Guntur

News May 14, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేమూరు టాప్

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో సోమవారం ఓటర్ల చైతన్యం కనిపించింది. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని ఓట్లు వేశారు. తాజా సమాచారం మేరకు.. వేమూరులో అత్యధికంగా 85.02% పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా గుంటూరు వెస్ట్‌లో 66.24% మంది ఓటేశారు. కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యమైన నేపథ్యంలో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News May 13, 2024

గుంటూరు: పోలింగ్ సరళి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలన

image

జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పరిశీలించారు. కలక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ & కంట్రోల్ సెంటర్ నుంచి ప్రత్యేక సాధారణ పరిశీలకులు రామ్ మోహన్ మిశ్రా , కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ దూడి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) పవార్ స్వప్నీల్ జగన్నాథ్ పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచన చేశారు.

News May 13, 2024

మాచర్ల: టీడీపీ, వైసీపీ అభ్యర్థుల హౌస్ అరెస్ట్

image

మాచర్ల నియోజకవర్గంలో పలు చోట్ల విధ్వంసాలు జరగడంతో ఎన్నికల అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిని వెల్దుర్తి మండల కేంద్రంలో ఆయన గృహంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల పట్టణంలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే సోదరుడు వెంకటరామిరెడ్డిని పోలీసులు ఓ ప్రైవేటు గృహంలో నిర్బంధించారు.

News May 13, 2024

ఓటు వేయడం మనందరి బాధ్యత: వేణుగోపాల్

image

ఓటు వేయడం మనందరి బాధ్యత అని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏం.వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 171వ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును కుటుంబ సమేతంగా వచ్చి వినియోగించుకున్నారు. అనంతరం అక్కడ ఓటర్లకు కల్పించిన సదుపాయాలను పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

News May 13, 2024

పవన్ సతీమణికి చేనేత వస్త్రాలు బహుకరణ

image

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు జాతీయ రహదారి వెంట ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయానికి సోమవారం విచ్చేశారు. మొదటిసారిగా పవన్ సతీమణి అన్నా లెజినోవా మంగళగిరి విచ్చేసిన సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం చేనేత వస్త్రాలు బహుకరించారు.

News May 13, 2024

17 సార్లు ఓటేసి ఆదర్శంగా నిలిచిన 105 ఏళ్ల వృద్ధురాలు

image

దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన ఇందిరాదేవి 17వ సారి ఓటేసింది. 105 ఏళ్ల వయసున్న ఈమె ఈసారి హోం ఓటింగ్‌లో పాల్గొన్నారు. చాలా సార్లు క్యూలో నిల్చొని ఓటేశానని, ఓటు హక్కుతో మంచినేతను ఎన్నుకోవచ్చని ఆమె వివరించింది. ఓటు వేసే సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరింది. నేడు ఓటు వేసే అందరికీ ఈమె ఆదర్శంగా నిలుస్తున్నారు.

News May 13, 2024

గుంటూరు జిల్లాలో మొదలైన మాక్ పోలింగ్

image

గుంటూరు జిల్లాలో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఏజెంట్లు రాకపోవడంతో మాక్ పోలింగ్‌ ఆలస్యమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

News May 13, 2024

నరసరావుపేట కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్

image

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి శివ శంకర్ ఆదివారం కాకాని వద్ద జేఎన్టీయూ కాలేజీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ , స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల వద్ద నిఘా ఉండేలా చర్య చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

News May 12, 2024

గురజాలలో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

మండలంలోని బూదవాడలో దాసరి బ్రహ్మయ్య(30) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శనివారం సాయంత్రం టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించుకొని. అయ్యప్ప నగర్‌లోని తన నివాసానికి బైక్‌పై బయలుదేరాడు. అయితే బ్రహ్మయ్య ఇంటికి రాకపోయేసరికి.. కుటుంబసభ్యులు అతని కోసం గాలించారు. ఆదివారం రోడ్డు పక్కన అతని మృతదేహాన్ని గుర్తించారు. హత్యా లేక ప్రమాదమా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

News May 12, 2024

బాపట్ల చేరుకున్న రాష్ట్ర ప్రత్యేక పరిశీలకులు

image

బాపట్లలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆదివారం ఎన్నికల ఏపీ రాష్ట్ర ప్రత్యేక పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా విశ్రాంత బాపట్ల చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఎన్నికల సాధారణ పరిశీలకులు పరిమళ సింగ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్ బాషా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. వారితో పాటు ఎన్నికల పోలీస్ పరిశీలకులు కెప్టెన్ అయ్యప్ప, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఉన్నారు.