India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం అడిషనల్ ఎస్పీ ఎస్.ఆర్.రాజశేఖర్ రాజు పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై 21 ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు.
కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట్రావు సోమవారం ఇద్దరికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. జగన్నాథపురం ఎంఎస్ఎన్ మూర్తి మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తూ మరణించిన సత్యనారాయణ స్థానంలో ఆయన భార్య దుర్గాదేవికి నగరపాలక సంస్థ సాధారణ విభాగంలో.. ప్రజారోగ్య విభాగంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ మృతి చెందిన తాతబ్బాయి స్థానంలో ఆయన సతీమణి సంగంరెడ్డి భవానికి పారిశుద్ధ్య కార్మికురాలిగా పత్రాలు అందజేశారు.
పదో తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అమలాపురం డివిజన్లో 28, కాకినాడ డివిజన్లో 29, రాజమండ్రి డివిజన్లో 54 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం-రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం-రూ.10 వేలు+అలవెన్సులు ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
☞ SHARE IT..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం తామరపల్లికి చెందిన ఎం.భవాని హత్య కేసులో ఆమె భర్త శ్రీనుకు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి విజయ్ గౌతమ్ సోమవారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీధర్ తెలిపారు. 2021 OCT 13న తన కుమార్తె భవానీని భర్త శ్రీను హత్య చేశాడని గుత్తుల శేషారావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారన్నారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిండితుడికి శిక్ష విధించారని తెలిపారు.
గంగవరం మండలం నెల్లిపూడి వాగులో శనివారం <<13622137>>కొట్టుకుపోయిన <<>>లోత మోహన్రావు మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. వాగు పొంగుతున్న సమయంలో మోహన్ తన స్కూటీపై వంతెన దాటుతుండగా అదుపు తప్పి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. నెల్లిపూడి శివారులో కాలువ మధ్య పొదల్లో మృతదేహం దొరికింది. పోస్టుమార్టం నిర్వహించి డెడ్బాడీని కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
ఉమ్మడి తూ.గో జిల్లా రాజవొమ్మంగి మండలం దూసారపాము గ్రామానికి చెందిన రైతు ఎల్.చంటి చేనులో పెంచుతున్న రూ.2 లక్షల విలువైన 40 కోడిపుంజులను దొంగలు ఎత్తుకెళ్లారు. చంటి కథనం ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులు తన చేతులు, కాళ్లు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి పందెం పుంజులను పట్టుకొని పోయారన్నాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు MPTC సత్యనారాయణ తెలిపారు.
విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పిఠాపురానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందగా ఆరుగురు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. పిఠాపురం ప్రాంతానికి చెందిన యువకులు ఒడిశాలోని రాయగడ యాత్రకు కారులో బయలుదేరారు. ఆదివారం సాయంత్రం విజయనగరం గ్రామీణ మండల పరిధిలోని రామవరం- గుంకలాం రోడ్డులో వెళ్తుండగా ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో శ్రీనివాస్ మృతిచెందగా.. ఆరుగురిని జిల్లాసుపత్రికి తరలించారు. కేసు నమోదైంది.
ప.గో.జిల్లా వాసి సత్యశ్రీనివాస్ బర్త్డే సందర్భంగా తల్లిదండ్రులు, సోదరితో కలిసి ద్వారకాతిరుమలకు దర్శనానికి కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా తూ.గో. జిల్లా నల్లజర్ల మండలం అచ్చన్నపాలెంలో మూవీ చూశారు. సోదరిని అత్తవారింట్లో దించి వస్తానని వారిని అక్కడే ఉండమని చెప్పాడు. ఈ క్రమంలో తల్లి సుబ్బలక్ష్మి, తండ్రి బసవరాజు రోడ్డు దాడుతుండగా వారిని కారు ఢీ కొంది. ఆసుపత్రికి తరలిస్తుండగా సుబ్బలక్ష్మి చనిపోయింది.
పెద్దాపురం మండలం వడ్లమూరుకు చెందిన కల్తూరి మనోహర్ జూనియర్ ఇండియా కబడ్డీ ప్రోబబుల్స్కు ఎంపికైనట్లు విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు తాళ్లూరి వైకుంఠం ఆదివారం తెలిపారు. SBSRC కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన జాతీయస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో మనోహర్ అత్యుత్తమ ప్రతిభ చాటాడన్నారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరెడ్డి, వై.శ్రీకాంత్ క్రీడాకారుడిని అభినందించారు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ASIగా విధులు నిర్వహిస్తున్న జి.కృష్ణారావు(59) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం కృష్ణారావుకు గుండెపోటు రావడంతో కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్త విని తోటి అధికారులు, సిబ్బంది భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Sorry, no posts matched your criteria.