EastGodavari

News January 30, 2025

పెద్దాపురం: బాలికతో వ్యభిచారం.. వెలుగులోకి కీలక విషయాలు

image

పెద్దాపురానికి చెందిన యువకుడు బాలికను పెళ్లి చేసుకుని వ్యభిచారంలోకి దింపిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి పెద్దాపురం డీఎస్పీ కీలక విషయాలు వెల్లడించారు. ‘యువకుడు తల్లితో కలిసి బాలికను చిత్రహింసలకు గురిచేసి వ్యభిచారంలోకి దింపారు. ఆమెకు
ఇన్‌ఫెక్షన్ రావడంతో రకరకాల మందులు వేశారు. బాధలతో బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అప్పటికే బాలిక కదల్లేని స్థితికి చేరుకుంది’ అని తెలిపారు.

News January 30, 2025

రాజానగరం: హైవేపై రెండు లారీలు ఢీ

image

రాజానగరం హైవేపై బుధవారం రాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వైజాగ్ నుంచి పైపులు రోడ్డుతో వస్తున్న లారీ అతివేగంగా రావడంతో నియంత్రణ కోల్పోయి రాజమండ్రి నుంచి కాకినాడ వైపు వెళ్తున్న బోగ్గుల లోడు లారీని ఢీకొంది. డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీనితో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు రెండు భారీ క్రేన్‌లతో లారీలను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 30, 2025

నేడు కొవ్వూరు డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా

image

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. 30వ తేదీ కొవ్వూరు పట్టణ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, డిగ్రీ కాలేజ్ సంయుక్తంగా నిర్వహించే మినీ జాబ్ మేళా కరపత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. జాబ్ మేళా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని యువత వినియోగించుకోవాలన్నారు.

News January 29, 2025

రాజమండ్రి: ఫిబ్రవరి 1 ముఖ్యమంత్రి పర్యటన రద్దు

image

ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా లకి చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో జిల్లాలో ఫిబ్రవరి 1 వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన అన్నమయ్య జిల్లాకు మార్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి బుధవారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. పూర్వపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తక్షణం ఎన్నికల నియామవళి అమలులోకి వచ్చిందని ఆమె తెలిపారు. అధికారులు గమనించాలన్నారు.

News January 29, 2025

తాళ్లపూడిలో శతాధిక వృద్ధురాలు మృతి

image

తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ నాయనమ్మ జల్లేపల్లి అచ్చయ్యమ్మ (107) మంగళవారం వయస్సు భారంతో రాత్రి మరణించారు. మృతురాలికు ఐదుగురు కుమారులు నలుగురు కూతుళ్లు కలిపి 150 మంది సభ్యుల కుటుంబానికి ఆమె పెద్దదిక్కుగా ఉన్నారు. గ్రామస్థులందరూ ప్రేమతో అమ్మమ్మగా పిలుచుకునే ఆవిడ మృతికి మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, గ్రామస్థులు సంతాపం తెలియజేశారు. 

News January 29, 2025

కొవ్వూరు: బాలిక కిడ్నాప్.. ఆపై లైంగిక వేధింపులు

image

బాలికను పెళ్లి చేసుకుంటానని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన డి. కిరణ్ కుమార్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు ఎస్సై కే. శ్రీహరిరావు తెలిపారు. కడియానికి చెందిన ఫ్యామిలీ సంక్రాంతికి కొవ్వూరుకు వచ్చారు. సొంతూరు వెళ్లే క్రమంలో 14 ఏళ్ల బాలిక మిస్సైంది. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఆచూకీ కనుగొనగా.. ఆమె తెలిపిన వివరాలతో యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News January 28, 2025

గంగవరం: రైతుని గాయపరిచిన అడవి పంది

image

గంగవరం మండలం దొనేపల్లి గ్రామంలో పొలంలోకి వెళ్లిన బి.విష్ణు దొర, అనే వ్యక్తిని పిల్లలు కలిగిన అడవి పంది తీవ్రంగా గాయపరిచింది.  108 అంబులెన్సు సిబ్బంది ఈఎంటి కిషోర్ పైలట్ త్రిమూర్తులు హుటాహుటిన క్షతగాత్రుడిని దగ్గరలోని గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. 

News January 28, 2025

రాజమండ్రి: మహిళ నుంచి రూ.2.5కోట్లు దోపిడీ.. నిందితుల అరెస్ట్

image

CBI అంటూ మహిళ నుంచి రూ.2.5కోట్లు దోచుకున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు తిరుపతి SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. రూ.200 కోట్ల మనీలాండరింగ్ జరిగిందని భయపెట్టి ఆమె నుంచి రూ.2.5 కోట్ల దోచుకున్నారు. రాజమండ్రికి చెందిన పాలకొల్లు అరుణ్ వినయ్ కుమార్‌ను అరెస్ట్ చేసి రూ.24.5 లక్షల నగదు, కారు, రెండు ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అతని అకౌంట్లులోని బాధిత మహిళ రూ.26 లక్షలు ఫ్రీజ్ చేశారు.

News January 28, 2025

రంగంపేట: స్మశానవాటికలో స్కూల్ నిర్మాణంపై ఫిర్యాదు

image

రంగంపేట రెవెన్యూ కార్యాయంలో అధికారులు సోమవారం పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. పాతకోటపాడులోని సర్వే నంబర్ 44లో 2.71ఎకరాలను పలు సామాజిక వర్గాలు శ్మశానంగా వినియోగిస్తున్నాయి. అదే స్థలాన్ని హైస్కూల్ నిర్మాణానికి కేటాయించడంపై సహించేది లేదని తహశీల్దార్ కోను అనసూయకు ఇండియన్ యాక్ట్స్ ఆవెర్నెస్ వలంటరీ ఆర్గనైజేషన్ రాష్ట్ర ఛైర్మన్ కుందేటి వెంకట రమణ వినతి పత్రాన్ని సమర్పించారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు.

News January 28, 2025

రాజమండ్రి: మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య

image

హుకుంపేట డీబ్లాక్ చెందిన నేదునూరి సంతోష్‌కుమార్‌(25) కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంగా మద్యానికి బానిసై మనస్థాపం చెందడంతో సోమవారం మధ్యాహ్నం ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య లీలాకుమారి ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌ ఎస్సై ఆర్‌ అంకారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.