EastGodavari

News September 3, 2024

రాజమండ్రి: సముద్రంలోకి 3.40 లక్షల క్యూసెక్కుల జలాలు

image

రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం 3.40 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవకు 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 8.60 అడుగులు నీటిమట్టం కొనసాగుతుందని చెప్పారు.

News September 3, 2024

ఆపత్కాలం.. సాయం చేయండి: కాకినాడ కలెక్టర్

image

నిరాశ్రయులైన వరద బాధితులకు సహాయం అందించాలని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ కోరారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వర్షాలు, వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. స్వచ్ఛందంగా సహాయం చేయదలచిన వారు కాకినాడ కలెక్టర్ కార్యాలయం, జిల్లా రెవెన్యూ అధికారికి నగదు రూపంలో కానీ, చెక్కు రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ సహాయం అందజేయవచ్చునని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

News September 3, 2024

ప్రభావిత ప్రాంతాలను గుర్తించండి: కోనసీమ కలెక్టర్

image

విపత్తుల సమయంలో ప్రభావితమయ్యే ప్రాంతాలను గుర్తిస్తూ మండలాల వారీగా మ్యాపులను తయారు చేయాలని అధికారులను అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అమలాపురంలోని కలెక్టరేట్‌లో జలవనరుల శాఖ, విద్యుత్ అధికారుల తో వరదలు తుఫానులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్ .మహేష్ కుమార్ మాట్లాడుతూ.. సిబ్బందికి వరదలు, తుఫానులపై తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.

News September 2, 2024

కాకినాడ: భారీ వరదలు.. 31 రైళ్ల రద్దు

image

భారీ వర్షాలు.. వరదల కారణంగా రైల్వే శాఖ 31 రైళ్లను రద్దు చేసి, మరో 13 రైళ్ల రూట్ మార్చినట్లు సామర్లకోట రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైళ్ల రద్దు విషయాన్ని ప్రయాణికులు గమనించి, తమ తమ ప్రయాణాల ప్రణాళికలను మార్చుకోవాల్సిందిగా కోరారు. పూర్తి వివరాల కోసం సామర్లకోట రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌లో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.

News September 2, 2024

రౌతులపూడిలో 15 మందికి డయేరియా

image

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని శృంగవరంలో డయేరియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే 15 మంది రోగులు అతిసారం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాగునీరు కలుషితం కావడం వల్లే అతిసారం ప్రబలినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంటింటికి సర్వే చేపట్టి, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

News September 2, 2024

తూ.గో.: సముద్రంలోకి 4,82,213 క్యూసెక్కుల జలాలు

image

గోదావరి జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఆదివారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి డెల్టా కాలువలకు నీటి విడుదలను తగ్గించారు. ఆదివారం సాయంత్రం డెల్టా కాలువలకు మొత్తం 3,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజీ నుంచి 4,82,213 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలినట్టు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

News September 2, 2024

4న బెంగళూరు- కాకినాడ టౌన్ రైలు రద్దు

image

ఎస్ఎం వీటీ బెంగళూరు- కాకినాడ టౌన్ రైలు (నం.17209)ను ఈ నెల 4వన రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రైలు రద్దుచేశామన్నారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.

News September 1, 2024

భారీ వర్షాలు.. ఉమ్మడి తూ.గో కంట్రోల్ రూం నంబర్లు ఇవే

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కింది జాగ్రత్తలు పాటిద్దాం.
☞ శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు, స్తంభాల వద్ద ఉండొద్దు.
☞ వర్షం పడేటప్పుడు చెట్ల కిందికి వెళ్లకండి.
☞ నదులు, కాలువలు, మ్యాన్‌హోళ్ల వద్ద జాగ్రత్త.
☞ రోడ్డుపై నీరుంటే జాగ్రత్తగా వెళ్లండి.
➠ కంట్రోల్ రూం నంబర్లు: 8977935609(తూ.గో), 08856-293104(కోనసీమ), 18004253077(కాకినాడ).

News September 1, 2024

కూలర్ రిపేర్ చేస్తుండగా షాక్.. వ్యక్తి మృతి

image

రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలంలోని పల్లూరులో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. ఆవుల రామారావు రిపేర్‌కు వచ్చిన ఓ కూలర్ మరమ్మతులు చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడని గ్రామస్థులు తెలిపారు. ఆపస్మారక స్థితికి చేరుకొన్న అతడిని కోతులగుట్టలోని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మరణించాడు. రామారావుకు ఇంకా వివాహం కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 1, 2024

రేపు తూ.గో. జిల్లాలో విద్యాసంస్థలు బంద్

image

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు రేపు (సోమవారం) సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి ఆమె ఆదివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు.