EastGodavari

News February 1, 2026

రాజమండ్రి కార్పొరేషన్‌కు జాతీయ అవార్డు

image

రాజమండ్రి నగరపాలక సంస్థకు జాతీయస్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. అకౌంటింగ్ సంస్కరణల ప్రమోషన్‌లో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాజమండ్రికి ఈ అవార్డు దక్కింది. గ్రేటర్ నోయిడాలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి. రామలింగేశ్వర ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సమిష్టి కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

News February 1, 2026

సీతానగరం: ‘త్వరలోనే పులిని బంధిస్తాం’

image

సీతానగరం మండలం తొర్రేడులో పులి సంచరిస్తుండటంతో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీ శాఖ అధికారి ప్రభాకర్ రావు ఆదివారం సూచించారు. పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని, ఎవరూ ఒంటరిగా బయటకు వెళ్లరాదని కోరారు. పులిని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని, త్వరలోనే బంధిస్తామని ధైర్యం చెప్పారు. పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

News February 1, 2026

మహిళలకు ఆదాయ మార్గాలు కల్పించడమే లక్ష్యం: కలెక్టర్

image

గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయం కల్పించడమే లక్ష్యంగా పర్యావరణహిత పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లతో పాటు మార్కెటింగ్ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల స్వయం సహాయక సంఘాల మహిళలు సీడీఐపీసీ జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మహిళా సాధికారతకు జిల్లా యంత్రాంగం మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు.

News February 1, 2026

రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

image

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ఆదివారం పలు పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మళ్లీ నేరాలకు పాల్పడితే ఉపేక్షించబోమని, కఠినమైన పీడీ యాక్ట్ అమలు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. గంజాయి విక్రయాలు, సేవనంపై ఉక్కుపాదం మోపుతామన్నారు. నేర రహిత జిల్లా కోసం పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

News February 1, 2026

తొర్రేడు ప్రజలకు అటవీ అధికారుల హెచ్చరికలు

image

రాజమండ్రి రూరల్ పరిధిలోని తొరేడు గ్రామస్థులను అటవీశాఖ అధికారులు ఆదివారం హెచ్చరించారు. శనివారం తెల్లవారుజామున అడవి జంతువుల దాడిలో మూడు పశువులు మృతి చెందినట్లు జిల్లా అటవీ అధికారి ప్రభాకరరావు తెలిపారు. రాత్రి సమయాల్లో ప్రజలెవరూ ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు. పశువులను కోల్పోయిన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని వెల్లడించారు. అధికారులు అప్రమత్తంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

News February 1, 2026

గ్రూప్-1లో ముప్పవరం కెరటం.. రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్!

image

నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామానికి చెందిన మారుతి సుధా శ్రీ రమణి ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్(ACST)గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగదేవి, నాగిరెడ్డి సత్తిపండు, గ్రామ నాయకులు ఆమెను సత్కరించారు. ప్రతిభతో గ్రామానికి కీర్తి తెచ్చిన రమణిని గ్రామస్థులు అభినందనలతో ముంచెత్తారు.

News February 1, 2026

క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు: మంత్రి కందుల

image

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి కందుల దుర్గేశ్ శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జోలికొస్తే సహించేది లేదని, తాట తీస్తామని హెచ్చరించారు. అంబటి ఒక ఆంబోతులా ప్రవర్తిస్తూ నీచమైన మాటలు మాట్లాడుతున్నారని, ఇలాగే కొనసాగితే ప్రజలే బుద్ధి చెబుతారని మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మానుకోవాలని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో హితవు పలికారు.

News February 1, 2026

క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు: మంత్రి కందుల

image

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి కందుల దుర్గేశ్ శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జోలికొస్తే సహించేది లేదని, తాట తీస్తామని హెచ్చరించారు. అంబటి ఒక ఆంబోతులా ప్రవర్తిస్తూ నీచమైన మాటలు మాట్లాడుతున్నారని, ఇలాగే కొనసాగితే ప్రజలే బుద్ధి చెబుతారని మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మానుకోవాలని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో హితవు పలికారు.

News February 1, 2026

క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు: మంత్రి కందుల

image

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి కందుల దుర్గేశ్ శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జోలికొస్తే సహించేది లేదని, తాట తీస్తామని హెచ్చరించారు. అంబటి ఒక ఆంబోతులా ప్రవర్తిస్తూ నీచమైన మాటలు మాట్లాడుతున్నారని, ఇలాగే కొనసాగితే ప్రజలే బుద్ధి చెబుతారని మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మానుకోవాలని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో హితవు పలికారు.

News February 1, 2026

క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు: మంత్రి కందుల

image

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి కందుల దుర్గేశ్ శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జోలికొస్తే సహించేది లేదని, తాట తీస్తామని హెచ్చరించారు. అంబటి ఒక ఆంబోతులా ప్రవర్తిస్తూ నీచమైన మాటలు మాట్లాడుతున్నారని, ఇలాగే కొనసాగితే ప్రజలే బుద్ధి చెబుతారని మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మానుకోవాలని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో హితవు పలికారు.