India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీసులపై దాడి చేసిన నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ రమేశ్ బాబు కథనం మేరకు.. రాజమండ్రిలో శ్రీకాకుళం పోలీసులపై దాడి చేసి.. రాపాక ప్రభాకర్ను తీసుకువెళ్లిన నిందితులను అరెస్టు చేశామన్నారు. దాడి చేసిన వారిలో భీమవరానికి చెందిన శ్రీకాంత్, వినోద్, రాజు, మహంకాళి, క్రాంతి, మొగల్తూరుకి చెందిన కామరాజుతో పాటు రాజమండ్రికి చెందిన మరో ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు
కడియం మండలం వేమగిరిలో 2002లో వెంకన్నపై కత్తితో దాడి చేసి హత్య చేసిన కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి సత్తిబాబుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.15 వేలు జరిమానా విధించారని కడియం ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ముద్దాయి భార్య భవాని వేమగిరి తోటకు చెందిన వెంకన్నతో సన్నిహితంగా ఉండడాన్ని చూసిన సత్తిబాబు కత్తితో వారిపై దాడి చేశాడన్నారు. ఈ దాడిలో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.
గల్ఫ్ దేశాల్లో చిక్కుకుని,తనను రక్షించమని కార్మిక శాఖ మంత్రిని వేడుకున్న గంటా దీప్తి అనే మహిళ మంత్రి సుభాష్ చొరవతో స్వదేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి సుభాష్ని బాధిత మహిళ కుటుంబ సభ్యులతో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ..ఏజెంట్లు మాయాజాలానికి ప్రజలు మోసపోవద్దని సూచించారు. బాధితులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుదన్నారు. ఏజంట్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
సామర్లకోట మండలం వేట్లపాలెంలో పోలీస్ పహారా కొనసాగుతోంది. ఇరువర్గాల దాడిలో ముగ్గురు మృతి చెందడంతో వేట్లపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సోమవారం రాత్రి నుంచి పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నారు. DSP నిరంతరం అక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు
సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో పోలీస్ పహారా కొనసాగుతుంది. ఇరు వర్గాలు దాడిలో ముగ్గురు మృతి చెందడంతో సామర్లకోట మండలం వేట్లపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సోమవారం రాత్రి పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నారు. నిరంతరం పరిస్థితులను సమిక్షిస్తున్నారు.
అనపర్తిలో రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు..అనపర్తికి చెందిన కే. పవన్ (25) ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం పని నిమిత్తం ఇంటి నుంచి రెస్టారెంట్కి బయలుదేరాడు. మార్గమధ్యలో రైలు పట్టాలు దాటుతుండగా వైజాగ్ వైపు వెళ్తున్న రైలు అతన్ని ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం పరుచుకోవాలని కలెక్టర్ సూచించారు.
చింతూరు మండలం వీరాపురం వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తూ.గో జిల్లా రాజానగరం మండలానికి చెందిన చంద్రరావు(75) మృతి చెందిన సంగతి తెలిసిందే. పండ్ల వ్యాపారం చేసే చంద్రరావు తన భార్య, మనుమడితో కలిసి పండ్ల లోడ్ వ్యాన్తో చింతూరు మీదుగా కుంట బయలు దేరారు. మరో పది నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటారనగా వ్యాన్ బోల్తా పడి వృద్ధుడు మృతి చెందాడు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో భార్య గుండెలవిసేలా విలపించారు.
సంక్రాంతి సంబరాలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ప్రకృతి సోయగాలతో అలరించే ఇక్కడి పల్లెటూర్లు పండుగ శోభతో మరింత వన్నె సంతరించుకుంటాయి. రక్తి కట్టించే కోళ్ల పందేలతో తూ.గో, ప.గో జిల్లాల పేర్లు తెలుగు రాష్ట్రాల్లో మోత మోగుతాయి. కొత్త అల్లుళ్లకు చేసే వినూత్న మర్యాదలు మరో స్పెషల్ ఎట్రాక్షన్. రంగ వల్లులు, ఉత్సవాలు, ఉద్యోగాలకు పట్నం వెళ్లి వారి తిరిగి రాకతో సరిగ్గా మరో నెలలో పల్లెలు కళకళలాడనున్నాయి.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం బురదకోట రిజర్వ్ఫారెస్ట్లో కనిపించిన పులి జాడ ఇంకా లభ్యం కాలేదు. అధికారులు వారం రోజులుగా ట్రాప్ కెమెరాల ద్వారా గాలింపు చేస్తున్నా ఎక్కడా చిక్కలేదు. దీంతో పులి వేరే ప్రాంతానికి తరలి వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమీప ఏజెన్సీ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పులి కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని అటవీశాఖ సిబ్బంది ప్రజలకు కోరారు.
Sorry, no posts matched your criteria.