Chittoor

News September 16, 2024

ఎర్రావారిపాళెం: ప్రకృతి వ్యవసాయ అమలులో మహిళల పాత్ర అద్భుతం

image

ప్రకృతి వ్యవసాయ అమలులో మహిళల పాత్ర అద్భుతమని మెక్సికో ప్రతినిధులు ప్రశంసించారు. సోమవారం మండలంలోని ఉదయ మాణిక్యం గ్రామంలో వారు పర్యటించారు. మెక్సికో ప్రభుత్వ ఏరియా డైరెక్టర్ డియాజ్ మరియా నేటివిటీ నేతృత్వంలో మెక్సికో బృంద సభ్యులు పర్యటించారు. ఉదయ మాణిక్యం గ్రామంలో గ్రామ ఐక్య సంఘ ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మహిళా ప్రతినిధులు ప్రకృతి వ్యవసాయ అమలులో తమ పాత్రను వివరించారు.

News September 16, 2024

చిత్తూరు జిల్లాకు రాష్ట్రంలో 8వ స్థానం

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ కేవైసీ నమోదు ఆదివారంతో ముగిసిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..జిల్లాలో ఇప్పటి వరకు 2,38,611 ఎకరాల్లో ఈ-పంట నమోదు చేసి 98.53 శాతం పూర్తి చేశామని చెప్పారు. ఇంకా 3,563 ఎకరాల్లో ఈకేవైసీ పెండింగ్ లో ఉందని తెలిపారు. ఈకేవైసీలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో ఎనిమిదో స్థానంలో ఉందని చెప్పారు.

News September 16, 2024

తిరుపతి: I7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్

image

తిరుపతి పట్టణంలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈనెల 17వ తేదీ నుంచి రెండో విడత పీజీ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. మొదటి విడత పీజీ కౌన్సిలింగ్ లో హాజరుకాని విద్యార్థినులు రెండో విడత కౌన్సిలింగ్ కి హాజరుకావాలని కోరారు. పీజీసెట్ లో అర్హత సాధించిన విద్యార్థినులు తమకు కావాల్సిన కోర్సును వెబ్ ఆప్షన్ల ద్వారా నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

News September 16, 2024

మొగిలి ఘాట్ రోడ్డు ప్రమాదంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య

image

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం(M) మొగిలి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. తిరుమల నుంచి పలమనేరు వైపుగా వస్తున్న RTC బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనగా ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గంగాధరనెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన పద్మావతి చికిత్స పొందుతూ అదివారం మృతి చెందింది.

News September 16, 2024

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

image

ఈద్ – ఎ -మిలాద్ ఉన్ నబీ ప్రభుత్వ సెలవు దినం కావడం వలన సెప్టెంబర్ 16న సోమవారం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ఉండదని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సోమవారం వినతులతో జిల్లా కలెక్టరేట్ కూ వ్యయ ప్రయాసాలకోర్చి రావొద్దని, ఈ అంశాన్ని ప్రజలు గమనించాలని ఆ ప్రకటనలో కోరారు.

News September 15, 2024

కలికిరి: వినాయక నిమజ్జనం ఊరేగింపులో అపశ్రుతి

image

వినాయకుని నిమజ్జనం ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం కలికిరి చదివేవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల సమీపంలో వినాయకుని నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా బాణాసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగసిపడి వెల్డింగ్ షాపు దగ్ధమైంది. అక్కడ ఉన్నవారు వెంటనే స్పందించి మంటలు ఆర్పడంతో చుట్టుపక్కల దుకాణాలకు మంటలు అంటుకోకుండా పెద్ద ప్రమాదం తప్పింది. వెల్డింగ్ షాపులో ఎవరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది.

News September 15, 2024

అన్నా క్యాంటీన్లను ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయండి

image

నగరపాలక సంస్థ పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంపై ఇంజనీరింగ్ అధికారులు అక్షయపాత్ర నిర్వాహకులతో శనివారం కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, డి.ఈలు విజయ్ కుమార్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తరితరులు పాల్గొన్నారు.

News September 14, 2024

తిరుపతి: స్పా సెంటర్ పై పోలీసుల దాడి

image

తిరుపతిలోని శ్రీనివాసం వెనుక వైపు డీబీఆర్ ఆసుపత్రి రోడ్డులో ఓ లాడ్జీ పై ఈస్ట్ పోలీసులు దాడులు నిర్వహించారు. లాడ్జీ పైన ఉన్న 7 స్పా సెంటర్ పై దాడి చేశారు. అందులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలను, నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు స్టేషన్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2024

SVU : పీజీ ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఏడాది ఏప్రిల్ నెలలో పీజీ ( PG) LLM మొదటి సెమిస్టర్, జులైలో M.A, M.COM, M.SC నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News September 14, 2024

చిత్తూరు: రాళ్లు పడి గాయపడ్డ వారిలో ఒకరు మృతి

image

ఎన్ హెచ్ పనులవద్ద టిప్పర్ పై నుంచి రాళ్లు పడి తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిలో ఒకరు మృతిచెందారు. బి.కొత్తకోట సీఐ రాజారెడ్డి కథనం.. బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కార్మికులు శనివారం ములకలచెరువు, మదనపల్లె ఎన్ హెచ్ పనులు తుమ్మనగుట్టలో చేస్తున్నట్లు చెప్పారు. పని జరిగేచోట టిప్పర్లోని రాళ్లు వారిమీదపడి గాయపడగా, మదనపల్లె జిల్లా అస్పత్రికి తరలించారు. వారిలోబీహారుకు చెందిన అతుల్ కుమార్ సింగ్ మృతి చెందాడన్నారు.