India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాణిపాకం వరసిద్ధి వినాయస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారు చిన్న, పెద్ద శేషవాహనాల్లో విహరించనున్నారు. ఈ సేవకు ఉభయకర్తలుగా కాణిపాకం, కాకర్లవారిపల్లె, వడ్రాంపల్లె, మిట్టిండ్లు, కొత్తపల్లె, అడపగుండ్ల పల్లె, 44 బొమ్మసముద్రం, తిమ్మోజిపల్లి, తిరువణంపల్లి, చిగరపల్లి, అగరంపల్లి గ్రామాల్లోని కమ్మ వంశస్తులు వ్యవహరించనున్నారని ఆలయాధికారులు తెలిపారు.
జిల్లా కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో డీఆర్ఓ మోహన్ కుమార్, DC విజయ శేఖర్ బాబు ఆధ్వర్యంలో శనివారం లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు జరిగింది. 11 బార్లు, గీత కార్మికులను ఒక బారుకు గాను 4 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనిని చిత్తూరు నగరపాలక పరిధిలో 3, పుంగనూరు మున్సిపాలిటీలో 1, కుప్పం మున్సిపాలిటీలో 1 ఎంపికైన వారికి కేటాయించినట్లు తెలిపారు.
చిత్తూరు జిల్లాలో శనివారం నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. లబ్ధిదారులు స్వస్థలాలకు వచ్చి డీలర్, వీఆర్వోల సమక్షంలో కార్డులు పొందాలని సూచించారు. బయోమెట్రిక్ వేసిన అనంతరం కార్డులు అందజేస్తామన్నారు. జిల్లాకు 5.26 లక్షల స్మార్ట్ కార్డులు వచ్చినట్టు వెల్లడించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి తనకు అవకాశం కల్పించాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. అలాగే మద్యం కేసులో రెగ్యులర్ బెయిల్ కావాలని కోరారు. ఈ రెండు పిటిషన్లపై విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. మరి మిథున్ రెడ్డి బెయిల్ వస్తుందో? లేదో? చూడాలి మరి.
సీఎం చంద్రబాబు కుప్పంలో నేడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు శాంతిపురం(M) శివపురంలోని తన ఇంటి నుంచి ఆర్టీసీ బస్సులో పరమసముద్రంలోని హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకుంటారు. బస్సులోనే మహిళలతో మాట్లాడుతారు. 11:30 గంటలకు జలహారతి ఇస్తారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులతో ఎంవోయూలు చేసుకుంటారు.
కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సీఎంను కలిశారు. చిత్తూరు ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు శాంతిపురంలో చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం కుప్పం నియోజకవర్గ ప్రజలకు హంద్రీనీవా జలాలను అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పలువురు నేతలు పేర్కొన్నారు. కరువు తీరి పంటల సాగుకు నీరు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
బైరెడ్డిపల్లి(M) విరూపాక్షపురం పక్షవాత ఆయుర్వేద వైద్యానికి ప్రత్యేకమని స్థానికులు పేర్కొన్నారు. తాజాగా ఇక్కడికి మందుకోసం నైజీరియా నుంచి నలుగురు వచ్చారు. వారు మాట్లాడుతూ.. తాము గత నెల 12న ఓ సారి మందు తీసుకున్నామని, రెండో విడత కోసం ఇవాళ వచ్చామన్నారు. మరోసారి మందు తీసుకోవాల్సి ఉందని, ఇప్పటికే ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. ఇక్కడికి దేశం నలుమూలల నుంచి పెరాలిసిస్ రోగులు వస్తుంటారని స్థానికులు తెలిపారు.
సీఎం చంద్రబాబు 2 రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నేడు కుప్పం రానున్నారు. సాయంత్రం 6:30 గంటలకు హెలికాప్టర్లో బెంగళూరు నుంచి శాంతిపురం (M) తుమిసి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్కు చేరుకుంటారు. అనంతరం కడపల్లి సమీపంలోని సొంత ఇంటికి చేరుకొని రాత్రి 7:30 గంటల ప్రాంతంలో కడ అడ్వైజరీ కమిటీతో సమావేశం కానున్నారు. రేపు కుప్పంలో హంద్రీనీవా జనాలకు జలహారతితో పాటు బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.
అధికారులు సమిష్టిగా పనిచేసి సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సీఎం పర్యటనకు సంబంధించి కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ, కడా పీడీ వికాస్ మర్మత్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గురువారం సమావేశమయ్యారు. సీఎం పర్యటనపై అధికారులతో చర్చించారు.
బోయకొండ గంగమ్మ ఆలయంలో నూతన పాలకమండలి(బోర్డు) కోసం 115 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఈవో ఏకాంబరం వెల్లడించారు. దరఖాస్తుల గడువు ఈనెల 27న ముగియడంతో చివరి దరఖాస్తును చిన్న ఓబునం పల్లికి చెందిన సుధాకర్ భార్య రాధమ్మ అందజేశారు. సెప్టెంబర్ 1న పరిశీలించి రాష్ట్ర దేవాదాయ కమిషనర్ కార్యాలయానికి పంపిస్తామని చెప్పారు. దరఖాస్తుల పరిశీలనకు అభ్యర్థులు కచ్చితంగా రావాలన్నారు.
Sorry, no posts matched your criteria.