India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంక్రాంతికి సొంతూర్లకు వచ్చేందుకు కోనసీమ జిల్లా ప్రజలు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్లు అయిపోయాయి. బస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని ప్రయాణీకులు వాపోతున్నారు. హైదరాబాద్ నుంచి అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, మండపేట ప్రధాన పట్టణాలకు ప్రయివేట్ ట్రావెల్స్లో సుమారుగా రూ. 2,500 నుంచి రూ.3 వేల వరకు ఉన్నాయని చెబుతున్నారు. సంక్రాంతి సమయంలో ఛార్జీలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.
కొత్తపేట మండలం పలివెల వంతెన వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నడిచివెళ్తున్న వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో పలివెల గ్రామానికి చెందిన పెండ్రాల చెన్నయ్య (35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విజయవాడ డివిజన్ పరిధిలోని సాంకేతిక మరమ్మతుల కారణంగా ఈ నెల 11, 12న జిల్లా మీదుగా నడిచే 4రైళ్లను రద్దు చేస్తూ డివిజనల్ రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 11న కాకినాడ పోర్టు- వైజాగ్, వైజాగ్- కాకినాడ పోర్టు (17267/17268), 12న గుంటూరు- వైజాగ్(17239), వైజాగ్- గుంటూరు(17240) రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
ఫ్రీ ఓల్డ్ భూములు డేటా ఎంట్రీ, రెవెన్యూ సదస్సులలో అందిన భూసంబంధిత ఫిర్యాదులు పరిష్కారం, రీసర్వే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ మహేష్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి అమరావతి నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్, జేసీ నిశాంతి పాల్గొన్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేల నిర్వహణపై మంగళవారం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి లక్ష్మీనరసింహ చక్రవర్తి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సంక్రాంతికి నిర్వహించే కోడిపందేలపై ఉత్కంఠ నెలకొంది. సంప్రదాయబద్ధంగా వస్తున్న పందేలను పూర్తిగా ఆపేయకుండా, కత్తులు కట్టకుండా నిర్వహిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్
పిఠాపురానికి చెందిన అక్కాచెల్లెళ్లను అదే గ్రామానికి చెందిన హేమంత్ ప్రేమ పేరుతో మోసం చేయడంతో అతడికి 30ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించింది. ఈ మేరకు కాకినాడ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి శ్రీదేవి మంగళవారం తీర్పు చెప్పారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరిపై రెండేళ్లపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికల తండ్రి ఫిర్యాదుతో 2019లో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి గొల్లప్రోలులో మంగళవారం నడిరోడ్డుపై కత్తితో హల్ చల్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. మండల పరిధిలోని చెందుర్తి గ్రామానికి చెందిన ఆ విద్యార్థి స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. చెందుర్తి గ్రామానికి చెందిన మరో విద్యార్థినిపై దాడి చేసి స్థానికులను కత్తితో బెదిరించాడు. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కు వెళ్లింది.
తూర్పుగోదావరి జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఎరువులను సరఫరా చేయాలని సూచించినట్లు తెలిపారు. జనవరి 10వ తేదీ లోపు 2500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు రంగం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
కె.గంగవరం (M) కూళ్ళలో జరిగిన యువకుడి హత్య అక్రమ సంబంధం కారణంగా జరిగిందని రామచంద్రపురం ఇన్ఛార్జ్ డీఎస్పీ డీఆర్కెఎస్. ప్రసాద్ తెలిపారు. ఆయన మంగళవారం ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. నిందితుడు, మృతి చెందిన వ్యక్తి మంచి మిత్రులని.. మృతి చెందిన సత్తి సువర్ణ రత్నం తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వెంకట సూర్య చంద్ర అనుమానించి హత్య చేసినట్లు పేర్కొన్నారు.
కే.గంగవరం మండలం కూళ్ల గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూళ్ల గ్రామంలో సోమవారం రాత్రి సత్తి సువర్ణ రత్నం (35)ని అదే గ్రామానికి చెందిన మంచాల వెంకట సూర్య చంద్ర వివాహేతర సంబంధం కారణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.