Guntur

News October 14, 2024

యువగళం పాదయాత్రలోని మరో హామీని నెరవేర్చా: లోకేశ్

image

యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చినట్లు మంత్రి లోకేశ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి సోదరులు పాదయాత్రలో తనను కలిసి విన్నవించారన్నారు. వారి సెంటిమెంట్‌ను గౌరవిస్తూ వాల్మీకి జయంతిని ఈనెల 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు లోకేశ్ తెలియజేశారు.

News October 13, 2024

చిలకలూరిపేటలో జాబ్‌మేళా..1000 పైగా ఉద్యోగాలు

image

చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడులోని యువత కోసం ఈనెల 19వ తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందన్నారు. 30కి పైగా కంపెనీలు, 1000కి పైగా జాబ్‌ ఆఫర్లతో ఈ జాబ్‌ మేళా జరుగుతుందన్నారు. 2016-2024 మధ్య 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, బీటెక్, ఎంటెక్‌ చేసిన వారంతా అర్హులేనని అన్నారు. Shareit

News October 13, 2024

గుంటూరు: డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ

image

డీఎస్సీ ఉచిత శిక్షణకు అర్హులైన SC,ST అభ్యర్థుల నుంచి ఏపీ సాంఘిక సంక్షేమశాఖ అమరావతి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష కోసం ఉచిత బోధన, భోజన, వసతి సౌకర్యాలతో పాటు 3 నెలల ఉచిత శిక్షణ పొందుటకు అవకాశం కల్పించారు. http://jnanabhumi.ap.gov.in ఆన్లైన్ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చని, అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.2.50లక్షల లోపు ఉండాలన్నారు.

News October 13, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలలో బైక్ అంబులెన్స్ సేవలు ప్రారంభం: ఎస్పీ

image

దీర్ఘాయుష్మాన్ బైక్ అంబులెన్స్‌ను ఎస్పీ కంచి శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. క్షతగాత్రులు బైక్ అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే డాక్టర్ లేదా నర్స్ ప్రమాద స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స చేసి అనంతరం ఆసుపత్రికి పంపిస్తారన్నారు. బైక్ అంబులెన్స్ సేవలు నేటి నుంచి ఉమ్మడి జిల్లాలలో 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. బైక్ అంబులెన్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ 8340000108, 8186000108నంబర్లు ఇవే.

News October 13, 2024

గత ప్రభుత్వం నాపై అక్రమ కేసులు పెట్టింది: ధూళిపాళ్ల

image

గత ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబటి మురళీకృష్ణ తనపై బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ల నిర్మాణంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఆ అక్రమాలను నిరూపించటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

News October 12, 2024

గుంటూరు: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి.?

image

దసరా పండుగ అనగానే అందరికీ పల్లెటూరు గుర్తుకు వచ్చేస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, స్నేహితులు కలిసి ఊరంతా సంతోషంగా తిరుగుతూ ఉంటారు. ఊరిలో అందరినీ పలకరిస్తూ.. ఉంటే ఆ ఆనందం మాట్లల్లో చెప్పలేని సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి ఊరితో ఒక్కో విధంగా పండుగను జరుపుకుంటారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.

News October 12, 2024

తెలుగుజాతి ఎప్పటికీ మరిచిపోలేని పేరు ఎన్టీఆర్: జీవీ ఆంజనేయులు

image

చరిత్ర ఉన్నంత కాలం తెలుగుజాతి ఎప్పటికీ మరిచిపోలేని పేరు ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. శనివారం వినుకొండ సురేష్ మహల్ రహదారిలో ఆర్చ్ నిర్మాణానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నటుడిగా, ముఖ్యమంత్రిగా, అంతకు మించిన మహనీయుడిగా తెలుగువారి గుండెల్లో అంతగా చెరగని ముద్రవేశారని కొనియాడారు.

News October 12, 2024

తుళ్లూరులో మద్యం దుకాణాలకు భారీ డిమాండ్

image

ఏపీలో మద్యం దుకాణాల అనుమతికి గుంటూరు, NTR జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 127 దుకాణాలకు 4,396 దరఖాస్తులు అందాయి. తొలి 10అత్యధిక దరఖాస్తుల్లో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచే 8 ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు (104)దుకాణానికి 95దరఖాస్తులు, తుళ్లూరు (102) షాపునకు 86దరఖాస్తులు, తుళ్లూరు(103)దుకాణానికి 82 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News October 12, 2024

గుంటూరు: డిగ్రీ పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీకామ్ జనరల్ & కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్స్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 23 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 24 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News October 11, 2024

జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

జిల్లా ప్రజలకు కలెక్టర్ అరుణ్ బాబు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకొంటారని ఆయన పేర్కొన్నారు. దసరా పండుగ జిల్లా ప్రజలందరికీ మేలు చేయాలని, జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.