Guntur

News March 14, 2025

పిల్లలతో అన్ని సమస్యలు గురించి చర్చించాలి: DMHO

image

గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం పిల్లలపై లైంగిక దాడులను నివారించడంపై ఐసీడీఎస్, చైల్డ్ ప్రొటెక్షన్, ఎంఈఓలు ప్రోగ్రాం అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు స్నేహపూరితమైన వాతావరణంలో పిల్లలతో అన్ని సమస్యలు గురించి చర్చించాలని, అప్పుడే పిల్లలు అన్ని విషయాలు పంచుకుంటారన్నారు. తద్వారా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపవచ్చన్నారు. 

News March 14, 2025

గుంటూరు: లారీ ఢీకొని వృద్ధుడి దుర్మరణం

image

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లపాడు రోడ్డులోని ఓ కళాశాల వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొత్తకాలనీ ప్రాంతానికి చెందిన రత్నాకర్(64)బైక్‌పై వెళ్తుండగా వెనుకగా వచ్చిన లారీ అతడిని ఢీకొట్టి పైకి ఎక్కింది. దీంతో రత్నాకర్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సింది.

News March 14, 2025

గుంటూరు జిల్లా ఎస్పీ వార్నింగ్

image

గుంటూరు జిల్లా ప్రజలు స్నేహపూర్వక వాతావరణంలో మత సామరస్యానికి ప్రతీకగా హోలీ పండుగ జరుపుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. ఇతర మతస్థుల వ్యక్తిగత స్వేచ్ఛను, వారి మతాచారాలను గౌరవిస్తూ వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆకతాయి చేష్టలకు, అల్లర్లకు తావివ్వకుండా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చేయాలన్నారు. ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తే చర్యలు తప్పవన్నారు.

News March 13, 2025

తుళ్లూరు: చంద్రబాబును కలిసిన డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్

image

డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలను, ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు సంబంధించి ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

News March 13, 2025

మరో కేసులో బోరగడ్డ అనిల్‌‌కు రిమాండ్

image

YCP నేత బోరుగడ్డ అనిల్‌పై మచిలీపట్నం చిలకలపూడి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై దూషణ కేసులో అనిల్ కుమార్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఆయనపై గతంలో చిలకలపూడి PSలో 2 కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయనను విచారించేందుకు రాజమండ్రి నుంచి కాసేపటి క్రితం అనిల్‌ను పోలీసులు మచిలీపట్నం తీసుకువచ్చి జడ్జి ముందు హాజరుపర్చగా రిమాండ్ విధించారు.

News March 13, 2025

తుళ్లూరు: మైక్రోసాఫ్ట్‌తో లోకేశ్ కీలక ఒప్పందం

image

రాష్ట్రంలోని యువతకు ఎఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్‌తో ఎపీ ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో గురువారం మంత్రి లోకేశ్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏడాది వ్యవధిలో 2లక్షల మంది యువతకు మైక్రోసాఫ్ట్ సంస్థ స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇస్తుందని లోకేశ్ తెలిపారు.

News March 13, 2025

GNT: టీడీపీ ఎమ్మెల్యేపై కేసు కొట్టివేత

image

గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఊరట దక్కింది. వివరాల్లోకి వెళ్తే.. ఓబులాపురం మైనింగ్‌పై గతంలో టీడీపీ నేతలు చేసిన ఆందోళనలకు సంబంధించిన కేసును గురువారం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చినరాజప్ప, ధూళిపాళ్ల, జనార్దన్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ కేసు నుంచి విముక్తి పొందారు.

News March 13, 2025

గుంటూరులో ఫైనాన్స్ కంపెనీ భారీ మోసం

image

ఐదున్నర కిలోల బంగారం తాకట్టు పెడితే కేవలం వెయ్యి గ్రాములే అని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు పత్రాలు సృష్టించి ఓ వైద్యురాలిని మోసం చేశారు. పోలీసుల కథనం మేరకు.. ముత్యాలరెడ్డి నగర్‌కి చెందిన ఓ వైద్యురాలు అరండల్‌పేటలోని ఓ ప్రయివేట్ ఫైనాన్స్‌ కంపెనీలో ఐదున్నర కిలోల బంగారాన్ని తాకట్టు పెట్టారు. సంస్థలో పనిచేసే ఐదుగురు సిండికేట్‌గా ఏర్పడి నాలుగున్నర కేజీల బంగారాన్ని తప్పుడు పత్రాలతో కాజేశారు.

News March 13, 2025

గుంటూరు కమిషనర్ ఆదేశాలు

image

GMCకి ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదార్లు గృహాల, వ్యాపార సంస్థల ట్యాప్ కనెక్షన్‌లు తొలగించుట, ఆస్తులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం సీజ్ చేయాలన్నారు. బుధవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆస్తి పన్ను వసూళ్ళ పై రెవిన్యూ విభాగం, విభాగాధిపతులతో సమీక్షా సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ.. గుంటూరులో 3 ఏళ్ల కు పైగా ఆస్తి పన్ను బకాయి ఉన్న వారి నివాసాలకు సీజు చేయమని ఆదేశించారు.

News March 12, 2025

గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

గుంటూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని కొత్తపేట పోలీసులు తెలిపారు. జీజీహెచ్ ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద వ్యక్తి చనిపోయాడని సెక్యూరిటీ గార్డు కొత్తపేట పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మార్చురీకి తరలించారు. ఈ వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే పోలీసుల్ని సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.