Guntur

News October 26, 2025

తెనాలి: చంద్రబాబు, లోకేశ్‌పై పోస్టులు.. కేసు నమోదు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై ట్విట్టర్‌లో అనుచిత పోస్ట్‌లు పెడుతున్న వ్యక్తిపై తెనాలిలో కేసు నమోదైంది. ఉపేంద్ర ధర్మ అనే హ్యాండిల్ ద్వారా పోస్ట్‌లు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూ టౌన్ సీఐ రాముల నాయక్ శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టారు.

News October 26, 2025

గుంటూరు: ‘ఈ సమస్యలు వస్తే కాల్ చేయండి’

image

గృహ హింస చట్టం 2006 అక్టోబర్ 26 అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా మహిళల రక్షణ, న్యాయం కోసం అధికారుల పర్యవేక్షణలో కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. మహిళలపై హింస, వేధింపులు, దౌర్జన్యాలు ఎదురైనప్పుడు వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గుంటూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ గృహ హింస చట్టం శాఖను సంప్రదించవచ్చు. లీగల్ కౌన్సిలర్ : 8639687689, సోషల్ కౌన్సిలర్: 8074247444.

News October 25, 2025

గుంటూరు జిల్లాలో స్కూళ్లకు 3 రోజులు సెలవులు

image

మెంథా తుపాన్ దృష్ట్యా 27, 28,29 తేదీల్లో పాఠశాలలకు కలెక్టర్ తమీమ్ అన్సారియా సెలవు ప్రకటించారు. తల్లిదండ్రులు చిన్నారులను బయటకు పంపొద్దన్నారు. ప్రజలు తుపాన్ దృష్ట్యా ఇంటి వద్దనే ఉండాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 0863 2234014 ఏర్పాటు చేశామని దీంతోపాటు డివిజన్ మండల స్థాయిలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు.

News October 25, 2025

సెస్సు బకాయిలపై దృష్టి సారించాలి: జేసీ

image

గ్రంథాలయ సెస్సు బకాయిల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. గ్రంథాలయ సెస్సు సమీక్షా సమావేశం శనివారం కలెక్టరేట్‌లో జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రంథాలయ సంస్థ సెస్సు బకాయిలు రూ. 64, 36,14,822లు ఉన్నాయని చెప్పారు. సెస్ బకాయిలు తక్షణమే వసూలు చేయాలని జేసీ ఆదేశించారు.

News October 25, 2025

పోలీస్ ప్రతిష్ఠను కాపాడండి: ఎస్పీ

image

పోలీస్ ప్రతిష్ఠ, గౌరవం, అధికారాన్ని కాపాడే విధంగా సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి శనివారం సెట్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బందితో ఆయన మాట్లాడారు. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ లాఠీ, విజిల్ తమతో ఉంచుకోవాలని, అవసరమైతే వాటిని చట్టబద్ధంగా ఉపయోగించాలని ఎస్పీ సూచించారు.

News October 25, 2025

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద అప్టేట్

image

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం నెమ్మదిగా పెరుగుతోంది. శనివారం సాయంత్రం 4.00 గంటల వరకు బ్యారేజీ వద్ద 11.6 అడుగుల నీటిమట్టం నమోదైంది. సర్ ప్లస్ ప్రవాహం 85,360 క్యూసెక్కులుగా ఉంది. కె.ఇ. మెయిన్ కెనాల్‌కు 511 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, బ్యారేజీ వద్ద మొత్తం నీటి పరిమాణం 85,871 క్యూసెక్కులుగా ఉంది.

News October 25, 2025

ఆ ఆసుపత్రులకు నోటీసులివ్వండి: కలెక్టర్

image

లక్ష్య సాధనలో అలసత్వం వద్దని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ శనివారం సమీక్ష నిర్వహించారు. గర్భిణీ స్త్రీల నమోదు మెరుగుపడాలని, ఏ.బి.హెచ్.ఏ పై అవగాహన కల్పించాలని, గ్రామ సచివాలయం సిబ్బందిని ఉపయోగించాలన్నారు. శత శాతం సిజేరియన్ ప్రసవాలు చేస్తున్న ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయాలని, పక్కాగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

News October 25, 2025

నీటి పథకాలు సమర్థవంతంగా పనిచేయాలి : కలెక్టర్

image

నీటి పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో శనివారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి నీటి పథకం సమర్ధవంతంగా పని చేయాలని, సి.పి.డబ్ల్యూ నీటి పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు జిల్లా పరిషత్ కు పంపించాలని సూచించారు. స్లో సాండ్ ఫిల్టర్లు ఏర్పాటుకు ప్రాధాన్యత మేరకు గుర్తించి అంచనాలు సమర్పించాలని ఆదేశించారు.

News October 25, 2025

తెనాలి అనగానే… ఆ పేరు చెప్పక తప్పదు

image

తెనాలి పట్టణం సాహిత్యం, సంగీతం, నాటకం, చిత్రకళ, శిల్పకళల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రతిభావంతులైన కళాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గౌరవాలు అందుకుంటున్నారు. ప్రతి వీధిలోనూ సృజనాత్మకత ప్రతిధ్వనిస్తుంటే, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. తెనాలి పేరు వినగానే “కళా కాణాచి” అనిపించుకోవడం ఆనవాయితీ.
@నేడు అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం

News October 25, 2025

GNT: ఇది ప్రకృతి పట్ల కృతజ్ఞత తెలిపే పండుగ

image

నాగులచవితి హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైన పర్వదినం. ఈరోజు నాగదేవతలను పూజించడం ద్వారా సర్పదోషాలు తొలగి కుటుంబంలో ఆరోగ్యం, సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం ఉంది. ఆడవారు ఉపవాసం ఉండి పాలు, పండ్లు, పువ్వులతో నాగదేవతను ఆరాధిస్తారు. రైతులు పంటల రక్షణ కోసం, గృహిణులు కుటుంబ సౌఖ్యం కోసం ప్రార్థనలు చేస్తారు. ఇది ప్రకృతి, జీవజాలాల పట్ల కృతజ్ఞత తెలిపే పండుగగా భావిస్తారు.