Guntur

News August 9, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు ఎస్ఐల బదిలీలు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 12 మంది ఎస్ఐలను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుత బాపట్ల జిల్లాలో చందోలు, జే.పంగులూరు, కొరిశపాడు, యద్దనపాడు, చేరుకుపల్లి, పర్చూరు, వేటపాలేం, సంతమాగులూరు, అద్దంకి, మేదరమెట్ల, చీరాల వన్ టౌన్ ఎస్ఐలను బదిలీలు చేస్తూ ఎస్పీ తుషార్ డూడీ ఉత్తర్వులు జారీ చేశారు. 

News August 9, 2024

అంబేడ్కర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకుల నిరసన

image

విజయవాడలో డా. బిఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్న శిలాఫలకాన్ని ధ్వంసం చేయటాన్ని ఖండిస్తూ వైసీపీ నాయకులు గుంటూరు లాడ్జి సెంటర్ లో నిరసన తెలిపారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, గుంటూరు తూర్పు సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, పాలాభిషేకం చేశారు.

News August 9, 2024

పల్నాడు జిల్లాలో మహిళ దారుణ హత్య

image

నాదెండ్ల మండలం గణపవరంలో మహిళ హత్య కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. షేక్ కరిమూన్ అనే మహిళ ఒంటరిగా గ్రామ మసీదులోని ఓ గదిలో ఉంటుంది. ఒడిశా నుంచి కూలి పనికి వచ్చిన రాజు కూడా అదే మసీదులో ఉంటున్నాడు. గురువారం అర్ధరాత్రి కరిమూన్ గదిలోకి ప్రవేశించి ఆమెను హత్య చేసి పరారయ్యాడు. మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 9, 2024

గుంటూరు: గిరిజన అభ్యర్థులకు ఉచితంగా DSC శిక్షణ

image

రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగాంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గిరిజన (ఎస్టీ) విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కలెక్టరు ఎస్.నాగలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఈడీ, డీఈడీ పూర్తి చేసి టెట్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. మహిళలకు 33.1/ 3 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు.

News August 9, 2024

నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకుంది మన తెనాలి అమ్మాయినే

image

హీరో నాగ చైతన్య శోభితా ధూళిపాళ్ల గురువారం నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా శోభితా స్వస్థలం తెనాలి అన్న విషయం బాగా వైరల్ అవుతుంది. తెనాలికి చెందిన ఉపాధ్యాయుడు JVL శాస్త్రి, కమలమ్మ దంపతుల కుమార్తె శాంతాకామాక్షి. ఆమె తెనాలిలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఆమెకు విశాఖకు చెందిన వేణుగోపాల్‌తో వివాహమైంది. వీరికి శోభిత, సమంత సంతానం. ఇద్దరూ తెనాలిలోనే పుట్టారు. అనంతరం ముంబాయిలో స్థిరపడ్డారు.

News August 9, 2024

పల్నాడు జిల్లాలో ఎస్ఐల బదిలీలు

image

పల్నాడు జిల్లాలో పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ కంచి శ్రీనివాస్ రావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ చేసిన వారిని రిలీవ్ చేయాలని ఆయా సబ్ డివిజన్ల అధికారులకు, సీఐలకు ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయ్యి కొత్తగా పోస్టింగ్ లు ఇచ్చిన వారిని వెంటనే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో ఎస్పీ పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

News August 9, 2024

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలి: కలెక్టర్

image

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో గురువారం సమీక్ష నిర్వహించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా జిల్లా స్థాయి ఇండిపెండెన్స్ డే వేడుకలు నిర్వహిస్తున్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. అతిధులతో పాటు సాంస్కృతిక, అభివృద్ధి కార్యక్రమాల శకటాలు, స్టాల్స్ ప్రదర్శించాలన్నారు. 

News August 8, 2024

బ్రహ్మణికి హనుమంతరావును పరిచయం చేసిన లోకేశ్.. ప్రశంసలు

image

మంత్రి నారా లోకేశ్ తన సతీమణి బ్రహ్మణికి వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనమంతరావును పరిచయం చేసిన తీరు ప్రశంసలు పొందుతోంది. గురువారం ఉదయం మంగళగిరిలోని ఆలయ కల్యాణ మండపం ప్రారంభోత్సవానికి వచ్చిన వీరు పార్టీలకు అతీతంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పై ఫొటోలోని దృశ్యం అక్కడి వారిని ఆకర్షించింది. కాగా, మురుగుడు హనుమంతరావు కోడలు అయిన లావణ్యపై మంగళగిరిలో లోకేశ్ గెలిచిన విషయం తెలిసిందే.

News August 8, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఆయన వీరాభిమానులు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ ఊరు పర్యటనకు వెళ్లినా అక్కడ తమ స్కూటీతో ప్రత్యక్షమయ్యే వీరాభిమానులు గురువారం ఆయన్ను కలిశారు. దెందులూరుకు చెందిన దుర్గాదేవి, వినుకొండకు చెందిన శివరాజు యాదవ్‌లను సీఎం నేడు పిలిపించుకున్నారు. వారిని ఆప్యాయంగా పలకరించి వారి కుటుంబ నేపథ్యాన్ని వాకబు చేశారు. సాక్షాత్తూ తమ అభిమాన నాయకుడు నేరుగా తమతో మాట్లాడటంతో దుర్గా, శివరాజు యాదవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

News August 7, 2024

లోకేశ్ ట్వీట్‌పై మాజీ మంత్రి అంబటి ఫైర్

image

మంత్రి నారా లోకేశ్ జగన్ భద్రత విషయంపై చేసిన ట్వీట్ గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. జగన్ కాన్వాయ్‌లో ల్యాండ్ క్రూయిజర్‌లు ఉన్నాయని లోకేశ్ అబద్దపు పోస్టులు పెడుతున్నారన్నారు. ల్యాండ్ క్రూయిజర్‌లు ఎక్కడ ఉన్నాయో చూపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక లోపభూయిష్టంగా ఉన్న బుల్లెట్ కారు కేటాయించారన్నారు.