EastGodavari

News January 7, 2025

కోనసీమ జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ

image

ప్రత్యేక ఓటర్ల సంక్షిప్త సవరణ తరువాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 15 లక్షల 31 వేల 161 మంది ఓటర్లు ఉన్నారు. ఇన్‌ఛార్జ్ డీఆర్ఓ మాధవి సోమవారం ఓటర్ల జాబితాను విడుదల చేశారు. మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు 7 లక్షల 72 వేల 150 మంది, పురుషులు 7 లక్షల 58 వేల 984 మంది ఉన్నారు. కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఓటర్ల జాబితాలను కూడా ఆమె విడుదల చేశారు.

News January 6, 2025

పెద్దాపురం: లారీ ఢీకొని వ్యక్తి మృతి

image

పెద్దాపురం ఇండస్ట్రియల్ ప్రాంతంలో సోమవారం లారీ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. సామర్లకోట గణపతి నగరానికి చెందిన పెంకె అప్పారావు బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు అప్పారావు పట్టాభి ఆగ్రో ఫుడ్స్ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఘటనపై పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 6, 2025

రాజమండ్రిలో నిలిచిన షిర్డీ ఎక్స్‌ప్రెస్

image

కాకినాడ నుంచి షిర్డీ వెళ్తున్న షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ టైన్‌ను రాజమండ్రిలో రైల్వే అధికారులు నిలిపివేశారు. కాకినాడ, సామర్లకోటలో ప్రయాణికులు రైలు ఎక్కలేకపోయారు. వారు ఫిర్యాదు చేయడంతో ఈ ట్రైన్ ఆపినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వారిని వేరే రైలు ద్వారా కాకినాడ, సామర్లకోట నుంచి రాజమండ్రికి తీసుకొస్తున్నారు. ప్రయాణికుల కోసం సుమారు 2గంటలకుపైగా రాజమండ్రిలోనే షిర్డీ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది.

News January 6, 2025

తూ.గో: సంక్రాంతి ట్రైన్లు.. 8 గంటలకు బుకింగ్

image

➤కాకినాడ టౌన్-చర్లపల్లి(07038): 14వ తేదీ
➤సికింద్రాబాద్-కాకినాడ(07078): 12, 19
➤చర్లపల్లి-కాకినాడ(07031): 8, 10, 14, 16, 18
➤కాకినాడ-చర్లపల్లి(07032): 9, 11, 13, 15
➤నాందేడ్-కాకినాడ(07487): 6, 13
➤కాకినాడ-నాందేడ్(07488): 7,14 తేదీల్లో
పై ట్రైన్ల బుకింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతాయి. గెట్ రెడీ.

News January 6, 2025

సామర్లకోట: ‘సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్’

image

సంక్రాంతి సందర్భంగా రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసినట్లు సామర్లకోట స్టేషన్ అధికారి రమేష్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాకినాడ, సికింద్రాబాద్, చర్లపల్లి, తిరుపతి, వికారాబాద్, కాచిగూడ, తదితర ప్రాంతాలకు సంక్రాంతి సందర్భంగా ప్రయాణించే ప్రయాణికుల కోసం స్పెషల్ ట్రైన్స్ రైల్వే శాఖ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 5, 2025

కాకినాడ: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లొస్తూ ప్రమాదం.. ఇద్దరి మృతి

image

గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. రంగంపేట(M) ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్‌పై వస్తుండగా ఐచర్ వ్యాన్ ఢీకొట్టడంతో మణికంఠ(23) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన చరణ్ GGHకు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతులు కాకినాడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేశారు.

News January 5, 2025

రేపటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు: కలెక్టర్ ప్రశాంతి

image

తూర్పు గోదావరి జిల్లాలో 0-6 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన పిల్లలకి ఆధార్ నమోదు కార్యక్రమానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఆదివారం తెలిపారు. జిల్లాలో సుమారు 17,000 మంది పిల్లలు వివిధ కారణాలవల్ల ఆధార్ సంఖ్య లేని వారు ఉండే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగిందన్నారు. సోమవారం నుంచి 10వ తేదీ వరకు 0-6 మధ్య వయసు ఉన్న పిల్లలకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు.

News January 5, 2025

పిఠాపురంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

పిఠాపురం పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తుని నుంచి కాకినాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అటుగా వెళుతున్న సైకిలిస్టు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పిఠాపురం పట్టణ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 5, 2025

తూ.గో: 10వ తరగతి అమ్మాయి సూసైడ్ నోట్

image

తూ.గో.జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థిని తేజస్విని సాయి దుర్గాలక్ష్మి (15) సూసైడ్ నోట్ చేసుకుంది. ఆ బాలిక తెలంగాణ(D) శామీర్‌పేటలో ఉరివేసుకుంది. పోలీసుల విచారించగా నోట్ బుక్‌లో సూసైడ్ నోట్ లభ్యమైంది. ‘ఏంటో నా జీవితం చనిపోవాలనిపిస్తోంది. నాకు ఏమీ రావు, ఈ జీవితమంతా ఇంతేనా’ అంటూ తనువు చాలించింది. అతిగా నిద్రించే బాలికను పేరెంట్స్ మందలించడంతో సూసైడ్ చేసుకున్నట్లు నిర్ధారించారు.

News January 4, 2025

రాజమండ్రికి మెగాస్టార్ చిరంజీవి..?

image

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న ‘గేమ్ ఛేంజ‌ర్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఇవాళ రాజమండ్రిలో గ్రాండ్‌గా జరగనుంది. చీఫ్ గెస్ట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా కుటుంబం అంతా ఒకే వేదికపై కనిపిస్తుందనే జోష్ అభిమానుల్లో నెలకొంది. సా.6 గంటలకు వేమగిరి జాతీయ రహదారి పక్కనున్న లేఅవుట్‌లో ఈవెంట్ ప్రారంభం కానుంది.