India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం డ్రోన్ కలకలం రేపింది. అనుమతి లేకుండా హై సెక్యూరిటీ జోన్లో ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డ్రోన్ ఎగరడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మంత్రి నారా లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డ్రోన్ ఎగరేసిన ఆపరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని డ్రోన్ సీజ్ చేసి విచారణ చేపట్టారు.
CM చంద్రబాబు నాయుడు ఈనెల 16, 17 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, తదితరులను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, APకి సంబంధించి ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించిన వివిధ అంశాలు అమలు కార్యాచరణపై వారితో చర్చించనున్నారు. 16న TDP కార్యాలయంలో CM అందుబాటులో ఉండరని అశోక్ బాబు తెలిపారు.
గుంటూరు పట్టాభిపురం పోలీసులు కిడ్నాప్ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాలు.. జూట్ మిల్లు సమీపంలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో టీజేపీఎస్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఇద్దరు బాలికలు ఉంటున్నారు. బాలికను, ఆమె స్నేహితురాలిని తీసుకెళ్లిన కేసులో నిందితులుగా ఉన్న గోపి, మణికంఠలను పట్టాభిపురం సీఐ కిరణ్ అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించారు.
గుంటూరు కార్పొరేషన్ పాఠశాలలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు సంబందించి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం ఈనెల 17వ తేదీన హాజరు కావాలని డీఈవో శైలజ తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్, సర్వీసు పుస్తకంతో ఉదయం 11 గంటలకు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం నందు హాజరు రావాలని సూచించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం జరుగుతుందన్నారు.
మన దేశం స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు పొందటానికి జీవితాలు, ప్రాణాలు ధారపోసిన మహానుబావులందరినీ స్మరించుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ భారతీయులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తిరంగా వేడుకలు గ్రామగ్రామాన ఒక పండుగ వాతావరణంలో చేసుకునేందుకు పంచాయతీలకు జెండా పండుగకు అవసరమైన నిధులు పెంచుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు.
రెడ్ బుక్పై లోకేశ్ స్పందించారు. ‘ఫేకు జగన్.. నాది రెడ్ బుక్ మాత్రమే కాదు ఓపెన్ బుక్ కూడా! నీలాగా నాకు క్విడ్ ప్రో కో, మనీ లాండరింగ్, CBI కేసులు లేవు. విదేశాలకు వెళ్లాలంటే నీ మాదిరిగా కోర్టు అనుమతులు నాకు అవసరం లేదు. మంత్రిగా ప్రభుత్వాల అనుమతితోనే వెళ్ళాను. జనాలు కొట్టిన షాట్ నుంచి కోలుకోవడానికి టైం పడుతుంది. చిల్ బ్రో! సరే కానీ బాబాయ్ను లేపేసింది ఎవరో చెప్పే దమ్ముందా జగన్?’ అంటూ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘X’ వేదికగా పోస్టు చేశారు. మహోజ్వల చరిత్ర గల మన దేశ సమగ్రతను కాపాడటం అందరి కర్తవ్యం అని, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు వరుసగా మూడో సంవత్సరం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.
దేశభక్తిని సమైక్యతను చాటి చెప్పెలా ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండా ఎగరవేయాలని కలెక్టర్ అరుణ్ బాబు కోరారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన కలెక్టరేట్లో మాట్లాడుతూ ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామంలోని పాఠశాలలో జాతీయ సమైక్యతపై పోటీలు నిర్వహించాలన్నారు. అనంతరం ప్రతి మండల కేంద్రం, జిల్లాలోనున్న ఇంజినీరింగ్ కళాశాలలో హర్ ఘర్ తిరంగా నిర్వహించాలన్నారు. సెల్ఫీ తీసుకున్న ఫోటోలు వెబ్సైట్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు.
గుంటూరు నగర కమిషనర్గా భాద్యతలు తీసుకున్న పులి శ్రీనివాసులు బుధవారం కలెక్టర్ నాగలక్ష్మీను కలిశారు. ఈ మేరకు కమిషనర్ పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు విషయాలపై చర్చించారు. నగరంలో ప్రజా సమస్యలపై నాణ్యమైన శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని కమిషనర్కు కలెక్టర్ సూచించారు.
ర్యాగింగ్కు పాల్పడితే కళాశాల నుంచి సస్పెన్షన్తో పాటు తొలగింపుకు గురి అవుతారని ఎస్పీ సతీశ్ హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ఆయన తుళ్లూరు మండల పరిధిలోని ఓ యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత తరం విద్యార్థులు సరైన విషయాల కోసం సమయాన్ని వెచ్చిస్తే మరింత సామర్థ్యం కలిగి ఉంటారని, నైపుణ్యాలను మెరుగైన రీతిలో ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు.
Sorry, no posts matched your criteria.