Chittoor

News February 22, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: చిత్తూరు MP

image

చిత్తూరు పార్లమెంటరీ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు ఒక ప్రకటనలో కోరారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో రహదారులు నెత్తురోడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మానవ తప్పిదాలతో జరుగుతున్న వరుస ప్రమాదాలతో విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నట్లు చెప్పారు. వాహనదారులు నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలన్నారు.

News February 21, 2025

చిత్తూరు: రేపు జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం

image

జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఈనెల22వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సమావేశం ప్రారంభమవుతుందన్నారు. సంబంధిత అధికారులు, సభ్యులు తప్పకుండా హాజరవ్వాలన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.

News February 21, 2025

22న కుప్పానికి హైపర్ ఆది రాక 

image

ప్రముఖ బుల్లితెర నటుడు హైపర్ ఆది ఈనెల 22న కుప్పంకు రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. కుప్పంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్‌ డే వేడుకలలో పాల్గొననున్నట్లు ఆది తెలిపారు. కుప్పం పర్యటన కోసం తాను ఎదురు చూస్తున్నానని, 22న కుప్పంలో కలుద్దామంటూ ఆది పిలుపునిచ్చారు. కాగా కార్యక్రమానికి ఆదితోపాటూ, మరో నటుడు రాంప్రసాద్ సైతం వస్తున్నారు. 

News February 20, 2025

చిత్తూరు జిల్లాలో ఇవాల్టి ముఖ్య ఘటనలు

image

✒ చిత్తూరు జిల్లాలో పబ్లిక్ పరీక్షలపై కలెక్టర్ కీలక ఆదేశాలు
✒ 22న కుప్పానికి హైపర్ ఆది రాక
✒ అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోం: కుప్పం DSP
✒ కార్వేటినగరంలో ముగ్గురి అరెస్ట్
✒ తిరుపతి: హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
✒ చిత్తూరులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు
✒ తిరుపతి-పీలేరు హైవేపై రెండు కార్లు ఢీ
✒ జీడీ నెల్లూరు MRO ఆఫీసులో తనిఖీలు

News February 20, 2025

తిరుపతి: హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

image

తిరుపతి రూరల్ మండలం, రామంజపల్లి చెక్‌పోస్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని ఇద్దరు స్కూటీపై వెళ్తుండగా ఆర్‌సీ పురం జంక్షన్ నుంచి ఉప్పరపల్లి వైపు వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 20, 2025

చిత్తూరు: పకడ్బందీగా పబ్లిక్ పరీక్షలు

image

జిల్లాలో ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంటర్లో 30,652 మంది విద్యార్థులు, పదో తరగతిలో 21,248 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు చెప్పారు. పరీక్ష నిర్వహణలో చీటింగ్‌కి పాల్పడితే ఎగ్జామినేషన్ యాక్ట్ కింద చర్యలు తప్పవన్నారు.

News February 20, 2025

తవణంపల్లి MRO ఆఫీసులో JC విద్యాధరి తనిఖీలు 

image

తవణంపల్లి MRO ఆఫీసును బుధవారం జాయింట్ కలెక్టర్ విద్యాధరి పరిశీలించారు. ఈ మేరకు ఆమె ఆఫీసులోని రికార్డులను తనిఖీ చేశారు. భూముల రీ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రైతుల సమస్యలపై ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మార్వోకు సూచించారు. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు సకాలంలో అందుతున్నాయా అని ఆరా తీశారు. 

News February 19, 2025

చిత్తూరు జిల్లాలో TODAY TOP NEWS

image

✒ చిత్తూరు జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు
✒ డాక్టర్లకు చిత్తూరు కలెక్టర్ వార్నింగ్
✒ పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి
✒ పెనుమూరు: MLA హామీ.. తప్పిన ప్రమాదం
✒ పలమనేరు: బాలిక మృతి కేసులో డీఎస్పీ విచారణ
✒ తవణంపల్లి మండలంలో ముగ్గురి అరెస్ట్
✒ బూతులతో రెచ్చిపోయిన టీటీడీ బోర్డు సభ్యుడు

News February 19, 2025

ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు ఇద్దరు విద్యార్థుల ఎంపిక

image

ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు పులిచెర్ల మండలం కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలోని ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్టు హెచ్ఎం శ్రీవాణి తెలిపారు. షాహిస్తా తబుసం, యశ్రబ్ స్కాలర్షిప్‌కు ఎంపికైనట్టు ఆమె వెల్లడించారు. గత సంవత్సరం డిసెంబర్‌లో నిర్వహించిన పరీక్షకు పాఠశాల నుంచి 25 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించింది.

News February 19, 2025

చిత్తూరు జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

image

చిత్తూరు జిల్లా పరిధిలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో సెలక్ట్ చేసిన సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, పాత కార్డులో వివరాల అప్‌డేట్, మొబైల్ లింకింగ్, చిన్న పిల్లల ఆధార్ నమోదు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలోని సచివాలయాలను సంప్రదిస్తే.. ఏ సచివాలయంలో ఆధార్ సేవలు అందిస్తారో మీకు చెబుతారు.