిన్నగొట్టిగల్లు పరిధిలోకి ఏనుగుల మంద వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి రైతులు పంటపొలాలను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.
తిరుపతిలోని సంస్కృత యునివర్సిటీలో గంజాయి విక్రయాలు జరిగాయన్నఆరోపణలు స్థానికంగా చర్చనీయాశం అయ్యాయి. ఓ UG విద్యార్థి ఇంటి నుంచి గంజాయి తెచ్చి విక్రయించాడంటూ పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై వర్సిటీ ఉన్నతాధికారులు, పోలీసులు స్పందిస్తూ.. ఘటనపై యాంటీ డ్రగ్ కమిటీ వేశాం. నివేదిక రాగానే చర్యలు చేపడతాం. ఇందులో భాగంగానే విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పిస్తామని వారు వెల్లడించారు.
ఆర్థిక దోపిడీ చేయడానికి ప్రభుత్వం PAC ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వలేదని ఎర్రగొండపాలెం వైసీపీ MLA తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ‘జగన్ గారు భయపడి అసెంబ్లీకి రావడం లేదని కూటమి నాయకులు అంటున్నారు. మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూస్తే ఎందుకంత భయం? పీఏసీ ఛైర్మన్ పదవికి ఆయన నామినేషన్ వేస్తే ఎందుకు కుట్ర చేశారు?’ అని ప్రశ్నించారు. కాగా PAC ఛైర్మన్గా జనసేన MLA రామాంజినేయులు ఎన్నికయ్యారు.
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆన్లైన్ టెండర్లు, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం ద్వారా రూ.4.44 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈఓ గురుప్రసాద్ తెలిపారు. లైసెన్సులు ద్వారా రూ. 2.03 కోట్లు సమకూరినట్లు చెప్పారు. ఆన్లైన్, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలంతో రూ.2.40 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
జార్జియా దేశంలో ఎంబీబీఎస్ కోర్సు చేయడానికి వెళ్లిన 60 మంది తెలుగు విద్యార్థులు అక్కడి హాస్టల్ నిర్వాహకులు చేసిన మోసంతో రోడ్డుపై పడ్డారని, భారత ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కలుగజేసుకొని క్షేమంగా ఆ విద్యార్థులను స్వదేశానికి తీసుకురావాలని విద్యార్థిని తండ్రి వై.ఆనంద్ రెడ్డి ప్రభుత్వాల పెద్దలకు విజ్ఞప్తి చేశారు.
మధ్యాహ్న సమయంలో మాత్రమే <<14677511>>దొంగతనాలు<<>> చేసే వ్యక్తి తిరుపతి పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ప్రకాశం(D) సింగరాయకొండ(M) సోమరాజుపల్లికి చెందిన అప్పలనాయుడు(29), చెడు అలవాట్లకు బానిసై 16వ ఏట నుంచి దొంగతనాలు చేస్తున్నాడు. విమానాల్లో తిరుగుతూ..ఎంజాయ్ చేస్తుంటాడు. తిరుపతిలోని ఓ ఫైనాన్స్ ఆఫీసులో ఈనెల 15న రూ.8 లక్షలు దొంగలించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరాయకొండ, ఒంగోలు, విశాఖలో ఇతనిపై 18 కేసులు ఉన్నాయి.
మాజీ మంత్రి, పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ YCP అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్గా ఉన్న ఆయనకు తాజాగా ఉమ్మడి తిరుపతి, చిత్తూరు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Sorry, no posts matched your criteria.