India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కుప్పం నియోజకవర్గంలో 11 దేవాలయాల అభివృద్ధికి సంబంధించి 15 రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. దేవాలయాల అభివృద్ధికి సంబంధించి ఇది వరకే ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. అధికారులు త్వరగా ప్రతిపాదనలు పంపాలని ఆయన కోరారు.
తండ్రిని కుమారుడే హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో గురువారం వెలుగు చూసింది. SRపురం మండలం ఆర్ఆర్ పురానికి చెందిన శ్రీనివాసులు మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో తల్లిని కొట్టేవాడు. ఇదే విషయమై తండ్రితో కుమారుడు నాగరాజు గొడవ పడ్డాడు. ఈక్రమంలో తండ్రి తలపై గట్టిగా కొట్టడంతో ఆయన చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఈనెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఆధార్ స్పెషల్ క్యాంపులను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆరేళ్ల లోపు పిల్లలకు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూపులకు ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పెషల్ క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈనెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మరో విడత క్యాంపులు నిర్వహించనున్నారు.
చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం నుంచి టెన్త్ మూల్యాంకనం జరగనున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. 10వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతుంది. 1,244 మంది టీచర్లకు ఈ బాధ్యత అప్పగించారు. ప్రతి టీచర్ తప్పనిసరిగా మూల్యాంకన విధులకు హాజరు కావాలన్నారు. పేపర్లు కరెక్షన్ చేసే సమయంలో సెల్ఫోన్ వాడరాదని స్పష్టం చేశారు.
భాకరాపేట ఘాట్ రోడ్డులో బుధవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. కొంత మంది ప్రయాణికులతో మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సు తిరుపతికి బయల్దేరింది. ఘాట్ రోడ్డులోకి రాగానే బస్ బ్రేక్లు ఫెయిలయ్యాయి. గమనించిన డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేశారు. ఆ తర్వాత చాకచక్యంగా రోడ్డు పక్కన ఉన్న కొండను ఢీకొట్టారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణనష్టం తప్పింది.
చిత్తూరు-గుడియాత్తం అంతరాష్ట్ర రహదారి పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. సంబంధిత కాంట్రాక్టర్పై చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్లో ప్రారంభించిన ఈ రహదారి మరమ్మతు పనుల పురోగతిని R&B అధికారులతో కలిసి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. సకాలంలో పనులు చేయకపోతే కాంట్రాక్టర్ను మార్చేస్తామని హెచ్చరించారు.
12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని ఫ్యాప్టో చిత్తూరు జిల్లా ఛైర్మన్ మణిగండన్ డిమాండ్ చేశారు. డీఆర్వో మోహనకుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జీవో నెం.117ను రద్దు చేయాలని, తెలుగు మీడియాన్ని పునరుద్ధరించాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. 11వ PRC, డీఏ, సరెండర్ లీవ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్లను తక్షణం చెల్లించాలని కోరారు.
ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఖోఖో పోటీల్లో చిత్తూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు (ఫిజికల్ డైరెక్టర్లు) సురేష్ కుమార్, ముత్తు, దేవేంద్ర సత్తా చాటారు. ముగ్గురికీ కాంస్య పతకాలు దక్కాయి. ఈక్రమంలో వారిని కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. సహకారం అందించిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి బాలాజీని సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని సూచించారు.
కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో 2025-26వ సంవత్సరానికి సంబంధించి MA, M.Com, M.Scలో చేరడానికి APPGCET-2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ సూచించారు. మే 5వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. MBA/MCA కోర్సులో చేరటానికి APICET-2025 ప్రవేశ పరీక్షకు ఏప్రిల్ 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు cets.apsche.ap.gov.in చూడాలి.
పన్ను వసూళ్లలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని డీపీఓ సుధాకర్ రావు తెలిపారు. గత బకాయిలతో కలిపి మొత్తం వార్షిక లక్ష్యం రూ.24.45 కోట్లు కాగా.. అందులో రూ.21.34 కోట్లు వసూళ్లయ్యాయన్నారు. ఇందులో పన్నుల లక్ష్యం రూ.17.41 కోట్లకు గాను రూ.14.85, పన్నేతర లక్ష్యం రూ.6.84 కోట్లకు గాను రూ.6.49 కోట్లు వచ్చిందన్నారు. మొత్తం లక్ష్యంలో 87 శాతం వసూలైనట్లు ఆయన వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.