Chittoor

News November 22, 2024

తిరుపతి: P.G ఫలితాలు విడుదల

image

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో M.A ఇంగ్లిష్ రెండో, నాల్గో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించింది.

News November 22, 2024

పెద్దిరెడ్డి నామినేషన్.. చరిత్రలో తొలిసారి ఓటింగ్

image

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC) ఛైర్మన్ పదవి ప్రతిపక్షాలకు ఇస్తుంటారు. ఈక్రమంలో వైసీపీ తరఫున మాజీ మంత్రి, పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. పీఏసీలో మొత్తం 9 మంది సభ్యులు ఉంటారు. కూటమి ప్రభుత్వం నుంచే 9 మంది నామినేషన్లు వేశారు. వీరికి తోడుగా పెద్దిరెడ్డి నామినేషన్ పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి పీఏసీ ఛైర్మన్‌కు ఇవాళ ఓటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.

News November 22, 2024

తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

image

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. గురువారం రాత్రి ఆయన ఆలయ మాడవీధులలో పర్యటించారు. భద్రతాపరమైన అంశాలపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. పంచమి తీర్థమనాడు పుష్కర స్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకునే బాధ్యత పోలీసు వారు తీసుకోవాలన్నారు. వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

News November 22, 2024

 రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: కలెక్టర్

image

తిరుపతి జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్ ఛాంబర్ నందు బాలాజీ రిజర్వాయర్, మల్లెమడుగు రిజర్వాయర్ పెండింగ్ పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు.

News November 21, 2024

తిరుపతి: SV ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థి మృతి

image

డిగ్రీ విద్యార్థి మామండూరు వాటర్ ఫాల్స్‌‌ వద్ద మృతి చెందాడు. తిరుపతి SV ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్( సైకాలజీ) చదువుతున్న హేమాద్రి అనే విద్యార్థి గురువారం స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్‌కు వెళ్లాడు. అతని స్నేహితుడు వాటర్‌ఫాల్స్‌లో మునిగిపోతుండగా రక్షించే క్రమంలో మృతి చెందినట్లు సహచర స్నేహితులు తెలిపారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తివివరాలు తెలియాల్సిఉంది.

News November 21, 2024

PAC ఛైర్మన్ పదవికి పెద్దిరెడ్డి నామినేషన్.!

image

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఈ క్రమంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన వచ్చినట్లు సమాచారం. కాగా ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అయితే ప్రతిపక్ష హోదా ఉంటేనే ఇందుకు అర్హులని టీడీపీ వాదిస్తోంది.

News November 21, 2024

CTR: 23వ తేదీన జాబ్ మేళా

image

చిత్తూరు జిల్లా ఇరువారంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC)లో 23వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, ఏదైనా డిగ్రీ, బి.ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 225 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.

News November 21, 2024

పెద్దిరెడ్డి తోటలో పోలీసులు గన్స్ పెట్టారు: జగన్

image

నిన్న జరిగిన ప్రెస్‌మీట్‌లో మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మొన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్న నాతో చెప్పాడు. ఎస్పీ ప్రోద్బలంతో సీఐ పెద్దిరెడ్డి తోటకు వెళ్లి నాటు తుపాకులు పెట్టారు. అక్కడ పనిచేసే 60 ఏళ్ల వృద్ధురాలిని కొట్టి నేరం ఒప్పించేలా చేశారు. న్యాయమూర్తి వద్ద ఆమె ఈ విషయం చెప్పడంతో సీఐని తిట్టి పంపించారు. వారం క్రితమే ఈ ఘటన జరిగింది’ అని జగన్ అన్నారు.

News November 21, 2024

చిత్తూరు: డిసెంబర్ 20 లోపు సీసీ రోడ్లు పూర్తి చేయాలి

image

డిసెంబర్ 20 లోపు సీసీ రోడ్లు పూర్తిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ..జిల్లాలో1500 CC.రోడ్డు పనులు మంజూరు కాగా 1018 పనులు గ్రౌండింగ్ కాబడ్డాయని తెలిపారు. ఇందులో 406 పనులు పూర్తి కాగా 612 పనులు పురోగతిలో కలవని తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే బిల్లులు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

News November 20, 2024

బసినికొండ వద్ద రోడ్డు ప్రమాదం.. తమిళనాడు వాసి మృతి

image

బసినికొండ బైపాస్ రోడ్డులో ఈ నెల 17న అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డ తమిళనాడు వాసి, బుధవారం రుయాలో మృతి చెందాడు. మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ వివరాల ప్రకారం.. తమిళనాడు, డిండిగల్ జిల్లా పెరియకోటకు చెందిన మారముత్తు(45) స్థానిక సీటీఎం రోడ్డు, దేవతానగర్‌లో ఉన్న బంధువుల ఇంటికి బైకుపై వస్తుండగా బసినికొండలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈఘటనలో బాధితుడు మృతి చెందాడు.