India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు మెడికల్ కాలేజీ పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తులు, కౌన్సిలింగ్ తేదీల్లో మార్పులు జరిగాయి. గతంలో ఆగస్టు 6 వరకు దరఖాస్తులు, 19న కౌన్సెలింగ్ జరుగుతుందని ప్రకటించారు. ఏపీ పారామెడికల్ బోర్డు ఆదేశాల మేరకు ఈనెల19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 27వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తాజాగా స్పష్టం చేవారు. ఈ విషయాన్ని దరఖాస్తుదారులు గమనించాలని కోరారు.
గుంటూరు జిల్లాలో తొలి విడతలో భాగంగా 13 అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. గుంటూరులో 7, మంగళగిరిలో 3, తెనాలిలో 3 క్యాంటీన్లు ఓపెన్ చేశారు. తొలిరోజు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి భోజనం చేశారు. ఇంతకీ ఈ క్యాంటీన్లలో మీరు భోజనం చేశారా? రుచి ఎలా ఉంది? ప్రజలకు ఉపయోగ పడే ప్రాంతాల్లో క్యాంటీన్లు పెట్టారా? ఇంకా ఎక్కడెక్కడ క్యాంటీన్లు పెట్టాలి? అనేది మీరు కామెంట్ చేయండి.
వాహనాలు నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని అధికారులు తరచూ సూచిస్తుంటారు. దానిని పట్టించుకోకపోవడంతో వచ్చిన అనర్థమే ఇది. గుంటూరు నగర శివారు హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి ఓ వ్యక్తి బైకుపై వేగంగా నల్లపాడు వైపు వస్తున్నాడు. అదే సమయంలో సెల్ ఫోన్ మాట్లాడటంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో జీజీహెచ్కి తరలించారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఆర్థికాభివృద్ధిపై టాస్క్ ఫోర్స్ సిఫార్సులకనుగుణంగా ప్రభుత్వం, సీఐఐ ఇండస్ట్రీ ఫోరమ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సీఎం చంద్రబాబు Xలో పోస్ట్ చేశారు.
సీఐఐ మోడల్ కెరీర్ సెంటర్ ద్వారా యువతలో ఉపాధిని పెంపొందించడంపై దృష్టి పెడతామని సీఎం తెలిపారు.
గుంటూరు జిల్లా పెదకాకానిలో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. లోదర్ గిరి కాలనీకి చెందిన ఇద్దరు పిల్లలు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా వారిపై గోడ పడింది. ఈ ప్రమాదంలో కోలాటపు సాత్విక్ (12), బంగారపు సిద్ధార్థ్ (13) మృతి చెందారు. ఒక పిల్లోడు అక్కడికక్కడే చనిపోగా, మరో పిల్లవాడిని హాస్పిటల్ తీసుకెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో మృతి చెందాడు
టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. సచివాలయానికి వచ్చిన చంద్రశేఖర్తో లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రోత్సాహకాలను ఆయనకు వివరించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకు సహకరించే అన్నిరకాల పరిశ్రమలకు తాము మెరుగైన ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు.
అన్నా క్యాంటీన్లని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. నల్లచెరువులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అన్న క్యాంటీన్లను నడుపుతుందని, సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారికి క్యాంటీన్లు ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్, కమిషనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం నమోదు చేయడంతో మాచర్ల పురపాలక సంఘ పరిధిలోని కౌన్సిలర్లు YCPని వీడి TDPలో చేరారు. ప్రస్తుత మున్సిపల్ ఛైర్మన్ ఏసోబు, వైస్ ఛైర్మన్ నరసింహారావులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిని కలిశారు. ఇప్పటికే పలువురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. మొత్తంగా 31 మంది కౌన్సిలర్లకు గాను 20 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరుతున్నట్లు సమాచారం.
సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. రేపు కూడా ఆయన హస్తినలోనే ఉంటారు. ఈ పర్యటనలో చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై వారితో చర్చించనున్నారు. అనంతరం శనివారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.
➤ దేశం మొత్తం గర్వించేలా అమరావతి నిర్మాణం: చంద్రబాబు
➤ జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి లోకేశ్
➤ గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డ్రోన్ కలకలం
➤ తాడేపల్లి: జెండా ఎగురేసిన వైఎస్ జగన్
➤ బాపట్లలో అంగన్వాడీ టీచర్ మృతి
➤ టీడీపీపై మాజీ ఎమ్మెల్యే బొల్లా ఫైర్
➤ నరసరావుపేట: జాతీయ జెండా రంగుల అలంకారంలో శివయ్య
Sorry, no posts matched your criteria.