India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెదకాకానిలో శుక్రవారం ఉదయం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని డక్కన్ టుబాకో వెనుక రైల్వే ట్రాక్పై ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకొన్న రైల్వే పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గుంటూరు జిల్లాలో వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలను 2 సంవత్సరాల పాటు రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర పంట రుణాలకు, తాత్కాలిక నిషేధంతో కలుపుకొని 2 సం వరకు అదనంగా ఎలాంటి జరిమానా, వడ్డీలేకుండా పొడిగించుకునే వెసులుబాటు ఉందన్నారు. రుణం చెల్లించాల్సిన గడువు ముగియని రైతులకే ఈ ప్రయోజనం వర్తిస్తుందన్నారు.
లింగంపల్లి నుంచి సికింద్రాబాద్, గుంటూరు మీదుగా తిరుపతి వెళ్లే నారాయణాద్రి ఎక్స్ప్రెస్(12734) రైలు వెళ్లే సమయం మారిందని మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ రైలు లింగంపల్లిలో 17.30 గంటలకు బయలుదేరి, సికింద్రాబాద్ 18.05, నడికుడి 20.34, పిడుగురాళ్ల 20.54, సత్తెనపల్లి 21.22, గుంటూరు 22.55, తిరుపతి 05.55 గంటలకు చేరుతుందన్నారు. నవంబర్ 1 నుంచి ముందస్తు రిజర్వేషన్ గడువును 120 నుంచి 60 రోజులకు తగ్గించారన్నారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పీజీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని అడ్మిషన్ల డైరెక్టర్ బ్రహ్మాజీరావు తెలిపారు. ఏపీపీజీసెట్-2024లో ర్యాంకులు పొందిన వారు ఈ ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 21న ఉదయం 9.30 నుంచి 11.30గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కార్యాలయానికి రావాలని చెప్పారు.
ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు గోవాలో జరుగుతున్న నేషనల్ సబ్ జూనియర్ సీనియర్ మాస్టర్స్ మెన్ అండ్ ఉమెన్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో గుంటూరుకు చెందిన పవర్ లిఫ్టర్ పి. జ్యోతి వర్మ సత్తా చాటారు. మాస్టర్స్ టు విభాగంలో 69కేజీల కేటగిరి బెంచ్ ప్రెస్ పోటీల్లో పాల్గొని బ్రాంజ్ పతకం సాధించారు. గుంటూరు జిల్లాలో పవర్ లిఫ్టింగ్ చరిత్రలో నేషనల్ స్థాయిలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి మహిళగా జ్యోతి నిలిచారు.
ఈ నెల 22, 23వ తేదీల్లో జరిగే అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024కు రావాల్సిందిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకి రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్, గురువారం ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సమ్మిట్కు దేశం నలుమూలల నుంచి వందల కంపెనీలు వందలాది మంది డెలిగేట్స్ అమరావతికి రానున్నారు. ఆహ్వానించిన వారిలో ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ MD కె. దినేష్ కుమార్ ఉన్నారు
స్వర్ణకారుల 60ఏళ్ల కలను నెరవేర్చడం తనకు సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటుకు కృషి చేసినందుకు లక్ష్మినరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు తనను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారని చెప్పారు. కేట్ కట్ చేయించి తమ ఆనందాన్ని పంచుకున్నారన్నారు. మంగళగిరిని గోల్డ్ హబ్ చేసే లక్ష్యంతో అంతా కలిసి పనిచేద్దామని పిలుపు ఇచ్చినట్లు ఆయన ట్వీట్ చేశారు.
మాస్టర్ మైండ్స్ విద్యార్థిని కొత్తపేట తేజశ్వినిని సీఎం చంద్రబాబు అభినందించారు. 2024 సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు గురువారం సచివాలయంలో ఆమెను సత్కరించారు. ఇదే సందర్భంగా విజయవాడ వరద బాధితుల కోసం మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ సీఎం సహాయ నిధికి రూ.7లక్షల డీడీని సీఎంకు అందజేశారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆగస్టులో నిర్వహించిన డిగ్రీ 5వ, 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను గురువారం తాత్కాలిక వీసీ ఆచార్య కే. గంగాధరరావు విడుదల చేశారు. 5వ సెమిస్టర్లో 5,973 మంది విద్యార్థులకు గానూ 4,095 మంది, 6వ సెమిస్టర్లో 300 మందికి 202 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.anu.ac.inలో ఉంచినట్లు పేర్కొన్నారు. share it.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో ఈ నెల 27 నుంచి జరగాల్సిన UG, PG 2, 4 సెమిస్టర్ పరీక్షలు యధాతథంగా జరగనున్నాయి. ఈ మేరకు వర్సిటీ సమన్వయకర్త డా.రామచంద్రన్ ఒక ప్రకటన విడుదల చేశారు. పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నందున నేడు ప్రారంభం కావాల్సిన UG, PG 1,3 సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేశామని, 2,4 సెమిస్టర్ పరీక్షలు మాత్రం తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.