Chittoor

News July 5, 2024

తిరుపతికి భారీ వర్ష సూచన

image

తిరుపతి జిల్లాలో శుక్రవారం రాత్రి అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

News July 5, 2024

తిరుపతి సమస్యలను తీరుస్తా: మంత్రి దుర్గేశ్ 

image

రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతికి వచ్చిన మంత్రి కందుల దుర్గేశ్‌ను శుక్రవారం ఉదయం MLA ఆరణి శ్రీనివాసులు, తిరుపతి జనసేన అధ్యక్షుడు రాజారెడ్డి, కిరణ్ రాయల్ ఆత్మీయంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శాలువతో సత్కరించారు. అనంతరం ప్రజా సమస్యలపై మంత్రితో రాజారెడ్డి చర్చించారు. తిరుపతిలోని పర్యాటక శాఖలో ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

News July 5, 2024

TPT: దరఖాస్తులకు రేపే చివరి తేదీ

image

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు దరఖాస్తు గడువు శనివారంతో ముగుస్తుందని కార్యాలయం పేర్కొంది. సాంప్రదాయ కళంకారి కళలో డిప్లొమా, వివిధ రకాల సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు https://www.tirumala.org/ వెబ్‌సైట్ చూడగలరు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జులై 06.

News July 5, 2024

చిత్తూరు: భార్యపై కత్తితో దాడి

image

భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేసిన భర్తపై కేసు నమోదు చేసినట్లు సీఐ వలసయ్య తెలిపారు. గంగనపల్లెకు చెందిన సెల్వరాసన్ అదే కాలనీకి చెందిన ఆరిఫాను 13 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ పాప కూడా ఉంది. ఇంటి వద్ద గురువారం ఆరిఫాతో సెల్వ రాసన్ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఇంట్లో ఉన్న కత్తితో భార్యపై దాడి చేశాడు. ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News July 5, 2024

పెద్దిరెడ్డి కుటుంబంపై విజిలెన్స్ డీజీకి ఎమ్మెల్సీ భూమిరెడ్డి ఫిర్యాదు

image

టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీకి ఫిర్యాదు చేశారు. మంగంపేట ముగ్గురాయి గనుల అక్రమాలపై విచారణ జరిపాలని కోరారు. గనుల్లో రూ.2 వేల కోట్ల దోపిడీ చేశారని తెలిపారు. ఎంప్రెడా కంపెనీ ముసుగులో పెద్దిరెడ్డి కుటుంబం దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. మాజీ ఎండీ వెంకట్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి అక్రమార్కులకు అండగా నిలిచారన్నారు.

News July 5, 2024

చిత్తూరు: బహిరంగ ధూమపానం చేస్తే కఠిన చర్యలు

image

బహిరంగ ధూమపానం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మణికంఠ హెచ్చరించారు. జాతీయ పొగాకు నియంత్రణ, రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ సంబంధ హెల్త్ ఫౌండేషన్ సహకారంతో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో జిల్లాలోని పోలీసు అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పొగాకు వ్యతిరేకంగా పోరాడుతామని అధికారులు ప్రమాణం చేశారు. పాఠశాలలు, కాలేజీలకు సమీపంలో పొగాకు ఉత్పత్తుల అమ్మితే చర్యలు చేపడతామని ఎస్పీ చెప్పారు.

News July 4, 2024

తిరుమలలో టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్

image

శ్రీవారి దర్శనం కోసం గురువారం రాత్రి టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు పుష్పగుచ్చం అందజేసి చంద్రశేఖరన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. టీసీఎస్ ప్రెసిడెంట్ రాజన్న కూడా పాల్గొన్నారు. శుక్రవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకోనున్నారు.

News July 4, 2024

కల్లూరు: గుండెపోటుతో RTC బస్సు డ్రైవర్ మృతి

image

పులిచెర్ల మండలం కొక్కువారిపల్లె సమీపంలో RTC డ్రైవర్ రాఘవయ్య గుండెపోటుతో మృతి చెందాడు. పుంగనూరు RTC డిపోకు చెందిన బస్సు తిరుపతి నుంచి కల్లూరుకి వస్తుండగా మార్గమధ్యంలో ఆర్‌టీసీ డ్రైవర్ రాఘవయ్యకు గుండెపోటు వచ్చింది. దీంతో కండక్టర్ హుటాహుటిన డ్రైవర్‌ను సమీపంలోని పులిచెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

News July 4, 2024

తిరుపతి: మామిడి తోటలో దాచిన ఎర్రచందనం దుంగలు స్వాధీనం

image

అటవీశాఖ తిరుపతి నిఘా విభాగం అధికారులు గురువారం పుత్తూరు సమీపంలో నిర్వహించిన దాడుల్లో పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు సమీపంలో గొల్లపల్లిలో ఉన్న మామిడి తోటలో స్మగ్లర్లు తరలించడానికి ప్రయత్నించిన 947 కిలోల బరువున్న 125 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేశారు.

News July 4, 2024

పుంగనూరు: జగన్‌ను కలిసిన పెద్దిరెడ్డి

image

నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.