Guntur

News August 7, 2024

లోకేశ్ ట్వీట్‌పై మాజీ మంత్రి అంబటి ఫైర్

image

మంత్రి నారా లోకేశ్ జగన్ భద్రత విషయంపై చేసిన ట్వీట్ గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. జగన్ కాన్వాయ్‌లో ల్యాండ్ క్రూయిజర్‌లు ఉన్నాయని లోకేశ్ అబద్దపు పోస్టులు పెడుతున్నారన్నారు. ల్యాండ్ క్రూయిజర్‌లు ఎక్కడ ఉన్నాయో చూపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక లోపభూయిష్టంగా ఉన్న బుల్లెట్ కారు కేటాయించారన్నారు.

News August 7, 2024

గుంటూరులో జాబ్ మేళా.. అర్హతలివే

image

గుంటూరు గుజ్జనగుండ్లలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 8న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.రఘు తెలిపారు. పేటీఎం, సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్, జయలక్ష్మి ఆటోమొబైల్స్, పలు కంపెనీలలో ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఇందుకోసం టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

News August 7, 2024

‘షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలి’

image

పెన్షన్ పంపిణీలో ఆలస్యం చేశారనే కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మందికి పైగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వీటిని ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ కోరారు. ఈ మేరకు వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామికి వినతిపత్రం అందజేశారు. షణ్ముఖ్, పార్ష మధు, మణికంఠ పాల్గొన్నారు.

News August 6, 2024

పాఠశాల విద్యపై మంత్రి లోకేశ్ సమీక్ష

image

పాఠశాల విద్యలో దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఏపీ మోడల్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం రాత్రి మంత్రి అధికారులతో సమీక్షించారు. కేజీబీవీ స్కూళ్లలో పూర్తిగా ప్రతిభ ఆధారంగానే పోస్టులు వేయాలన్నారు. గురుపూజోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

News August 6, 2024

మాచర్ల: ‘నేను ఏ తప్పు చేయలేదు’ అంటూ.. సూసైడ్

image

మాచర్లలో సోమవారం విద్యార్థిని <<13779862>>ఆత్మహత్య చేసుకున్న<<>> విషయం తెలిసిందే. తోటి విద్యార్థి రేణుకకు ఫోన్ చేస్తే పనిలో ఉండి స్పందిలేదు. దీంతో అతడు యువతి తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. రేణుకకు ఫోన్ చేసిన తండ్రి ‘అబ్బాయిలతో ఏం పని అని కోపడ్డాడు. భయపడిన యువతి తాను అన్నలా భావించిన తోటి విద్యార్థితో ఉన్న సంబంధాన్ని తండ్రి తప్పుగా అర్థం చేసుకున్నాడు. తాను ఏ తప్పు చేయలేదంటూ లెటర్ రాసి హాస్టల్లో సూసైడ్ చేసుకుంది.

News August 5, 2024

గుంటూరు: TODAY TOP NEWS

image

* అమరావతిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
* పల్నాడు జిల్లాలో రోడ్డుపై మొసలి కలకలం
* ఉద్దేశపూర్వకంగానే చెత్తకుప్పలో ఫైళ్లు
* మాచర్ల: బీటెక్ విద్యార్థిని సూసైడ్
* మాచవరం: ఇళ్లపై దాడి.. 9 మంది అరెస్ట్
* ఈ నెల 7న బాపట్లకు సీఎం చంద్రబాబు
* పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఆయిల్ దొంగలు

News August 5, 2024

ఏ మున్సిపాలిటీలోనూ చెత్త క‌న‌ప‌డ‌టానికి వీల్లేదు: సీఎం

image

ఏపీలో ఏ మున్సిపాల్టీలో కూడా చెత్త క‌న‌ప‌డ‌టానికి వీల్లేద‌ని సీఎం చంద్ర‌బాబు అధికారులను ఆదేశించారు. స‌చివాల‌యంలో జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడుతూ.. ప‌ట్ట‌ణాలు, గ్రామాలు ప‌రిశుభ్రంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అంటువ్యాధుల ప‌ట్ల శ్ర‌ద్ద క‌న‌బ‌ర‌చాల‌న్నారు. క్ర‌మం త‌ప్ప‌కుండా నీటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంతో పాటు దోమ‌ల బెడ‌ద నివారించ‌డానికి డ్రోన్ స‌హ‌కారం తీసుకోవాలన్నారు. 

News August 5, 2024

ఈ నెల 7న బాపట్లకు సీఎం చంద్రబాబు

image

ఈ నెల 7న సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగే చేనేత దినోత్సవాల్లో చంద్రబాబు పాల్గొననున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సోమవారం చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో హెలిపాడ్‌ను బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బారావు పరిశీలించారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని జేసీ సూచించారు.

News August 5, 2024

ఈ నెల 7న బాపట్లకు సీఎం చంద్రబాబు

image

ఈ నెల 7న సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగే చేనేత దినోత్సవ వేడుకలలో చంద్రబాబు పాల్గొననున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సోమవారం చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో హెలిపాడ్‌ను బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బారావు పరిశీలించారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని జేసీ సూచించారు.

News August 5, 2024

అమరావతిలో భూమి సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం

image

రాజధాని పరిధిలో ప్రతి సెంటు భూమి సమీకరణ లేదా సేకరణ విధానంలో తీసుకోవాలని నిర్ణయించింది. గ్రామాలు, గ్రామకంఠాల కిందనున్న భూమి తప్ప మిగిలినదంతా తీసుకోనుంది. దీనిలో ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఉండదని CRDA వర్గాలు స్పష్టంచేశాయి. భవనాలను CRDA స్వాధీనం చేసుకునే అవకాశముంది. భూములపై కోర్టు స్టేలు ఉంటే వాటిని వెకేట్ చేయించి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో ఇంకా 4,181 ఎకరాలు తీసుకోవాల్సి ఉంది.