EastGodavari

News July 18, 2024

నన్నయ, JNTUK ఇన్‌ఛార్జి వీసీలు వీరే

image

రాజానగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ(వైస్ ఛాన్సలర్)గా ప్రొ.వై.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ప్రస్తుతం జియో సైన్సెస్ విభాగంలో ‌ప్రొఫెసర్‌గా, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ డీన్‌గా ఉన్న శ్రీనివాసరావు.. ఇన్‌ఛార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ JNTU ఇన్‌చార్జి వీసీగా అదే వర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఫ్రొ.KVSG మురళీకృష్ణ నియమితులయ్యారు.

News July 18, 2024

ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి ఉద్ధృతి

image

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉద్ధృతి పెరిగింది. దీంతో బుధవారం కాటన్ బ్యారేజీ 175 గేట్లను 20 మి.మీ. మేర పైకెత్తి 93,244 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. వ్యవసాయ అవసరాలకు డెల్టా కాలువలకు 8,700 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. అలాగే కాటన్ బ్యారేజీ వద్ద 10.65 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది.

News July 18, 2024

మిస్సైన వ్యక్తి పవన్ కళ్యాణ్‌కు రాసిన లేఖ వైరల్

image

ప.గో జిల్లా నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే ఆయన ఆచూకీ కనుక్కోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన అదృశ్యానికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఒక ఫోన్లో డిప్యూటీ సీఎంకు రాసిన లేఖను పంపారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

News July 18, 2024

అంబానీ వివాహ వేడుకలో కోనసీమ ఘనాపాఠీలు

image

అంబానీ వివాహ వేడుకలో కోనసీమ జిల్లా వాసులు పాల్గొన్నారు. నందంపూడి, పాసర్లపూడిలంక, ఇందుపల్లి, అమలాపురానికి చెందిన విశ్వనాథ్, భార్గవ్, సాంబశివ, కమలేష్‌ ఘనాపాఠీలు వధూవరులతో పూజలు చేయించారు. వీరంతా హైదరాబాద్‌లోని వేదభవన్‌లో 13 ఏళ్లపాటు ఘనాపాఠీ కోర్సు పూర్తి చేశారు. పెళ్లి వేడుకకు నెలరోజుల ముందుగానే వీరి ఎంపిక జరిగిందని ..పెళ్లి వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

News July 17, 2024

రంప: విద్యార్థినికి లెక్చరర్ లైంగిక వేధింపులు.. కేసు

image

రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ రామకృష్ణపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్ బుధవారం తెలిపారు. అదే కళాశాలలోని ఇంటర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఫిర్యాదు అందడంతో చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థిని శౌచాలాయానికి వెళ్లిన సమయంలో వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేసిందన్నారు.

News July 17, 2024

కాకినాడలో రామేశంమెట్టను తవ్వేశారు

image

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామేశంపేట పరిధిలోని రామేశంమెట్ట వార్తల్లోకెక్కింది. గుట్ట ప్రాంతంలో ఎర్రమట్టి తవ్వకాలు భారీ ఎత్తున జరిగినట్లున్న చిత్రాలు వైరల్‌గా మారాయి. గుట్టపై ఉన్న విద్యుత్ స్తంభాల చుట్టూ కొంతమేర మట్టి వదిలి.. వాటి చుట్టూ దాదాపు 50 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారు. తాజాగా అధికారులు ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు.

News July 17, 2024

పాఠశాల నుంచి వస్తున్న బాలికపై అత్యాచారయత్నం

image

ఉమ్మడి తూ.గో జిల్లా కాట్రేనికోన మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎస్ఐ నాగేశ్వరరావు వివరాల మేరకు.. ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారి ఈనెల 12వ తేదీని పాఠశాలకు వెళ్లింది. ఆ బాలిక తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. బాలిక భయంతో కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ చెప్పారు.

News July 16, 2024

రావులపాలెం: రికార్డు స్థాయిలో అరటి ధరలు

image

అరటి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం రేట్లు లేక దిగాలు పడిన రైతులకు తాజా ధరలు ఆనందం కలిగిస్తున్నాయి. కర్పూర గెల గరిష్ఠంగా రూ.500, చక్రకేళి, ఎర్రచక్ర కేళి, అమృతపాణి, బొంత గెలలకు సైతం ధరలు పెరిగాయి. రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ అయిన రావులపాలెం యార్డుకు నిత్యం 10 నుంచి 15 వేలు గెలలు వస్తుంటాయి. వీటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.

News July 16, 2024

కాకినాడ: మాజీ సిపాయి మృతి

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామానికి చెందిన మాజీ సిపాయి సబ్బతి భీమరాజు (94) మృతిచెందారు. కాకినాడలోని స్థానిక కచ్చేరిపేటలో మనుమరాలు నివాసంలో ఉంటూ సోమవారం తుదిశ్వాస విడిచారు. భీమరాజు సైన్యంలో బెటాలియన్ హవల్దార్ మేజర్‌గా పనిచేశారు. గతంలో పాకిస్థాన్, చైనా యుద్ధాల్లోనూ పాల్గొన్నారు. కాగా ఆయనకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.

News July 16, 2024

తూ.గో.: అదృశ్యమైన బాలిక.. తల్లిదండ్రుల చెంతకు

image

రాజమండ్రికి చెందిన ఓ బాలిక(17) ఈ నెల 11న అదృశ్యమవగా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను 12వ తేదీన అహ్మదాబాద్‌లో గుర్తించారు. DSP అంబికాప్రసాద్ తెలిపిన వివరాలు.. మోడలింగ్‌పై ఆసక్తి ఉన్న బాలికకు విశాఖలో చదువుతున్న అగర్వాల్‌‌తో ఇన్‌స్టాలో పరిచయమైంది. ఈ క్రమంలో యువకుడితో వెళ్లిపోయింది. బాలికను సురక్షితంగా అప్పగించిన CI, SI, కానిస్టేబుల్‌లను SP అభినందించారు.