India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైల్వే రక్షణ దళం (RPF) ఆపరేషన్ నార్కోస్ ను ప్రారంభించింది. శుక్రవారం తిరుపతి రైల్వే స్టేషన్లో RPF, GRP భద్రతా బలగాలు లగేజ్ కౌంటర్లు, పార్శిల్ ఆఫీస్, ప్లాట్ఫారమ్ల పై విస్తృత తనిఖీలు చేశారు. తనిఖీల సమయంలో ఆర్పీఎఫ్కు చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలం ప్లాట్ఫారంపై నిర్లక్ష్యంగా వదిలిపెట్టబడిన ట్రాలీ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్లలో నిషేధిత గంజాయిని గుర్తించింది. దీని విలువ సుమారు రూ.3,78,100 ఉంటుంది.
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిధిలో డిగ్రీ (UG) 3, 5 సెమిస్టర్ పరీక్షలు డిసెంబర్ 4వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్నట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ (SPMVV)లో ఎంటెక్ (M.Tech) విభాగంలో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఆ యూనివర్సిటీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో 17వ తేదీలోపు కళాశాలలో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడగలరు.
తిరుపతి శ్రీపద్మావతి డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతున్న విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యార్థిని స్వగ్రామంలో ఆమె స్నేహితుడు 2 రోజుల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి విద్యార్థిని తీవ్ర ఆందోళనకు గురైంది. ఈక్రమంలో స్నేహితుడి మృతిని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ చెబుతున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రముఖ సినీ నటుడు పోసాని మురళీకృష్ణపై చిత్తూరు ఈస్ట్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో రిపోర్టర్ రాజేందర్ నాయుడు ఫిర్యాదు చేశారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడును కించపరచే విధంగా పోసాని వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అతనిపైన చర్యలు తీసుకోవాలని ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశామన్నారు.
ఈ నెల 15వ తేదీన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని లోకల్ హాలిడే ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణి వరలక్ష్మి తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అటెండెన్స్ యాప్లో ఆప్షనల్ హాలిడే (OH) గా నమోదు చేయాలని అన్నారు. లేనిపక్షంలో ఆబ్సెంట్ గా నమోదు జరుగుతుందని తెలిపారు.
తిరుపతి శ్రీపద్మావతి డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థి ఊరి వేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గురువారం కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుంది. అయితే విద్యార్థిని మృతి చెందినట్లు తెలుసుకున్న విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నాయి. మీడియా, సంఘాలను పోలీసులు గేటు వద్ద అడ్డుకుని, లోపల విచారిస్తున్నారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
తిరుమల శ్రీవారికి ఓ భక్తురాలు భారీ బంగారు కానుకను ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా సుమారు రూ.2 కోట్లు విలువైన వజ్రవైడుర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీ మాలను డీకే ఆదికేశవులు మనవరాలు తేజస్వీ విరాళమిచ్చారు. ఈవైజయంతీ మాలను ఉత్సవమూర్తులకు టీటీడీ అలంకరించనుంది. తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి కూడా మరో వైజయంతీ మాలను రేపు విరాళం ఇవ్వనున్నట్లు దాత తెలిపారు.
తిరుపతి రూరల్ (మం) వేదాంతపురం నేషనల్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువుల గృహ ప్రవేశం కోసం బెంగళూరు నుంచి కారులో వస్తుండగా వారిని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో తిరుపతి రుయాకు తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిత్తూరు మాజీ MLA CK.బాబుపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూకు జిల్లా కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను కొట్టేస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. 2005 డిసెంబర్ 31న సీకే బాబు ఇంటి వద్ద మందు పాత్ర పేలింది. ఇందులో ఒకరు చనిపోగా, పలువురు గాయపడ్డారు. దీనికి సంబంధించిన కేసులో 2018లో చింటూను దోషిగా తేలుస్తూ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.
Sorry, no posts matched your criteria.