Guntur

News March 29, 2025

గుంటూరు మిర్చి యార్డుకు సరుకు తీసుకు రావద్దు

image

గుంటూరు మిర్చి యార్డుకు రైతులు ఎవరూ సరుకు తీసుకు రావద్దని యార్డు అధికారులు శుక్రవారం తెలిపారు. యార్డుకు మూడు రోజులు సెలవులు ఇచ్చినట్లు తెలిపారు. ఈరోజు, ఆదివారం యార్డుకు వీక్ ఎండ్ సెలవులు ఇవ్వగా.. సోమవారం రంజాన్ సందర్భంగా సెలవు ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించి మిర్చి యార్డ్‌కు బస్తాలు తీసుకురావద్దని అన్నారు. తిరిగి మరలా యార్డును మంగళవారం నుంచి కొనసాగిస్తామని చెప్పారు. 

News March 29, 2025

GNT: వారం రోజుల పాటు ఇంటర్ సిటీ రైలు రద్దు 

image

గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్సిటీ రైలు వారం రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. మే నెల 23 నుంచి 29 వరకు నాన్ ఇంటర్ లాకింగ్ పనులు కారణంగా గుంటూరు-సికింద్రాబాద్(12705-12706) మధ్య తిరిగే ఇంటర్ సిటీ రైలును రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఆయా తేదీల్లో ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలని సూచించారు.

News March 29, 2025

గుంటూరు: నైట్ ఫుడ్ కోర్ట్ విషయంలో చర్చ.!

image

కరోనా ముందు వరకు నైట్ ఫుడ్ కోర్ట్ హిందూ కళాశాల సెంటర్‌లో నడిచింది. మార్కెట్‌కు సరుకు తెచ్చే రైతులు, ఆసుపత్రులకు, బస్టాండ్, రైల్వే స్టేషన్‌కు దగ్గరగా ఉండటంతో బాగా నడిచిందని, ఇప్పుడు వీటన్నిటికీ దూరంగా బ్రాడీపేట, అరండల్ పేటలో ఫుడ్ కోర్టును నిర్వహిస్తే అంత ప్రయోజనకరంగా ఉండదని ప్రజలు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు మరోసారి పునరాలోచించి హిందూ కళాశాల రోడ్డులోనే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. 

News March 29, 2025

ఈ-కేవైసీ చేయకపోతే రేషన్ ఆగిపోతుంది: DSO

image

గుంటూరు జిల్లాలో రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ చేయకపోతే మే 1వ తేదీ నుంచి రేషన్ నిలిపేస్తామని DSO కోమలి పద్మ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. రేషన్ కార్డు దారులు ఏప్రిల్ చివరి వరకు ఈ-కేవైసీ చేయించుకోవచ్చన్నారు. మొత్తం జిల్లాలో 5.99 లక్షల కార్డులు ఉండగా.. ఇప్పటి వరకు 4.70 లక్షల మంది ఈ-కేవైసీ అప్డేట్ చేయించారన్నారు. మిగిలిన వారు కూడా ఈ-కేవైసీ పూర్తి చేయించాలన్నారు. 

News March 29, 2025

31న జరగాల్సిన పరీక్ష వాయిదా: DEO 

image

ఈనెల 31న రంజాన్ పండుగ సందర్భంగా ఆరోజు జరగవలసిన 10వ తరగతి సోషల్ పరీక్ష ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసినట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గుంటూరు జిల్లాలోని అన్ని యజమాన్యాల ప్రధానోపాద్యాయులు ఈ విషయం వెంటనే 10వ తరగతి విద్యార్ధులకు తెలియజేయాలని సూచించారు. 

News March 29, 2025

నేరాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి: ఎస్పీ

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో మార్చి-2025 నెల నేర సమీక్ష సమావేశంలో నిర్వహించారు. సమావేశంలో జిల్లా నేర సమీక్ష నిర్వహణ ప్రత్యేక అధికారి IG హరికృష్ణ పాల్గొని పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. నేరాల పరిశోధన, నియంత్రణ కొరకు తీసుకోవాల్సిన చర్యల గురించి దిశా నిర్దేశం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సతీశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

News March 28, 2025

GNT: మైనర్ బాలికతో ప్రేమ పెళ్లి.. పోక్సో కేసు నమోదు

image

బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువకుడు 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ యువకుడి‌పై పట్టాభిపురం పీఎస్‌లో పోక్సో కేసు నమోదైంది. ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయాన్ని ఇరు కుటుంబాలు గోప్యంగా ఉంచాయి. ఆ మైనర్ బాలిక మరో వ్యక్తితో చాటింగ్ చేస్తుండటంతో ఆ కుటుంబాల్లో గొడవలు జరిగాయి. దీంతో వారు స్టేషన్ మెట్లు ఎక్కడంతో పెళ్లి జరిగి 8 నెలలైందని పోలీసులు గుర్తించారు.

News March 28, 2025

ఉండవల్లిలో యువకుడిపై దాడి.. డబ్బుతో పరార్

image

ఓ ఆటోలో ఇద్దరు వ్యక్తులు కలిసి విజయవాడ బస్టాండ్ వద్దకు వచ్చి ఓ యువకుడితో అమ్మాయి ఉందని రేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు ఉండవల్లి సమీపంలో పొలాల వద్దకు వచ్చారు. అక్కడ యువకుడి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు. పని అయ్యాక విజయవాడలో వదిలిపెట్టాలని కోరాడు. దీంతో ఆటోకి రూ.1500ఇవ్వాలని యువకుడిపై దాడి చేసి, జేబులోని డబ్బు లాక్కెళ్లారు. యువకుడు ఫిర్యాదుకు వెళ్తే పోలీసులు మందలించినట్లు సమాచారం.

News March 28, 2025

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి

image

త్రైమాసిక తనిఖీలలో భాగంగా గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ ను గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గురువారం పరిశీలించారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన భధ్రతా సీళ్లు, సీసీ కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, మొదలైనవి పరిశీలించారు. గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట అధికారులు పాల్గొన్నారు.

News March 27, 2025

గుంటూరు జిల్లాలో గెలిచిన వారి వివరాలు

image

గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో గురువారం నిర్వహించిన ఉప ఎన్నికలు ముగిశాయి. పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు (TDP) ఉప సర్పంచ్‌గా నాగమల్లేశ్వరరావు గెలుపొందారు. గుంటూరు రూరల్ మండల ఉపాధ్యకుడిగా కాకాని రమేష్(YCP), దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షురాలిగా షేక్ జబీన్(TDP), తెనాలి కోఆప్షన్ సభ్యుడిగా సయ్యద్ జానీ బాషా(YCP), కొల్లిపర మండలం (YCP) తూములూరు ఉప సర్పంచ్‌గా ఆరుమళ్ల శివారెడ్డి ఎన్నికయ్యారు.

error: Content is protected !!