India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ర్యాగింగ్కు పాల్పడితే కళాశాల నుంచి సస్పెన్షన్తో పాటు తొలగింపుకు గురి అవుతారని ఎస్పీ సతీశ్ హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ఆయన తుళ్లూరు మండల పరిధిలోని ఓ యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత తరం విద్యార్థులు సరైన విషయాల కోసం సమయాన్ని వెచ్చిస్తే మరింత సామర్థ్యం కలిగి ఉంటారని, నైపుణ్యాలను మెరుగైన రీతిలో ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు చంద్రబాబు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ శాఖ, ఆర్టీజీ శాఖపై సమీక్ష చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం యధావిధిగా పోలీసులు సచివాలయం పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు.. బాంబ్ స్క్వార్డ్ తనిఖీలు చేసింది.
చెల్లని చెక్కు కేసులో ఓ వైద్యురాలికి 6 నెలల జైలు శిక్ష విధించారు. ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ పద్మజ, మంగళగిరికి చెందిన కుమార్ వద్ద రూ.10లక్షల అప్పు తీసుకొని 2019లో రూ.6లక్షలు చెక్కు ఇవ్వగా, నగదు లేక ఆ చెక్కు చెల్లలేదు. కుమార్ చెక్కు బౌన్స్ కేసు వేయగా న్యాయమూర్తి సురేశ్ బాబు వైద్యురాలికి 6 నెలలు జైలు శిక్ష, రూ.6లక్షలు చెల్లించాలని తీర్పు వెల్లడించారు.
రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లకు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ రూ.1 కోటి విరాళం అందించింది. గుంటూరుకు చెందిన ఎస్.ఎల్.వీ డెవలపర్స్ అధినేత పి.శ్రీనివాసరాజు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి రూ.1 కోటి చెక్కును అందించారు. రాబోయే ఐదేళ్ల పాటు అన్న క్యాంటీన్కు కోటి రూపాయల చొప్పున విరాళం అందిస్తానని శ్రీనివాసరాజు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖపై మంగళవారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇంటికి వచ్చిన ఓ అల్లుడికి అత్తాగారి కుటుంబం ఘన స్వాగతం పలికింది. అన్ని రకాల వంటలు చూసిన ఆ అల్లుడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆషాఢమాసం వెళ్లి శ్రావణమాసం రావడంతో నూతన వధూవరులు అత్తగారి ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో అల్లుడికి స్వాగతం పలుకుతూ భారీ వంటలతో విందు పెట్టారు. వినుకొండలోని కొత్తపేట స్టేట్ బ్యాంకు లైన్లో నివాసం ఉన్న తాతా రమేశ్ అల్లుడు రాకతో 250 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.
ఇంటికి వచ్చిన ఓ అల్లుడికి అత్తాగారి కుటుంబం ఘన స్వాగతం పలికింది. అన్ని రకాల వంటలు చూసిన ఆ అల్లుడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆషాఢమాసం వెళ్లి శ్రావణమాసం రావడంతో నూతన వధూవరులు అత్తగారి ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో అల్లుడికి స్వాగతం పలుకుతూ భారీ వంటలతో విందు పెట్టారు. వినుకొండలోని కొత్తపేట స్టేట్ బ్యాంకు లైన్లో నివాసం ఉన్న తాతా రమేశ్ అల్లుడు రాకతో 250 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.
గుంటూరులో డ్రగ్స్ కేసు మరింత కలకలం రేపుతోంది. ఈ కేసులో మొత్తం ముగ్గురు యువకులు అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. ఇందులో ఒకరు మస్తానయ్య దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కొడుకు మస్తాన్ సాయి కాగా గుంటూరు హోటల్ రంగంలో పేరు గాంచిన సుభానీ హోటల్ నిర్వాహకులు ఇద్దరు ఉన్నారు. కరోనా సమయంలో సుభానీ మరణించగా తాజాగా ఆయన కుమారులు నాగూర్ షరీఫ్, ఖాజా మొయినుద్దీన్లు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు.
హీరో రాజ్ తరుణ్-లావణ్య డ్రగ్స్ సప్లయర్ విషయంలో గుంటూరు మూలాలు కనిపించాయి. హైదరాబాద్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుడికి డ్రగ్స్ అందించిన రావి సాయి అనే యువకుడిని ఏపీ సెబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు గుర్తించారు.
గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన గుజ్జనగుండ్లలోని కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రఘు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Sorry, no posts matched your criteria.