EastGodavari

News September 6, 2024

వరద బాధితులకు MLA బత్తుల రూ.25 లక్షల విరాళం

image

విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. కృష్ణా జిల్లాలో వచ్చిన వరదల కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వరద బాధితులను అన్ని విధాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి సీఎం పవన్ కళ్యాణ్ ఆదుకుంటారని పేర్కొన్నారు.

News September 6, 2024

పిఠాపురంలో జిల్లా కోర్టు నూతన భవనం ప్రారంభం

image

పిఠాపురంలో జిల్లా కోర్టు నూతన భవనాన్ని ప్రారంభించారు. వర్చువల్ విధానంలో హైకోర్టు నుంచి ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ శిలాఫలకం ఆవిష్కరించారు. కోర్టు సమూహాన్ని జిల్లా జడ్జి గంధం సునీత ప్రారంభించారు. సర్వమత గురువులతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కోర్టు హాల్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

News September 5, 2024

కోనసీమ: టాటా‌ఏస్ ఢీకొని రెండేళ్ల బాలుడి మృతి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం తాడిపూడిలో టాటా‌ఏస్ వాహనం ఢీకొని రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఇర్లపాటి నరేష్ టెంట్ హౌస్ వ్యాపారం చేస్తాడు. గురువారం అతడి వద్ద పనిచేసే గూడపాటి బాబి ఇంటి వద్ద ఉన్న సామగ్రి తీసుకువెళ్లడానికి టాటా‌ఏస్‌పై వచ్చాడు. అక్కడ ఆడుకుంటున్న నరేష్ కుమారుడు లాస్విక్(2)ను గమనించకుండా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. SI శ్రీనివాస్ కేసు నమోదు చేశారు.

News September 5, 2024

వరద బాధితులకు అండగా రాజమండ్రి జైలు ఖైదీలు

image

వరదల కారణంగా బెజవాడ అతలాకుతలం కాగా.. అండగా మేమున్నామంటూ పలువురు ముందుకొస్తున్నారు. ఆహారం, విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు సైతం వారి వంతుగా సాయం చేశారు. దాదాపు 25,000 మంది వరద బాధితులకు సరిపడా ఆహారపు పొట్లాలను జైలు పర్యవేక్షణ అధికారి రాహుల్ ఆధ్వర్యంలో గురువారం తయారు చేశారు. వాటిని 2 ప్రత్యేక వాహనాలలో విజయవాడకు పంపించినట్లు రాహుల్ తెలిపారు.

News September 5, 2024

రూ.2 లక్షల విరాళమిచ్చిన అమలాపురం క్రీడాకారుడు

image

అమలాపురానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ కుటుంబ సభ్యులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం రూ.2 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు విరాళం సొమ్మును సాత్విక్ రాజ్ తల్లిదండ్రులు రంగమణి, కాశీ విశ్వనాథ్ అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద కలెక్టర్ మహేష్ కుమార్‌కు అందజేశారు. కలెక్టర్ వారిని అభినందించారు.

News September 5, 2024

భార్యను హత్య చేసిన భర్తకు యావజ్జీవ శిక్ష: సీఐ

image

భార్యను హత్య చేసిన కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. రూరల్ సీఐ దొరరాజు కథనం ప్రకారం.. ఏడిద గ్రామానికి చెందిన పైడిమళ్ల సుదర్శనరావుకు కపిలేశ్వరపురం మండలం కాలేరుకి చెందిన సుజాతతో వివాహం జరిగింది. సుదర్శనరావు వివాహేతర సంబంధం కలిగి ఉండటాన్ని ఆమె ప్రశ్నించింది. దీంతో 2015 ఏప్రియల్‌లో భార్యను కొట్టి హత్య చేశాడని నేరం రుజువు కావడంతో రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్ట్ శిక్ష విధించిందని తెలిపారు.

News September 5, 2024

ధవళేశ్వరంలో 10.90 అడుగులకు చేరిన నీటిమట్టం

image

గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతోంది. గురువారం ఉదయం 8 గంటలకు 10.90 అడుగులకు నీటిమట్టం చేరింది. 8,60,994 క్యూసెక్కుల వరద నీటిని కిందికి విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద ఉదయం 8.గంటలకు గోదావరి నీటిమట్టం 44.20 అడుగులకు చేరిందని క్రమంగా పెరుగుతోందని ఇరిగేషన్ అధికారులు దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

News September 5, 2024

హైదరాబాద్‌లో తూగో జిల్లాకు చెందిన మహిళ దుర్మరణం

image

రాయవరం మండలం వెదురుపాకకు చెందిన నాగవల్లి (24) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతి చెందింది. బోరబండ పోలీసులు ప్రకారం.. విజయభాస్కర్, నాగవల్లి దంపతులు సనత్‌‌‌‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. స్వగ్రామానికి వెళ్లి బుధవారం ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వద్ద బస్సు దిగారు. ఆటో కోసం ఎదురు చూస్తుండగా కారు వేగంగా వచ్చి దంపతులను ఢీకొట్టింది. ప్రమాదంలో నాగవల్లి అక్కడిక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేశారు.

News September 5, 2024

RCPM: గోరుపై రాధాకృష్ణన్ చిత్రం గీసిన కళాకారుడు

image

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని నరసాపురపుపేట ఉపాధ్యాయులు రాయుడు త్రినాథ్ ప్రసాద్ తన చేతి బొటనవేలు గోరుపై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రాన్ని తన కళానైపుణ్యంతో వేసి పలువురిని అబ్బురపరిచారు. ఆయనపై ఉన్న అభిమానంతో ఈ చిత్రలేఖనం వేశానని ఉపాధ్యాయుడు త్రినాథ్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిని పలువురు అభినందించారు.

News September 4, 2024

కాకినాడ: సురక్షితంగా తీరానికి చేరిన మత్స్యకారులు

image

తుఫాను కారణంగా బంగాళాఖాతం సముద్రంలో చిక్కుకున్న చెన్నై ఫిషింగ్ బోట్‌తో పాటు అందులోని 10 మంది మత్స్యకారులను భారత తీర రక్షక దళం బుధవారం రక్షించింది. ఆగస్టు 23న బయలుదేరిన మత్స్యకారులు సాంకేతిక కారణంతో తుఫానులో చిక్కుకున్నారు. సముద్ర తీరం నుంచి 100 నాటికన్ మైళ్ల వద్ద గుర్తించారు. రాష్ట్ర మారిటైమ్ బోర్డు అధికారులు పంపిన టగ్ ద్వారా కాకినాడ కస్టమ్స్ జెట్టీకి సురక్షితంగా తీసుకువచ్చినట్లు తెలిపారు.