EastGodavari

News April 4, 2025

గోపాలపురం: ఫ్యాన్‌కు ఉరేసుకొని మహిళ సూసైడ్

image

మనస్తాపానికి గురై ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గోపాలపురం మండలం నందిగూడెం గ్రామంలో కోళ్ల ఫారంలో పనిచేస్తున్న సతామి కోటల్ (30)తో సునీల్ కోటల్ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. బుధవారం వీరి మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో మనస్తాపం చెందిన ఆ మహిళ ఇంటిలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కోళ్ల ఫారం యజమాని సమాచారంతో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

News April 3, 2025

రాజమండ్రిలో పార్మసిస్ట్ కేసు దర్యాప్తు

image

లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అపార అపస్మారక స్థితిలో ఉన్న అంజలి కేసు విషయంలో దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగుతోందని డీఎస్పి భవ్య కిషోర్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కేసులో నిందితుడుని దీపక్‌ని అరెస్ట్ చేశామన్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా చేసుకుని రాజకీయ లబ్ధికి కొందరు కేసును పక్కదారి పట్టించడం తగదన్నారు.

News April 2, 2025

రాజమండ్రి: ఆందోళనకరంగా నాగాంజలి ఆరోగ్య పరిస్థితి

image

వేధింపులు తాళలేక ఆత్మయత్నానికి పాల్పడి బొల్లినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఫార్మసిస్ట్ ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అత్యవసర విభాగానికి తరలించినట్లు డా. పీవీవీ సత్యనారాయణ, డా. అనిల్ కుమార్, డా. సీ.హెచ్. సాయి నీలిమ ప్రభుత్వ వైద్య బృందం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రక్తపోటు, పల్స్, శ్వాసక్రియ, నాడీ వ్యవస్థ స్పందన తక్కువగా ఉందన్నారు.

News April 2, 2025

రాజమండ్రి: కోర్టు సంచలన తీర్పు

image

మైనర్ కుమార్తెపై అత్యాచారం కేసులో నేరం రుజువు కావడంతో న్యాయ స్థానం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షను విధించినట్లు చాగల్లు ఎస్సై కె. నరేంద్ర తెలిపారు. ఆయన వివరాల ప్రకారం..చాగల్లు మండలంలో 2020లో తన మైనర్ కుమార్తెపై ఆమె తండ్రి అత్యాచారం చేయగా గర్భం దాల్చింది. అప్పటి డీఎస్పీ రాజేశ్వరి అరెస్ట్ చేశారు. కేసులో న్యాయస్థానం తండ్రికి యావజ్జీవ శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.

News April 2, 2025

రాజమండ్రి: అమరావతి చిత్రకళా ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ

image

స్థానిక లాలా చెరువు రహదారి ప్రధాన మార్గంలో ఏప్రిల్ 4న జరిగే ‘అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన’కు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఎమ్.మల్లిఖార్జున రావులతో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన గోడ ప్రతిని కలెక్టర్ ఆవిష్కరించారు.

News April 1, 2025

నల్లజర్ల: అల్లుడిని కత్తితో నరికిన మామ, బావమరిది

image

నల్లజర్ల ప్రాంతంలో దారుణమైన హత్య జరిగింది. తన అల్లుడైన శివను మామ, బావమరిది కత్తితో నరికి హత్య చేశారు. దీంతో పేరం శివ మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు జరుగుతోంది. ఈ హత్య వెనుక గల కారణాలు, నిందితుడి ఉద్దేశం తదితర వివరాలను సేకరిస్తున్నారు.

News April 1, 2025

రాజమండ్రి: తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

image

పాస్టర్ ప్రవీణ్ మరణంపై సోషల్ మీడియాలో వివిధ రకాలుగా తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న రాజమహేంద్రవరం లలితా నగర్‌కు చెందిన దేవాబత్తుల నాగ మహేశ్‌ని త్రీటౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పూర్తిగా సమాచారం తెలియకుండా తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలను ప్రచారం చేసినా, మతపరమైన గొడవలకు ఆస్కారం కలిగే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అప్పారావు హెచ్చరించారు.

News April 1, 2025

రాజమండ్రి: తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

image

పాస్టర్ ప్రవీణ్ మరణంపై సోషల్ మీడియాలో వివిధ రకాలుగా తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న రాజమహేంద్రవరం లలితా నగర్‌కు చెందిన దేవాబత్తుల నాగ మహేశ్‌ని త్రీ టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పూర్తిగా సమాచారం తెలియకుండా తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలను ప్రచారం చేసినా, మతపరమైన గొడవలకు ఆస్కారం కలిగే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అప్పారావు హెచ్చరించారు.

News March 31, 2025

KKD: తుది జట్టు నుంచి రాజును తప్పించిన ముంబై

image

కాకినాడ యువ క్రికెటర్ సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ తన మూడో మ్యాచ్లో తుది జట్టు నుంచి తప్పించింది. తొలి రెండు మ్యాచ్‌లకు అవకాశం ఇచ్చి మూడో మ్యాచ్లో పక్కన పెట్టింది. కేకేఆర్ మ్యాచ్‌లో రాజు స్థానంలో అశ్విని కుమార్‌ను బరిలోకి దింపింది. కాగా సత్యనారాయణ రాజు రెండు మ్యాచ్ల్లో కలిపి కేవలం ఒక వికెట్ తీశారు.

News March 31, 2025

అర్ధరాత్రి కారు వీరంగం.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

రాజమండ్రి రూరల్ కొంతమూరులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బాలాజీపేటకి చెందిన ఈర్లు నాగబాబు (44) ర్యాపిడో బైక్ టాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అర్ధరాత్రి బైక్ రైడ్‌లో ఉండగా మనీష్ ఫంక్షన్ హాల్ వద్ద మద్యం మత్తులో కారులో నలుగురు వేగంగా వచ్చి బైక్‌ని ఢీకొట్టారు. దీంతో నాగబాబుతో పాటు వెనక కూర్చున్న కస్టమర్ వీరబాబు(28) అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.