EastGodavari

News December 27, 2025

29న యథావిధిగా ‘పీజీఆర్‌ఎస్’: కలెక్టర్

image

డిసెంబర్ 29న కలెక్టరేట్ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వరకు ‘ప్రజా గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్’ (PGRS) కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అర్జీదారులు నేరుగా లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ వినతులను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను స్వీకరించి, వాటికి తక్షణ పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News December 27, 2025

ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అమర్జహ బేగ్ బాధ్యతలు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొవ్వూరు మండలం కాపవరానికి చెందిన అమర్జహ బేగ్ నియమితులయ్యారు. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా చేతుల మీదుగా ఆమె నియామక పత్రాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్న అమర్జహ బేగ్ నియామకం పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

News December 27, 2025

తూ.గో: యువత రీల్స్ పిచ్చి.. మృత్యువుకు ఆహ్వానం!

image

గోపాలపురం జాతీయ రహదారి16 మృత్యుదారిగా మారుతోంది. గుండుగొలను-కొవ్వూరు మధ్య సోషల్ మీడియా పిచ్చితో యువత చేస్తున్న విన్యాసాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి అపసవ్య దిశలో, అతివేగంతో ప్రయాణిస్తూ యువకులు దుర్మరణం చెందుతున్నారు. కాగా, ఈరోజు ఇదేరోడ్డుపై ముగ్గురు మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News December 27, 2025

నిడదవోలు: అంగన్‌వాడీలకు స్మార్ట్ ఫోన్లు

image

నిడదవోలు నియోజకవర్గ అంగన్‌వాడీ టీచర్లకు మంత్రి కందుల దుర్గేశ్ శనివారం స్మార్ట్ ఫోన్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందజేశారు. అంగన్‌వాడీ సేవలు మరింత పారదర్శకంగా ఉండటానికి ఈ ఫోన్లు దోహదపడతాయన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అందించే ఆరోగ్య సేవలు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో సేవల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు.

News December 27, 2025

గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించండి: డీఈఓ

image

ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని డీఈఓ కంది వాసుదేవరావు శనివారం తల్లిదండ్రులకు సూచించారు. కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రాథమిక తరగతులకు మాత్రమే గుర్తింపు ఉండి, ఉన్నత తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. గుర్తింపు లేని తరగతుల్లో చదివితే పైచదువులకు అవకాశం ఉండదని హెచ్చరించారు. విద్యాసంస్థల గుర్తింపును పరిశీలించిన తర్వాతే ప్రవేశాలు కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

News December 27, 2025

రాజమండ్రి: 73 ఏళ్ల వయసు.. @ 73 డిగ్రీలు

image

ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కర్రి రామారెడ్డి 73 ఏళ్ల వయసులో 73 డిగ్రీలు సాధించి అరుదైన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో సుహృన్మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనకు ‘విద్యాభూషణ’ బిరుదుతో సత్కారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రామారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, నిరంతర విద్యార్థిగా ఆయన యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

News December 27, 2025

రాజమండ్రి: 73 ఏళ్ల వయసు.. @ 73 డిగ్రీలు

image

ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కర్రి రామారెడ్డి 73 ఏళ్ల వయసులో 73 డిగ్రీలు సాధించి అరుదైన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో సుహృన్మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనకు ‘విద్యాభూషణ’ బిరుదుతో సత్కారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రామారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, నిరంతర విద్యార్థిగా ఆయన యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

News December 27, 2025

రాజమండ్రి: 73 ఏళ్ల వయసు.. @ 73 డిగ్రీలు

image

ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కర్రి రామారెడ్డి 73 ఏళ్ల వయసులో 73 డిగ్రీలు సాధించి అరుదైన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో సుహృన్మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనకు ‘విద్యాభూషణ’ బిరుదుతో సత్కారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రామారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, నిరంతర విద్యార్థిగా ఆయన యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

News December 27, 2025

రాజమండ్రి: 73 ఏళ్ల వయసు.. @ 73 డిగ్రీలు

image

ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కర్రి రామారెడ్డి 73 ఏళ్ల వయసులో 73 డిగ్రీలు సాధించి అరుదైన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో సుహృన్మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనకు ‘విద్యాభూషణ’ బిరుదుతో సత్కారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రామారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, నిరంతర విద్యార్థిగా ఆయన యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

News December 26, 2025

పింఛన్ లబ్ధిదారులకు కలెక్టర్ గుడ్ న్యూస్!

image

నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31నే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఒకరోజు ముందుగానే నగదు పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, నిర్దేశించిన సమయానికి పింఛన్ అందజేయాలని స్పష్టం చేశారు.