India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం యథాతథంగా PGRS నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీదారులు తమ వినతి పత్రాలను ముందుగానే ఆన్లైన్లో Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిల్లి ఆనంద్ (30)ను కత్తితో నరికి దారుణంగా హత్య చేశారు. వరుసకు బంధువు అయిన ములకల్లంకకు చెందిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడి పరారైనట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

వారాంతం కావడంతో మాంసాహార దుకాణాలు వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. రాజమండ్రి మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ. 250, స్కిన్తో రూ. 230గా ఉంది. లైవ్ కోడి ధర రూ.140 నుంచి రూ.150 వరకు లభిస్తోంది. ఇక, కేజీ మటన్ ధర రూ. 900కు విక్రయిస్తున్నారు. ప్రాంతాలవారీగా ధరలలో స్వల్ప తేడాలున్నాయి. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

విద్యుత్ బిల్లులు వసూళ్ల కౌంటర్లు ఆదివారం కూడా పని చేస్తాయని APEPDCL సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.తిలక్ కుమార్ తెలిపారు. రెవెన్యూ కార్యాలయాలతో పాటు APEPDCL సెక్షన్ ఆఫీస్ కలెక్షన్ కౌంటర్లు, A.T.P సెంటర్లలో కూడా బిల్లులు ఆదివారం చెల్లించవచ్చని తెలిపారు. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.

జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామ మూర్తి శనివారం రాజమండ్రిలో ఈవీఎంల గోడౌన్ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర,రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు చేపట్టే సాధారణ తనిఖీల్లో భాగంగా ఉదయం స్ట్రాంగ్ రూమ్ గోడౌన్ను సందర్శించినట్లు చెప్పారు. వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేసి, సంబంధిత రిజిస్టర్లలో సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్ల్లో కెమెరాల పర్యవేక్షణ ఉందన్నారు.

రాజమండ్రిలోని ఎస్.కె.వి.టి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శని, ఆదివారాల్లో నిర్వహించనున్న గోదావరి బాలోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు మంత్రి, గోదావరి బాలోత్సవం ఛైర్మన్ దుర్గేశ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, కలెక్టర్ కీర్తి చేకూరి, డీఈఓ కె. వాసుదేవరావు అతిథులుగా పాల్గొంటారు. జిల్లాలోని 145 పాఠశాలల నుంచి 8 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

పీఎంఏవై గ్రామీణ 2.0 పథకం కింద ఇళ్లు లేని పేదల గుర్తింపు గడువు నవంబర్ 30 వరకు ఉండటంతో, జిల్లాలో 16,335 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. గృహనిర్మాణ శాఖ సిబ్బంది ద్వారా ‘ఆవాస్ ప్లస్’ యాప్లో సర్వే పూర్తి చేసినట్లు ఆమె ప్రకటించారు. అర్హత కలిగి, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

రాజానగరం మండలంలోని జి. ఎర్రంపాలెంలో ఈ ఖరీఫ్ సీజన్లో వరి పండించిన రైతులతో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ శుక్రవారం స్వయంగా మాట్లాడారు. పంట దిగుబడి వివరాలను తెలుసుకున్న ఆయన.. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా అని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లకు తోలిన ధాన్యానికి సంబంధించిన నగదు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతుందా లేదా అని ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, సమయపాలన కచ్చితంగా పాటించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. శుక్రవారం ఆయన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి, రోజువారీ హాజరుపై ఆరా తీశారు. పేదలకు అందించే భోజనం ఎల్లప్పుడూ నాణ్యతగా ఉండేలా చూస్తూ, మెనూను తప్పకుండా పాటించాలని ఆయన ఆదేశించారు.

జిల్లాల పునర్విభజనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా స్వరూపం మరోసారి మారనుంది. మండపేట నియోజకవర్గం అదనంగా చేరడంతో జిల్లాలో మండలాల సంఖ్య 21కి, నియోజకవర్గాల సంఖ్య ఏడు నుంచి ఎనిమిదికి పెరిగాయి. నవంబర్ 11 నాటికి జిల్లా ఓటర్ల సంఖ్య 16,23,528 ఉండగా, మండపేట నియోజకవర్గం చేరికతో మొత్తం ఓటర్ల సంఖ్య 18,37,852 కు పెరిగింది.
Sorry, no posts matched your criteria.