Guntur

News August 12, 2024

చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఈ మేరకు రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించింది. గత రెండు రోజులుగా అమరావతిలో పర్యటిస్తున్న ఈ బృందం.. రాజధాని ప్రాంతంలోని భవనాలు, రహదారులను పరిశీలించింది. ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అమరావతి నిర్మిస్తున్నామని ఆ బృందానికి సీఎం వివరించారు.

News August 12, 2024

మాజీ MLA పిన్నెల్లి బెయిల్ పిటిషన్ వాయిదా

image

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి వద్దకే ఈ పిటిషన్ వెళ్లాలని హైకోర్టుకు పోలీసుల తరఫు లాయర్ అశ్వినీకుమార్ సూచించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి నిశితంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి వెల్లడించారు. అనంతరం కేసు తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.

News August 12, 2024

ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదు: మంత్రి అనగాని

image

మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు విచారణ వేగంగా జరుగుతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏపీ వ్యాప్తంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులున్నారని ఆరోపించారు. తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో భూములకు సంబంధించిన వందల ఫైళ్లు దొరికాయని అన్నారు. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

News August 12, 2024

ప్రజలకు అందుబాటులో ఉండేందుకే పరిష్కార వేదిక: నాగలక్ష్మీ

image

మంగళగిరి ప్రజలకు ప్రతి నియోజకవర్గంలో అందుబాటులో ఉండి సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. సోమవారం గౌతమ్ బుద్ధ రోడ్డు వెంబడి గల ఈద్గా మైదానంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక నిర్వహించిన అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ అన్నారు.

News August 12, 2024

నేడు గుంటూరుకు రానున్న హీరో విక్రమ్

image

తంగలాన్ చిత్ర ప్రమోషన్లలో భాగంగా హీరో విక్రమ్ సోమవారం విజయవాడ రానున్నారు. ఉదయం 11 గంటలకు విక్రమ్‌తో పాటు చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహిస్తారని ఈ మేరకు తాజాగా సమాచారం వెలువడింది. అనంతరం 12 గంటలకు పరిటాలలో MVR కళాశాలకు, మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు VVIT కళాశాలకు తంగలాన్ బృందం వెళ్లనుంది.

News August 12, 2024

తెనాలి: శరవేగంగా క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ నిర్మాణం

image

డెల్టా ప్రాంత ప్రజలకు వరమైన తెనాలిలో వైద్యశాల్లో మరో నూతన విభాగం అందుబాటులోకి రానుంది. అత్యవసర కేసులను గుంటూరు జిల్లా వైద్యశాలకు తరలిస్తున్న నేపథ్యంలో తెనాలిలోనే ఆ స్థాయిలో వైద్యం అందించేందుకు కసరత్తు జరుగుతోంది. రూ.45కోట్ల అంచనాతో 100 పడకలతో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ నిర్మాణం ప్రారంభమైంది. మొత్తంగా 2025 చివరి నాటికి క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు చెబుతున్నారు.

News August 12, 2024

మాచవరంలో అతిసారం బారిన పడిన 12 మంది

image

మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం ఎస్సీ కాలనీలోనూ అతిసారం ప్రబలింది. మూడు రోజుల్లో 12 మంది అతిసారం బారిన పడినట్లు స్థానికులు చెబుతున్నారు. వారిలో కొందరు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతుండగా.. కొందరిని సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు కాలనీలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. నేడు గుంటూరు నుంచి వైద్య బృందం రానున్నట్లు అధికారులు తెలిపారు.

News August 11, 2024

గుంటూరు: TODAY TOP NEWS

image

* 15 నుంచి రెవెన్యూ సదస్సులు: అనగాని
* నాగార్జునసాగర్‌కు తగ్గిన వరద.. 16 గేట్ల నుంచి నీరు విడుదల
* జగన్‌పై మహాసేన రాజేశ్ తీవ్ర వ్యాఖ్యలు
* ప్రత్తిపాడు: బాలుడిపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు
* నాగార్జునసాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు
* మాచర్ల: కుటుంబ కలహాలతో వ్యక్తి సూసైడ్
* గుంటూరులో చోరీ.. రూ.2 లక్షలు నగదు అపహరణ

News August 11, 2024

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

image

జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఆదివారం రెవెన్యూ ఉద్యోగులకు నిర్వహించిన సర్వే ఎగ్జామ్ జరుగుతున్న తీరును పరీక్షా కేంద్రమైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుందో పరిశీలించారు. ఈ పరీక్షకు అన్ని జిల్లాల నుంచి 1093కు గాను 943 మంది రెవెన్యూ ఉద్యోగులు సర్వే ఎగ్జామ్‌కు హాజరయ్యారైనట్లు అధికారులు తెలిపారు.

News August 11, 2024

నాగార్జునసాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు

image

ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్‌కు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. సాగర్‌ డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు నాగార్జున సాగర్‌ డ్యాంకు తరలివచ్చారు. సాగర్‌ గేట్ల ద్వారా జాలువారే నీటిని వీక్షిస్తున్నారు. శాంతిసిరి, నాగసిరి లాంచీలలో ప్రయాణిస్తూ నాగార్జున కొండ అందాలను చూస్తున్నారు.