EastGodavari

News July 24, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాలో పల్లెల అభివృద్ధికి బాసట

image

కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.. మౌలిక సదుపాయాలకు రూ.11.11 లక్షల కోట్లు కేటాయించడం హర్షనీయం. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 385 వంతున, తూ.గో జిల్లాలో 300 పంచాయతీలు ఉన్నాయి. సంపద సృష్టి కేంద్రాలను సమర్థంగా వినియోగించాలి. పల్లెల్లోని పీఆర్, ఆ&బీ రహదారులకు మోక్షం దక్కాలి. రూ.1,203 కోట్లతో చేపట్టిన జలజీవన్ మిషన్, రూ.1,650 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాలు చేపట్టాలి.

News July 24, 2024

తూ.గో: ముద్ర రుణం.. యువతకు ప్రయోజనం

image

ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు ద్వారా ఎంతో మంది యువకులకు ఉపాధి లభిస్తుంది. ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,40,257 మందికి రూ.1,650.60 కోట్లు అందించారు. కాకినాడ జిల్లాలో 17,166 మందికి రూ. 282.51 కోట్లు.. కోనసీమ జిల్లాలో 24,371 మందికి రూ.229.84 కోట్లు రుణాలు ఇచ్చారు. ఇకపై రూ.20 లక్షలు వరకు రుణం ఇస్తారు.

News July 24, 2024

పోలవరానికి నిధులు.. చిగురించిన ఆశలు

image

పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఉభయ గోదావరి జిల్లా వాసులకు ఊరట కలిగించింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం కాకినాడ, తూ.గో, కోనసీమ, అనకాపల్లి, విశాఖ జిల్లాల వరకు పూర్తి చేయాల్సి ఉంది. దీనివల్ల సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. ఎడమ కాలువను రూ 4,202.69 కోట్లతో నిర్మించవలసి ఉంది. ఇంతవరకు 72.99 శాతం పనులయ్యాయి.

News July 24, 2024

తూ.గో: వ్యవసాయ రంగానికి బహుళ ప్రయోజనం

image

బడ్జెట్‌తో ఉమ్మడి తూ.గో జిల్లాలో 4.12 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో ఉన్నాయి. విపత్తులు, వరదలతో రైతులు ఏటా నష్టపోతున్నారు. ప్రత్యేక కేటాయింపులు, విపత్తులను తట్టుకునే వంగడాల రూపకల్పన దిశగా ఊతమిస్తుందని ఆశిస్తున్నారు. పీఎం కిసాన్ ద్వారా తూ.గో జిల్లాలో 1.34లక్షల మందికి రూ.435.45 కోట్లు, కాకినాడ జిల్లాలో 1.57లక్షల మందికి రూ.186 కోట్లు, కోనసీమలో 1.49 లక్షల మందికి రూ.112 కోట్లు జమ చేశారు.

News July 24, 2024

ఉమ్మడి తూ.గో.లో పారిశ్రామిక రంగానికి ఊతం

image

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్‌తో ఉమ్మడి తూ.గో జిల్లాకు ప్రయోజనం చేకూరనుంది. బడ్జెట్‌పై పారిశ్రామిక రంగం ఉత్సాహంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో 172 కర్మాగారాలు.. సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ, మెగా పరిశ్రమలు 8,861 ఉన్నాయి. కార్మికులు, ఉద్యోగులు 1.20 లక్షల మంది ఉన్నారు. పారిశ్రామిక పార్కుల్లో కాకినాడ, రాజమహేంద్రవరానికి చోటు దక్కితే కార్మికుల వసతి సమస్యకు పరిష్కారం దొరకనుంది.

News July 24, 2024

తూ.గో: కేంద్ర బడ్జెట్.. వేతన జీవులకు ఊరట

image

కేంద్ర బడ్జెట్‌తో వేతన జీవులకు ఊరట లభించింది. కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు పన్ను ఉండదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5శాతం, రూ.7 నుంచి రూ.10 లక్షల వరకు 10%, రూ.10-12 లక్షల వరకు 15శాతం, 12-15 లక్షల వరకు 20శాతం, ఆ పైన 30% పన్ను ప్రకటించారు. ఉమ్మడి తూ.గో జిల్లాలో కేంద్ర ఉద్యోగులు 5వేలు, రాష్ట్ర ఉద్యోగులు 65వేల మంది, పింఛన్ పొందే వారు 39వేల మంది ఉన్నారు. వీరిలో పలువురికి మేలు జరగనుంది.

News July 24, 2024

ఆగస్టు 4లోగా ఫీజు చెల్లించాలి: జయశ్రీ

image

వచ్చేనెల 4వ తేదీలోగా డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ 2018–20 బ్యాచ్‌లో మేనేజ్‌మెంట్‌, స్పాట్‌ అడ్మిషన్లలో మొదటి సంవత్సరం ఒకసారి ఫెయిలైన అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని తూ.గో జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపల్‌ జయశ్రీ తెలిపారు. పరీక్ష ఫీజును సంబంధిత ప్రభుత్వ, ప్రైవేటు డీఈఎల్‌ఈడీ కళాశాలల ప్రిన్సిపల్స్‌కు చెల్లించాలన్నారు. వివరాలకు సంబంధిత ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలన్నారు.

News July 24, 2024

తూ.గో: వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్

image

తూ.గో జిల్లా నిడదవోలులోని తీరుగూడెంలో వ్యభిచార ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఇంటిపై దాడి చేసినట్లు ఎస్ఐ పులపా అప్పారావు తెలిపారు. నిర్వాహకుడు నాగేశ్వరరావుతో పాటు ఆంజనేయపురానికి చెందిన ఓ విటుడు, రాజమహేంద్రవరానికి చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News July 24, 2024

కేంద్ర బడ్జెట్ ఆశాజనకం: ఎంపీ ఉదయ్

image

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు ఆశాజనకంగా ఉందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించడం, పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తికి నిధులు కల్పించడం సంతోషకరమన్నారు.

News July 23, 2024

కాకినాడ JNTU రిజిస్ట్రార్‌పై CID విచారణ చేయాలి: హైకోర్ట్

image

అర్హత లేని 48 ఇంజినీరింగ్ కళాశాలలకు అటానమస్ హోదా కల్పించడంపై కాకినాడ JNTU రిజిస్ట్రార్‌పై CID విచారణ జరపాలని హైకోర్ట్ ఆదేశించింది. ఈ మేరకు కేసు నమోదుచేసి ఈ నెల 26న FIR తమ ముందు ఉంచాలని ఉత్తర్వులు ఇచ్చింది. కేసుపై దర్యాప్తు చేసి ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేయాలని చెప్పింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టగా.. ఇప్పటికే రిజిస్ట్రార్‌కు నోటీసులు ఇచ్చినా రాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.