Chittoor

News April 5, 2025

ప్రమాదకరంగా చిత్తూరు-పుత్తూరు రోడ్డు

image

చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారి ప్రమాదకరంగా ఉంది. ఎక్కడబడితే అక్కడ గుంతలు తీసి మట్టిని రోడ్డుపై వేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రాత్రివేళల్లో ఈ మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News April 4, 2025

చిత్తూరు: 11 లోపు అభ్యంతరాలు చెప్పండి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జడ్పీ, మున్సిపాలిటీ, నగరపాలక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీ/లాంగ్వేజ్ పండిట్స్/పీఈటీల స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల సీనియార్టీ జాబితాను డీఈవో వెబ్‌సైట్‌లో పెట్టారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ లోపు తన కార్యాలయంలో తగిన ఆధారాలతో సమర్పించాలని డీఈవో వరలక్ష్మి చెప్పారు. ఆ తర్వాత అభ్యంతరాలు తీసుకోబోమని స్పష్టం చేశారు.

News April 4, 2025

చిత్తూరు జిల్లాలో రూ.150 కోట్లతో ఉపాధి పనులు

image

చిత్తూరు జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కింద రూ.150 కోట్లతో మెటీరీయల్ కాంపొనెంట్ పనులను చేపట్టనున్నామని కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. జిల్లా సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అభివృద్ధి పనుల మంజూరులో MLA, MLC అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.

News April 4, 2025

చిత్తూరు జిల్లాలో ప్రత్యేక అధికారుల నియామకం

image

వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ నిమిత్తం డివిజన్‌కు ఒక్కో అధికారిని నియమిస్తూ చిత్తూరు డీఎంహెచ్ఓ సుధారాణి ఉత్తర్వులు జారీ చేశారు. జీడీ నెల్లూరు డివిజన్‌కు డీఐఓ హనుమంతరావు, పలమనేరుకు టీబీ అధికారి వెంకటప్రసాద్, కుప్పంకు గంగాదేవి, చిత్తూరుకు అనుష, నగరికి నవీన్ తేజ్, పూతలపట్టుకు గిరి, పుంగనూరుకు అనిల్ కుమార్‌ను నియమించారు.

News April 4, 2025

Dy.CM పవన్‌కు భూమన సవాల్

image

తిరుమల లడ్డూ నాణ్యత తమ ప్రభుత్వంలోనే పెరిగిందని వైసీపీ నేత భూమన అన్నారు. ఈ అంశంపై కూటమి నేతలు తమపై కావాలనే తప్పుడు ప్ర చారాలు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో వీఐపీ దర్శనాల సంఖ్య రెట్టింపు అయ్యిందని ఆరోపించారు. మంత్రి లోకేశ్ పీఏ నుంచి అధికంగా లెటర్లు వస్తున్నాయన్నారు. వైసీసీ హయాంలో తప్పు జరిగిందో లేక కూటమి ప్రభుత్వంలో తప్పులు జరిగాయో చర్చకు తాము సిద్ధం అంటూ Dy.CM పవన్‌కు ఆయన సవాల్ విసిరారు.

News April 4, 2025

గుడిపల్లి: యువతిపై లైంగిక దాడి.. కేసు నమోదు

image

యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు గుడిపల్లె ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. రెండు రోజుల క్రితం సంతోశ్ ఓ యువతిని (18) ఆడుకుందామని నమ్మించి పొలం వైపు తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. యువతి కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News April 4, 2025

చిత్తూరు: 32 మంది కార్యదర్శులకు నోటీసులు

image

ఆస్తి పన్ను వసూళ్లలో పురోగతి చూపించని 32 మంది ఉద్యోగులకు చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ గురువారం షోకాజు నోటీసులు జారీ చేశారు. ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ 10వ స్థానంలో నిలిచింది. పన్ను వసూళ్లలో సచివాలయంలో పనిచేస్తున్న పలువురు కార్యదర్శులు 75 శాతాన్ని చేరుకోలేదంటూ రెవెన్యూ విభాగం అధికారులు కమిషనర్‌కు నివేదిక అందించారు. దీని ఆధారంగా ఆయన నోటీసులు జారీ చేశారు.

News April 4, 2025

ఏప్రిల్ 30లోపు ప్రతిపాదనలు సిద్ధం చేయండి: కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ప్లే గ్రౌండ్, ప్రహరీ గోడల నిర్మాణానికి సంబంధించి ఏప్రిల్ 30వ తేదీలోపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కుప్పంలో విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నరేగా పథకంలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో 60 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. 30లోపు ప్రతిపాదలను పంపాలని ఎంఈఓలను ఆదేశించారు.

News April 4, 2025

CMతో SRపురం వాసి భేటీ 

image

CM చంద్రబాబును గురువారం అమరావతి సెక్రటేరియట్‌లో ఎస్.ఆర్ పురం మండల టీడీపీ అధ్యక్షుడు జయశంకర్ నాయుడు మర్యాదపూర్వక కలిశారు. అనంతరం మండలంలో నెలకొన్న సమస్యలు, రాజకీయాలపై వారు చర్చించారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని CM హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.  

News April 4, 2025

అమ్మవారి సేవలో చిత్తూరు SP

image

నగరి గ్రామదేవత శ్రీ దేశమ్మ తల్లిని గురువారం చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభతో స్వాగతం పనికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.

error: Content is protected !!