India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు ఈ నెల 29న ప్లాట్ల కేటాయింపు జరగనున్నట్లు మంత్రి నారాయణ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఇ- లాటరీ ద్వారా ప్లాట్లను నిబంధనల ప్రకారం లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. ఈ నెల 28కి బదులు 29వ తేదీన లాటరీ నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

APSRTC ITI అప్రెంటిస్షిప్కు దరఖాస్తు చేసి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిన అభ్యర్థుల ఎంపిక జాబితాను apsrtc.ap.gov.in వెబ్సైట్లోని రిక్రూట్మెంట్ ట్యాబ్లో విడుదల చేశారు. గుంటూరు జిల్లాకు ఎంపికైన అభ్యర్థులు JAN 28న అవసరమైన ధ్రువపత్రాలతో జిల్లా ప్రజా రవాణాధికారి కార్యాలయం, గుంటూరులో హాజరుకావాలి. హాజరు కాని వారి స్థానంలో వెయిటింగ్ లిస్ట్ ఎంపిక జరుగుతుందని జిల్లా ప్రజా రవాణా అధికారి మాలతి తెలిపారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్లలో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయం అయినప్పటికీ, స్వాతంత్ర్యం తర్వాత మన రాష్ట్రపతి, గవర్నర్లు దీనిని అధికారికంగా కొనసాగిస్తున్నారు. ఈ వేడుకలో పాలకులు, ప్రముఖులు, అధికారులతో గవర్నర్ తేనీటి విందులో పాల్గొంటారు. తాజాగా విజయవాడలో జరిగిన కార్యక్రమానికి గవర్నర్, సీఎం, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

పొన్నూరు(M) బ్రాహ్మణకోడూరు MPPS 1వ తరగతి విద్యార్థి షేక్ సమాన్ మాలిక్ రాష్ట స్థాయిలో చేతిరాత పోటీలలో ప్రథమ స్థానం పొందాడు. క్యాలిగ్రఫీ టీమ్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో గుంటూరులో విద్యార్థి సమాన్ మాలిక్ను DEO సలీం బాషా అభినందించి ప్రశంసా పత్రం, షీల్డ్, రూ. 2 వేల నగదు బహుమతి ప్రధానం చేశారు. విద్యార్థి సమాన్ మాలిక్ను పొన్నూరు MEOలు రాజు, విజయభాస్కర్, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు అభినందించారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, అధికారులకు సీఎం స్వయంగా స్వీట్లు పంచిపెట్టారు. వారందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాయపూడిలో జరుగుతున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల భద్రతా ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సభావేదిక, గ్యాలరీలు, వీవీఐపీ ప్రాంతాలు, సీసీ కెమెరాలు, డ్రోన్ గస్తీపై సమీక్షించి అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు అమలు చేయాలని సూచించారు.

డా. BR అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం జూనియర్ ఇంటర్తో పాటు 6 నుంచి 10 తరగతుల్లో బాలురు, బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అడవితక్కెళ్లపాడు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు కొనసాగనుందన్నారు. ఆసక్తి గల వారు apgpcet.apcfss.inలో నమోదు చేసుకోవాలన్నారు.

రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన PGRS కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం జాతీయ పండుగ కారణంగా ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి, జిల్లా పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.

గుంటూరు జిల్లా కేంద్రంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, వైద్యులు, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, గ్రామ స్థాయి సిబ్బందికి అవార్డులు ప్రకటించారు. కలెక్టర్ కార్యాలయం విడుదల చేసిన జాబితాలో 351 మందికి పైగా అవార్డులు పొందనున్నట్లు వెల్లడైంది. ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని సత్కరించనున్నారు.

@VVIP, AA, A1, A2 పాసులు, రైతులు లోటస్ – కరకట్ట మీదుగా – ఎమ్మెస్సార్ ఆశ్రమం – సీడ్ యాక్సెస్ రోడ్ – ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎడమవైపు నుంచి
@బి1, బి2 పాస్ హోల్డర్స్, రైతులు ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందుకు వెళ్లి వెస్ట్ బైపాస్ రోడ్డు నుంచి
@ గుంటూరు నుంచి వచ్చు సాధారణ వాహనాలు మురుగన్ హోటల్ సెంటర్ నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లి E8 రోడ్డు అండర్ పాస్ – మందడం గ్రామం – వెలగపూడి గ్రామం మీదుగా వెళ్లాలి.
Sorry, no posts matched your criteria.