Chittoor

News July 2, 2024

చిత్తూరు: జిల్లాలో 88.6% పింఛన్ల పంపిణీ

image

జిల్లాలో సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు 88.6% పింఛన్లను లబ్ధిదారులకు అందజేసినట్లు అధికారులు తెలిపారు. నగిరి 96.97%, యాదమరి 96.13%తో తొలి రెండు స్థానాల్లో నిలిచాయన్నారు. కుప్పం 71.83 శాతం, రొంపిచర్ల 71.16% శాతంతో ఆఖరి రెండు స్థానాల్లో నిలిచాయని వెల్లడించారు. వంద శాతం పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు.

News July 1, 2024

తిరుపతి:ఈ నెల 4వ తేదీ లోపు తప్పకుండా సమర్పించాలి

image

ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చుచేసిన మొత్తాలకు తుది అకౌంట్స్ వివరాలను వ్యయ పరిశీలకులకు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లో ఖర్చుపై ఏజెంట్లతో సమీక్షించారు. ఎన్నికల ఖర్చుల వివరాలను జులై 4వ తేదీలోగా తప్పకుండా సమర్పించాలన్నారు. ఫలితాలు వెల్లడైన 30 రోజుల్లోపు ప్రతి అభ్యర్థి తమ వ్యయ వివరాల బిల్లులను అప్పగించాలన్నారు.

News July 1, 2024

అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు: SP

image

తిరుపతి జిల్లాలో నేటి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రకటించారు. తన కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది. ప్రతి సిటిజన్ ఎక్కడ నుంచైనా, ఆన్‌లైన్‌లోనైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు. సంబంధిత కాపీని ప్రతి సిటిజన్‌కు ఇవ్వాలి. గతంలో 511 సెక్షన్లు ఉంటే ప్రస్తుతం 358 సెక్షన్లకు కుదించారు’ అని ఎస్పీ చెప్పారు.

News July 1, 2024

పింఛన్ల పంపిణీలో కుప్పం లాస్ట్

image

చిత్తూరు జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు 40.51 శాతం పింఛన్లు పంపిణీ చేశారు. అత్యధికంగా యాదమరిలో 74.3 శాతం మందికి నగదు అందించారు. అత్యల్పంగా చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో 18.29 శాతం మందికి మాత్రమే నగదు పంపిణీ చేశారు. ఇదే నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో సైతం 24.94 శాతం మందికే ఇప్పటికి పెన్షన్ అందింది.

News July 1, 2024

పెద్దిరెడ్డి అరాచకాలపై క్యాసెట్ పంపిస్తా: బాబు

image

పుంగనూరులో అధికార పార్టీ దాడులు ఎక్కువైనట్లు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన ఆరోపణలపై TDP ఇన్‌ఛార్జ్ చల్లా బాబు స్పందించారు. ‘గత రెండేళ్లలో పుంగనూరులో ప్రతిపక్షాలపై మీ నాన్న పెద్దిరెడ్డి చేసిన దాడులు ఏంటో తెలుసుకోవాలి. మా కార్యకర్తలపై 307 కేసులు పెట్టారు. పుంగనూరులో మీ అరాచకాలను క్యాసెట్ రూపంలో పంపమంటే పంపిస్తా. మీ దాడులకు టీడీపీ నేతలు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు’ అని బాబు అన్నారు.

News July 1, 2024

చిత్తూరు: 3 నుంచి వినతుల స్వీకరణ

image

విద్యుత్తు వినియోగదారుల సమస్యలు సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రతి బుధవారం డివిజన్ కార్యాలయాల్లో వినతుల స్వీకరణకు శ్రీకారం చుట్టినట్టు చిత్తూరు ఎస్ఈ సురేంద్ర నాయుడు తెలిపారు. సర్కిల్ పరిధిలోని ఎనిమిది డివిజన్ కార్యాలయాల్లో వినతుల స్వీకరణ ఈనెల 3 నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రతి బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వినియోగదారుల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు.

News July 1, 2024

తిరుపతి: 4 నుంచి ఈఏపీ సెట్ కౌన్సెలింగ్

image

తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈఏపీ సెట్-2024 (ఎంపీసీ స్ట్రీమ్) కౌన్సెలింగ్ జులై 4 నుంచి ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. అభ్యర్థులు 1వ తేదీ నుంచి 7 తేదీ లోపు ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోఆర్డినేట్ ద్వారకానాథ్ రెడ్డి సూచించారు. 8 నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. 13న మార్పులు చేర్పులు, 16న సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది.

News July 1, 2024

అక్రమాల్లో జగన్ తర్వాత పెద్దిరెడ్డే: మంత్రి

image

వైసీపీ పాలనలో జగన్ తర్వాత ఎక్కువగా అక్రమాలకు పాల్పడి దోచుకుంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డేనని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ‘రాయలసీమ జిల్లాల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీదే పెద్ద మాఫియా. ల్యాండ్, వైన్, మైన్ అన్ని కుంభకోణాలు చేశారు. వాటిని ఆధారాలతో సహా త్వరలో బయటపెడతా. శాంతిభద్రతల సమస్య నేపథ్యంలోనే పుంగనూరుకు వెళ్లడానికి మిథున్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వలేదు’ అని మంత్రి చెప్పారు.

News July 1, 2024

CTR: నేడు 5.4 లక్షల మందికి పింఛన్ల పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో 2.71 లక్షల మందికి సోమవారం నుంచి పింఛన్లను పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ 181.02 కోట్లను విడుదల చేసిందని వెల్లడించారు. పూతలపట్టు మండలంలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొంటారు. మరోవైపు తిరుపతి జిల్లాలో 2.69 లక్షల మందికి రూ.182.33 కోట్లను అందజేయనున్నారు. మొత్తంగా 5.4 లక్షల మందికి రూ.363.05 కోట్లు పంపిణీ చేస్తారు.

News July 1, 2024

చిత్తూరు: మామిడి కిలో రూ. 24 చెల్లించాలి

image

జూలై 1 నుంచి 3 వరకు తోతాపూరి మామిడికి కిలో ధర రూ. 24 కు తగ్గించకుండా చెల్లించాలని గుజ్జు పరిశ్రమల యజమానులకు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ఆదివారం సాయంత్రం పరిశ్రమల యజమానులు, రైతులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. రైతులు వారి పంటను నేరుగా ఫ్యాక్టరీలకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఒకేసారి కోతలు కోయకుండా విడతల వారీగా చేయాలని సూచించారు. 3న సాయంత్రం మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు.