EastGodavari

News September 14, 2024

రాజమండ్రి: 80 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి

image

రాజమండ్రి పరిధి హుకుంపేటకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు బొమ్మూరు CI కాశీ విశ్వనాథం శుక్రవారం తెలిపారు. వివరాలు.. కుటుంబ కలహాల నేపథ్యంలో వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు వచ్చి బస్టాప్‌లో ఉంటుందన్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. లేవలేని స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామన్నారు.

News September 14, 2024

దివాన్‌చెరువు అటవీ ప్రాంతాల్లో చిరుత కదలికలు

image

దివాన్ చెరువు అటవీ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాలో చిరుత సంచారానికి సంబంధించిన చిత్రాలు కనిపించాయని జిల్లా అటవీశాఖ అధికారి భరణి శుక్రవారం తెలిపారు. చిరుతను ట్రాప్ బోనులో పట్టుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నామని, కచ్చితంగా దాన్ని పట్టుకుంటామన్నారు. మరోవైపు అటవీ ప్రాంత సమీపంలోని ఆటోనగర్ నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ వరకు నేషనల్ హైవేపై అప్రమత్తంగా ఉండాలని బోర్డులు ఏర్పాటుచేశామన్నారు.

News September 14, 2024

అమలాపురం: అత్యాచారయత్నం కేసులో ఏడేళ్లు జైలు శిక్ష

image

అమలాపురం మండలం సాకుర్రు గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి వీర వెంకట సత్యనారాయణకు ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారని రూరల్ సీఐ వీరబాబు శుక్రవారం తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ఈ సంఘటన జరిగిందన్నారు. అత్యాచారయత్నానికి ప్రయత్నించి అడ్డువచ్చిన అమ్మమ్మపై దాడి చేశారన్నారు.

News September 13, 2024

రంపచోడవరం: అనారోగ్యం‌తో లెక్చరర్ మృతి

image

రంపచోడవరం ఏపీ గిరిజన బాలికల గురుకుల కళాశాల ఇంగ్లీషు లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న కె.ఉషాకిరణ్(42) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. రాజమండ్రిలో నివాసం ఉంటూ కొంత కాలంగా ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారని స్నేహితులు తెలిపారు. ఆమెకు భర్త, ఇరువురు పిల్లలు ఉన్నారు. గతంలో రాజవొమ్మంగి, బుట్టాయిగూడెం గురుకుల పాఠశాలల్లో పని చేశారని ఆమె మరణం జీర్ణించకోలేక పోతున్నామని తోటి ఉద్యోగులు తెలిపారు.

News September 13, 2024

పిఠాపురం: జగన్‌ను కలిసేందుకు కాన్వాయ్ ఎక్కిన అభిమాని

image

పిఠాపురం నియోజకవర్గంలో మాజీ సీఎం YS జగన్ పర్యటన కొనసాగుతోంది. మాధవపురం గ్రామంలో బాధితులను కలిసేందుకు కాన్వాయ్ దిగారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి జగన్‌ను కలిసేందుకు కాన్వాయ్ ఎక్కాడు. అప్రమత్తమైన సిబ్బంది అతణ్ని అక్కడి నుంచి పంపించేశారు.

News September 13, 2024

తూ.గో.: నలుగురు SIలు ఏఎస్ఆర్ జిల్లాకు కేటాయింపు

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఎస్ఐలను అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేటాయిస్తూ ఏలూరు రేంజి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. తూ.గో. జిల్లాకు చెందిన టి.శివకుమార్, కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన షరీఫ్, టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన చినబాబును ఏఎస్ఆర్ జిల్లాకు కేటాయించారు.

News September 13, 2024

తూ.గో. జిల్లాతో సీతారాంకు విడదీయరాని అనుబంధం

image

కమ్యూనిస్ట్ నేత సీతారాం ఏచూరికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. గురువారం ఆయన మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా తూ.గో. జిల్లాలో విషాదం అలుముకొంది. కడియం మండలంలోని జేగురుపాడులో ఆయన తల్లిదండ్రులు ఏచూరి కల్పకం, సర్వేశ్వర సోమయాజులు చాలా ఏళ్లు ఉన్నారు. అనంతరం కాకినాడలోని రామారావు పేటలో స్థిరపడ్డారు.

News September 13, 2024

హత్యాయత్నం కేసులో 18 ఏళ్లు జైలు శిక్ష

image

కాకినాడలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ చిన్నారావుపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ముద్దాయి దుర్గాప్రసాద్ కు 18 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ కాకినాడ రెండవ అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ విజయబాబు గురువారం తీర్పు చెప్పారు. 2023 మార్చి 17వ తేదీన హత్యాయత్నానికి పాల్పడ్డా ఘటనలో అప్పట్లో కేసు నమోదు చేశారు. కేసులో నేరం రుజువు కావడంతో జడ్జ్ శిక్ష విధించారని సీఐ అప్పలనాయుడు తెలిపారు.

News September 12, 2024

అంబాజీపేట: దారికాచి దోపిడి చేస్తున్న హిజ్రాలు.. కేసు నమోదు

image

దారికాచి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు హిజ్రాలపై కేసు నమోదు చేశామని ఎస్ఐ చిరంజీవి బుధవారం తెలిపారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు చేనేత కాలనీకి చెందిన రాజేంద్రప్రసాద్ అమలాపురం నుంచి వస్తుండగా చింతాలమ్మ ఆలయం వద్ద ఇద్దరు హిజ్రాలు డబ్బుల కోసం ఆపారన్నారు. డబ్బులు లేవని చెప్పగా జేబులో నుంచి రూ.4వేలు లాక్కొని మరో వ్యక్తి సాయంతో పారిపోయారన్నారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.

News September 11, 2024

హెక్టార్‌కు రూ.25 వేలు ఇస్తాం: చంద్రబాబు

image

వరదల వల్ల నష్టపోయిన పంట పొలాలకు హెక్టార్‌కు రూ. 25 వేలు చొప్పున పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కాకినాడ జిల్లా రాజుపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరదలతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 65 వేల ఎకరాల్లో పొలాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఏలేరు రిజర్వాయర్‌కు అధికంగా వరద రావడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయని చెప్పారు.