Chittoor

News July 9, 2024

గుడిపాలలో ATM దోపిడి..హరియాణా ముఠా పనే?

image

గుడిపాల SBI ATMలో ఆదివారం జరిగిన దోపిడీ హరియాణా ముఠా పనేనని పోలీసులు అనుమానంవ్యక్తం చేస్తున్నారు. మినీ GAS సిలిండర్, GAS కట్టర్‌తో ATM దోపిడీకి పాల్పడే తీరును పరిశీలించిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకలోని ఓATMలో గ్యాస్‌ కట్టర్‌తో రూ.14లక్షలు దోపిడీ చేయగా..మరికొన్ని నిమిషాల వ్యవధిలో అస్సాంలో దోపిడీకి విఫలయత్నం, గుడిపాలలో దోపిడీ జరగడంతో హరియాణా ముఠా పనేనని అనుమానిస్తున్నారు.

News July 9, 2024

చిత్తూరు: బాలుడిని నేలకేసి కొట్టి చంపిన సవతి తండ్రి అరెస్ట్

image

చిత్తూరు రూరల్ మండలం దిగు మాస పల్లిలో ఏడాదిన్నర వయసుగల బాలుడిని నేల కేసి కొట్టి చంపిన నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సవతి తండ్రి ప్రదీప్ చిన్న కొడుకు దినేశ్‌ను అతి కిరాతకంగా చంపిన కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ కుల్లాయప్ప, ఎస్సై వెంకటసుబ్బమ్మ పాల్గొన్నారు.

News July 9, 2024

తిరుపతి: దాడి ఘటనపై మంత్రి సత్యకుమార్ స్పందన

image

కాంట్రాక్టు స్టాఫ్ నర్సుపై దాడి ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభుకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. గాయపడిన నర్సు యశోదకు ప్రభుత్వ ఖర్చుతో చికిత్స అందించాలని, సెలవులు మంజూరు చేయాలని ఆదేశించారు. రుయా ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ నర్సుల అసోసియేషన్ అధ్యక్షులు మంజుల దేవి ప్రభుత్వ ప్రధాన కార్య దర్శికి వినతి పత్రం అందజేసి రక్షణ కల్పించాలని కోరారు.

News July 9, 2024

మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. విద్యార్థులకు తీవ్ర గాయాలు

image

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. ఎస్సై వెంకటసుబ్బయ్య వివరాల ప్రకారం.. స్థానిక నీరుగట్టువారిపల్లె ఎస్టీ హాస్టల్ విద్యార్థులు ముగ్గురు బైక్‌పై చంద్ర కాలనీ వద్దకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కాలనీ వద్ద వారి బైకు అదుపుతప్పి కింద పడ్డారు. క్షతగాత్రల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు.

News July 9, 2024

ఏర్పేడు: 10న KVలో వాక్‌-ఇన్ ఇంటర్వ్యూలు

image

ఏర్పేడు ఐఐటి ప్రాంగణంలోని కేంద్రీయ విద్యాలయం (kV)లో 2024-25 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు 10న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రకటించారు. ప్రైమరీ టీచర్స్, స్పోర్ట్స్ కోచ్, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించారు.

News July 9, 2024

10న చిత్తూరులో మెగా జాబ్ మేళా

image

చిత్తూరు పట్టణంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో 10న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మజ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. టెన్త్, ఇంటర్, డిప్లమా, ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని చెప్పారు. అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 8, 2024

10న చిత్తూరులో మెగా జాబ్ మేళా

image

చిత్తూరు పట్టణంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో 10న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మజ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. టెన్త్, ఇంటర్, డిప్లమా, ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని చెప్పారు. అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 8, 2024

ఏర్పేడు: 12న IISERలో కాన్వొకేషన్

image

ఏర్పేడు మండలం శ్రీనివాసపురం వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)నందు 12వ తేదీన ఐదో కాన్వొకేషన్ వేడుకను నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు లెక్చరర్ హాల్ కాంప్లెక్స్ వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరు కావాలని కోరారు.

News July 8, 2024

స్విమ్స్‌లో డిగ్రీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల

image

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జులై 22వ తేదీ లోగా దరఖాస్తులను సమర్పించాలని కోరింది.

News July 8, 2024

తిరుపతి: ఫుడ్ కోర్ట్ ప్రారంభించిన ఎస్పీ

image

పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లాస్థాయి దళం కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన నూతన ఫుడ్ కోర్టును ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు. విధినిర్వహణలో ఉండి ఇళ్లకు వెళ్లి భోజనాలు చేయలేని సిబ్బంది కోసం దీనిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎటువంటి లాభాపేక్షా లేకుండా, తక్కువ ధరకే ఆహార పదార్థాలు సిబ్బందికి అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. అడిషనల్ ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్ విమల కుమారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.